BB Political & Social Events

ఓం నమః శివాయ 🌷🙏
19/06/2025

ఓం నమః శివాయ 🌷🙏

శ్రీ మాత్రే నమః 🌷🙏
19/06/2025

శ్రీ మాత్రే నమః 🌷🙏

🌹"శ్రీ విష్ణు పురాణం"🌹_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*__* 18వ భాగం:-*_మేరుగిరికి తూర్పున మందరగ...
19/12/2024

🌹"శ్రీ విష్ణు పురాణం"🌹

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

_* 18వ భాగం:-*_

మేరుగిరికి తూర్పున మందరగిరి, దక్షిణాన గంధమాదనం ఉన్నాయి. దాని శిఖరమునందు రావి, నేరేడు, కడిమి, మర్రిచెట్లు జెండాల్లాగా దుబ్బుగా ఎత్తుగా పెరిగినవి ఉంటాయి.

జంబూవృక్షం పేరుతో ఆ ద్వీపానికి ఆ పేరు ప్రసిద్ధం అయింది. దాని ఫలాలు ఏనుగంతలేసి ఉంటాయి. ఆ పళ్లు హేమకూటాచలం సానువులలో పడి చిదిగి రసం పారుతూ ఉంటుంది. అది మేరుగిరి చుట్టూ కమ్మి ఉంటుంది. ఆ ప్రవాహం జాంబూనదం అని పేరు పొందింది. ఆ ఫలరసం త్రాగుతూ అక్కడ ఉండేవారికి ఏలాటి రోగాలూ రావు. ముసలితనం అంటదు. దేవతలకు సాటిగా సుఖజీవనులు అవుతారు. ఇంకా విశేషం ఏమిటంటే ఆ ఫలరసం తాకిన మన్ను బంగారం అవుతుంది. ఆ కారణంవల్ల బంగారానికి జాంబూనదం అని ఒక చక్కని పేరు కలిగింది.

చైత్రరథం, గంధమాదనం, వైభ్రాజితం, నందనం అనే ఉపవనాలు అరుణాధర మహాపద్మనీలోదక మానసములు అనే సరస్సులూ మేరుగిరికి తూర్పు మొదలుగా నాల్గుదిక్కులా ఉండి దేవతలకు అనుభవములవుతూ ఉన్నాయి.

అలాగే ఆ బంగారు కొండకు నలుదిక్కులా గొప్ప పర్వతాలున్నాయి.

ఆలాంటి మేరుపర్వతం మీది దేవరాజధాని పదునాల్గు వేల యోజనాల వైశాల్యముతో సువర్ణరత్నస్థగిత గోపుర భవనాలతో త్రిజగన్నుతమై ఉన్నది.

విష్ణుపాదమునుంచి బయల్వెడలిన ఆకాశగంగ నాలుగుపాయలై సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లు గలదై ఆ అమర రాజధానికి నలుదిక్కులా ప్రవహించి కిందనున్న భారతాది వర్షములందు ప్రవహిస్తూ ఉంటుంది.

వాసుదేవుడు భద్రాశ్వవర్షమునందు హయగ్రీవ రూపముతోను, భారతవర్షమున కూర్మరూపముతోను, కేతుమాలా వర్షమున వరాహరూపముతోను, కురువర్షమున మత్స్యరూపముతోను తక్కిన వర్షములందు వివిధ రూపాలతోను ఉంటాడు.

అలాంటి కింపురుషాదివర్షములందు ఉన్న వారికి శోకం, ఆయాసం, ఉద్వేగం, దీపనం అనేవి ఉండవు. చిరంజీవులై సుఖసంతోషాలతో ఉంటారు.

భారతవర్షమునందు ప్రత్యేకించి కులపర్వతాలూ మహానదులూ చాలా ఉన్నాయి.

హిమగిరినుంచి దక్షిణ సముద్రం వరకు తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణము కలదై భారతవర్షం ఉన్నది. అది కర్మభూమిగా ప్రసిద్ధం. పుణ్యాత్ములకు స్వర్గమోక్షప్రదం. మునులూ, సురలూ భారతవర్షమునందు నివసించాలని కోరుతూ ఉంటారు. జపతపోదానయజ్ఞాదులు యథాశక్తిగా చేసి తాము కోరే పుణ్యలోకాలు పొందడానికి భారతవర్షమే ప్రధానపీఠం.

మలయం, మహేంద్రం, శుక్తిమంతం, వింద్యం, పాఠియాత్రం, ఋక్షం, సహ్యగిరి అని ప్రసిద్ధములైన కులపర్వతాలు భరత ఖండానికి భవ్యాలంకారాలు.

శతద్రు, చంద్రభాగ అనే నదులు మహేంద్ర పర్వతమునందు, వేదస్మృత్యాదులు పారియాత్రమునందు, నర్మదాదులు వింధ్యమునందు, తాపీపయోష్లీ నిర్వింధ్యాదులు ఋక్షమునందు, గోదావరీ భీమరథీకృష్ణ వేణ్యాదులు సహ్యమునందు, తామ్రపర్ణీ కృతమాలాదులు మలయపర్వతము నందు, ఋషికుల్యాదులు శుక్తిమంతమునందు ప్రభవించాయి. ఇలాగే ఇంక కొన్ని పుణ్యనదులు ఉన్నాయి.

భరతవర్షానికి నలువైపులా వెయ్యేసి యోజనాల విరివితో తొమ్మిది ద్వీపాలూ ఉన్నాయి. ఇలాంటి నవద్వీపాలూ, మహానదులూ, కులపర్వతాలూ, భరతవర్షమునందు తప్ప ఇంకే వర్షమునందు లేవు. ఈ విధముగా భారతవర్షం కర్మభూమి, పుణ్యభూమి అయింది. మిగిలినవి భోగభూములు.

జంబూద్వీపం లక్షయోజనాల పరిణామం కలది. దానికి చుట్టూ ఉండేది లవణ సముద్రం.

లవణ సముద్రానికి ఆవల ఉన్నది ప్లక్షద్వీపం. అది రెండు లక్షల యోజనాల పరిణామం కలది.

ఆ ద్వీపానికి ప్రభువు మేధాతిథి. అతనికి ఏడుగురు కొడుకులు. భుజబలానికీ, రూపరేఖావైభవానికీ వారికి వారే సాటి. తండ్రి ఆ ద్వీపమును ఏడు భాగాలుగా విభజించి వారిని ప్రభువులను చేశాడు. ఆ భాగాలకు వారి పేర్లు వచ్చాయి.

శాంత, హయ, శిశిర, సుఖోదయ, నంద, శివ, క్షేమక, ధ్రువ వర్షములని వాటి పేర్లు.

ఆ వర్షములలో ఉన్న నరులు సురలు కలిసి సోదరుల్లాగా జీవిస్తూ ఉంటారు. వారికి రోగాలూ ఏలాటి బాధలూ ఉండవు. కారణం? ధర్మానికి ఆ నరులు పెట్టినది పేరు.

ప్లక్షము = జువ్విచెట్టు. అది ఆ ద్వీపానికి పేరు తెచ్చినది.

విష్ణువు చంద్రరూపుడై ఆ ద్వీపములో భాసిస్తూ ఉంటాడు. ప్లక్షద్వీపానికి ఆవల ఉన్నది ఇక్షు సముద్రం. అది లక్ష యోజనాల వైశాల్యం గలది.

ఇక్షు సముద్రానికి ఆవల ఉన్నది శాల్మలద్వీపం, (బూరుగుమాను) దాని విరివి నాలుగు లక్షల యోజనాలు. దాని ప్రభువు వపుష్మంతుడు. అతనికి సుతులు ఏడ్గురు.

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*__*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*__* 17వ భాగం:-*_స్వాయంభువన...
18/12/2024

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

_* 17వ భాగం:-*_

స్వాయంభువనందనుడైన ప్రియవ్రతుని భార్య కుక్షి. ఆమె కర్దమ ప్రజాపతి కూతురు. ఆ దంపతులకు పదిమంది కొడుకులు. వారు - అగ్నీధ్రుడు, మేధాతిథి, వపుష్యంతుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సవనుడు, మేథుడు, అగ్నిబాహుడు, పుత్రుడు.

వారిలో మేథుడు, అగ్నిబాహుడు, పుత్రుడు పూర్వజన్మ స్మృతికలవారై విరక్తులై యోగనిరతులై భువి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ఏడుగురు కుమారులలో ఆగ్నీధ్రునకు జంబూద్వీపం, మేథాతిథికి ప్లక్షద్వీపం, వపుష్మంతునకు శాల్మలి, జ్యోతిష్మంతునకు కుశద్వీపం, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపం, హవ్యునకు శాకద్వీపం, సవనునకు పుష్కరద్వీపం ఇచ్చి రాజ్యాభిషిక్తులను చేశాడు. వారు ఇంద్రమిత్రులై సప్తద్వీపాలనూ ఎదురులేని పరాక్రమముతో ధర్మమార్గాన పాలించారు.

జంబూద్వీపాధిపతియైన ఆగ్నీధ్రునకు తొమ్మిది మంది కొడుకులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అని వారి పేర్లు.

ఆ తండ్రి జంబూద్వీపమును తొమ్మిది భాగాలుగా చేసి వాటికి వరుసగా వారిని రాజులనుగా చేశాడు. తరువాత ఆగ్నీధ్రుడు సాలగ్రామ తీర్థానికి పోయి తపస్వి అయ్యాడు. ఆ కొడుకులు పాలించే నవఖండాలూ వారి పేర్లతో వర్షసంజ్ఞలు కలవయ్యాయి.

నాభి హిమగిరికి దక్షిణభాగముగా ఉన్న భూమికి అధిపతి అయ్యాడు. అతని కొడుకు వృషభుడు. అతనికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు భరతుడు.

ఆ భరతుడు భూపతియై శత్రుభంజనుడు, ప్రజారంజనుడై భూమిని పాలించి ఇంద్రునకు ప్రేమాస్పదుడయి యజ్ఞాలు సురనర ప్రీతిగా చేసి పూర్వుల కీర్తికి మిన్నగా కీర్తినార్జించాడు. వాని పేరుతో నాభి వర్షం భరత ఖండముగా ప్రసిద్ధమయింది. వాని తండ్రి భూభారమంతా కొడుకుపై ఉంచి తపశ్చర్యకై పులహాశ్రమానికి వెళ్లిపోయాడు.

భరతుడు చిరకాలం రాజ్యం పాలించి కొడుకుని సుమతిని పట్టాభిషిక్తుణ్ణి చేసి సాలగ్రామ క్షేత్రానికి వెళ్లాడు. పతిని ఆరాధించి తనుత్యాగం చేసి మలిజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టాడు.

భరతనందనుడైన సుమతికి కలిగిన సుతుడు ఇంద్రద్యుమ్నుడు. అలాగ భరతవంశం విస్తరించింది అని పరాశరుడు చెప్పగా విని మైత్రేయుడు సరే. ఇక భూమండల వైశాల్యం, సప్తద్వీప చరిత్ర, నదీసాగర పర్వత విస్తార విషయం, సురాసుర గంధర్వ నగరవృత్తాంతం వినాలని ఉన్నది. చెప్పవలసిందని అనగా ఆ ఆచార్యుడు శిష్యుడికి చెప్పాడు.

శిష్యా! నీవడిగిన విషయం సమగ్రంగా చెప్పడం చాలాకాలం అవుతుంది. అలా చెప్పడం అసాధ్యం. సంగ్రహించి చెప్తాను విను.

ఏడు ద్వీపాలకూ చుట్టు లవణ, ఇక్షు, సురా, సర్పి, దధి, క్షీర, జల సముద్రాలుంటాయి. అవి ఒకదానికి ఒకటి రెండింతలు విస్తీర్ణములు. ఈ ద్వీపాలకు నడుమ ఉన్నది జంబూద్వీపం. దానిమధ్య నున్నది మేరుపర్వతం. అది యక్షకిన్నర గంధర్వ తాపస దేవతల నివాసముగా చెప్పదగినది. దానికి దక్షిణముగా హిమగిరి, హేమకూటం, నిషధ పర్వతం - తూర్పు పడమర దిక్కులకు వ్యాపించి సమున్నతములై ఉన్నాయి.

నీలాచలం, వెండికొండ, మేరు పర్వతానికి చెప్పవలసిన శిఖరాలు.

ఒక్కొక్క పర్వతం రెండువేల యోజనాల విస్తీర్ణం, ఔన్నత్యం కలవై దక్షిణోత్తర భాగాలలో ఉంటాయి.

తూర్పున దేవకూటం, పడమటను జఠరపర్వతం ఉంటాయి.

మేరుపర్వతానికి దక్షిణమున భారతకింపురుష హరివర్షములు, ఉత్తరాన రమ్యక హిరణ్మయ కింపురుష వర్షములు, తూర్పున భద్రాశ్వ వర్షం, పడమటను కేతుమాలావర్షం - వాటి నడుమ ఇలా వృతవర్షం ఉన్నాయి.

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

*🕉️🪷"శ్రీ విష్ణు పురాణం"🪷🕉️*_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*_🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️_* 16వ భాగం:-*_తార ...
17/12/2024

*🕉️🪷"శ్రీ విష్ణు పురాణం"🪷🕉️*

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️

_* 16వ భాగం:-*_

తార అనే దానికి శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధ్ర అని ఆర్గురు కలిగారు. శుకికి శుకాలు, శ్యేనికి శ్యేనకపోతాలు, శుచికి జలపక్షులు, సుగ్రీవికి అశ్వ, ఉష్ణ, గార్దభాలు పుట్టాయి.

వినతకు అనూరుడు, గరుడుడు పుట్టారు. గరుడుడు సర్పాశనుడు, విష్ణువునకు వాహనం అయ్యాడు.

సురసకు వేయిలెక్కను విషపూర్ణములైన సర్పాలు పుట్టాయి.

కద్రువకు శేష వాసుకి కాలనాభ శంఖ పద్మ మహాభోగ శంబతక్షాదులు వేయిమంది నాగరాజులు పుట్టారు. వీరందరూ గరుత్మంతునకు వశులైనారు.

క్రోధవశ అనే దానికి క్రోధమూర్తులూ పెద్ద కోరలు గల క్రూర జంతుజాలాలు పుట్టాయి.

సురభికి గోవులు మహిషాలు పుట్టాయి.

ఇలకు యక్షరాక్షసులు పుట్టారు.

మునికి అప్సరో గణాలు జన్మించారు.

అరిష్ట సంతతి గంధర్వులు,

కశ్యప వంశం ఇలాగ అనేక సహస్ర సంఖ్యను పుత్రపౌత్రాభివృద్ధి కలదై స్థావరజంగమ రూపాలతో లోకములందు నిండి ఉన్నది. ఇదంతా స్వారోచిష మన్వంతరమందు శ్రీనాథుని రాజసగుణ కల్పితమైన సృష్టి.

అదితినందనుడైన ఇంద్రుని వజ్రాయుధమునకు దైత్యదానవ సమూహం బలికాగా దితి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలాకాలం సంతతి కోర్కెతో నిరంతరం సేవ చేసింది. అది వైవస్వత మన్వంతరం. దాని సేవకు మెచ్చి కశ్యపుడు ఏమి నీ కోరిక? అని అడిగాడు.

ఇంద్రుణ్ణి చంపి శచితో సహ దేవరాజ్యం ఏలే కొడుకుని ప్రసాదించు నాథా! అని దితి అడిగింది.

సరే శుచిగా ఉంటూ (అవయవశుద్ధి కలిగి) నియమంగా వ్రతం చేస్తూ ఉండు. నీ కోరిన కొడుకు కలుగుతాడు. అశుచిగా ప్రవర్తిస్తే గర్భం నశిస్తుంది అని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్లిపోయాడు. దీతి నియమం
పాటించి ప్రవర్తించగా గర్భవతి అయింది. ఇంద్రుడికి దితి కోరిక తెలిసి వచ్చి కపటపు భక్తితో సవతితల్లికి సేవచేస్తూ ఉండేవాడు.

అలా ఉండగా దితి ఒకనాడు భోజనం చేసి పాదప్రక్షాళనం చెయ్యక లోనికి వచ్చి జుత్తు విరబోసుకుని పాన్పుమీద వాలి నిద్రాముద్రిత అయింది. ఇదే సమయం అని ఇంద్రుడు సూక్ష్మరూపముతో దితి కడుపులో ప్రవేశించి లోపల ఉన్న శిశువు ఏడ్వగా - మారోదీ: (ఏడవకు) అని వజ్రముచే ఆ శిశువును ఏడు ఖండాలుగా నరికి వాటిని మళ్లీ నలభై తొమ్మిది తునియలుగా చేసి బయల్పడి చడీచప్పుడూ లేకుండా వెళ్లిపోయాడు. ఆ నలభై తొమ్మిది ఖండాలూ రూపాలు ధరించి ఇంద్రుడికి తోడుగా అయిపోయారు. మారోదీ: అని యింద్రుని మాటననుసరించి వారు మరుద్గణాలుగా ప్రసిద్ధులయ్యారు.

మునుపు పృథువును పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తరువాత ఆయా శాఖలకు అధిపతులుగా కొందరిని నిర్ణయించాడు.

నక్షత్ర గ్రహ విప్ర తపోయజ్ఞ వృక్షలతా గుల్మాదులకు చంద్రుడు, రాజులకు వైశ్రవణుడు, జలమునకు వరుణుడు, ఆదిత్యులకు ఉపేంద్రుడైన విష్ణువు, వసువులకు పావకుడు, ప్రజాపతులకు దక్షుడు, మరుద్గణాలకు ఇంద్రుడు, మునులకు కపిలుడు, చైత్యదానవులకు ప్రహ్లాదుడు, పితృగణములకు యముడు, ఏనుగులకు ఐరావతం, పక్షులకు గరుత్మంతుడు, సర్పాలకు వాసుకి, అశ్వములకు ఉచ్చైశ్రవం, గోవులకు వృషభం, మృగాలకు సింహం, వృక్షాలకు ప్లక్షం, (జువ్విచెట్టు) పర్వతాలకు హిమగిరి అధిపతులు.

ఇప్పుడు చెప్పిన వీరందరూ విష్ణుని అంశతో పుట్టినవారే. ఆయన ప్రభావము లేకపోతే ఏదీ లేదు. పాలకునియందు విష్ణుభావం లీనమై ఉంటుంది.

కాలం, చరాచరాత్మకమైన జగత్తు, మంత్రతంత్రాలు, యజ్ఞయాగాలూ, గురువు, దేవతలు కర్మజ్ఞానేంద్రియాలూ సమస్తమూ విష్ణురూపమని తెలుసుకో!

అలాగే వేదాలూ, ఉపనిషత్తులూ, శాస్త్రాలూ, ధర్మశాస్త్రాలూ, పురాణాలూ, అనువాకాలు, కావ్యాలూ, సంగీతాదివిద్యలూ మూర్తిమూర్తాలూ ఆ పురుషోత్తముని మూర్తి భేదాలని గ్రహించు!

మైత్రేయా! _*ఈ పురాణకథ చదివినా ఎన్నో వ్రతాలూ కార్తీకస్నానాలూ పుణ్యక్షేత్ర దర్శనం చేసిన పుణ్యఫలం వస్తుంది*_ అని చెప్పగా మైత్రేయుడు ఆనందముగా నమస్కరించి గురుదేవా! ధన్యుడను. ఇక ఒక మనవి. ఉత్తానపాదుని అన్వయ కథ చెప్పావు. ఆ ప్రియవ్రతునికి, అతని కొడుకులకూ సంబంధించిన రాజచరిత్ర వినాలని ఉంది అని అనగా సరే చెప్తానన్నాడు. పరాశరుడు.

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*__*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*_🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️_*👉 15వ భాగ...
16/12/2024

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️

_*👉 15వ భాగం:-*_

హిరణ్యకశిపుడు కుక్కిన పేనులాగా నోరు మూసుకుని వింతగా చింతగా చూస్తూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మళ్లీ గురువువద్దకు వెళ్లిపోయాడు...

కొన్నాళ్లు గడచిన తరువాత హిరణ్యకశిపుడు కొడుకుని రప్పించి ఏమి నీ బుద్ధి మారిందా లేదా? గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు. నాయనా? నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకి అంకితమైపోయింది. లౌకికమైన కులవిద్యకి కట్టుపడదు. ఇదే నా నిర్ణయం అని ప్రహ్లాదుడు చెప్పగా హిరణ్యకశిపుడు మితిమీరిన కోపముతో చూసి సరే. ఇక నిన్ను మారణహోమంతో తుదముట్టించవలసిందే అని తన భటులను చూసి వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రములో పడద్రోసి పైన ఒక కొండ పడవేసి చంపి రండి అని శాసించాడు. వారు ప్రహ్లాదుని తోడుకొని వెళ్లి తాళ్లతో కట్టి సముద్రములో పడద్రోసి పైన ఒక కొండ వేశారు.

ప్రహ్లాదుడు చలించలేదు. శ్రీహరిని తన హృదయపద్మములో ధ్యానముద్రతో ప్రతిష్టించి స్తుతిస్తూ హాయిగా ఉన్నాడు. గట్టున ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను ప్రక్కకు తొలగించి ప్రహ్లాదుణ్ణి అల్లనల్లన గట్టుకి చేర్చింది. ఆ రక్కసుల ఆశ్చర్యానికి అంతు లేదు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడై ఉన్న భక్తునకు కొండలూ బండలూ ప్రమాదకరము లవుతాయా?... చంపడానికి నిల్చున్న రాక్షస భటులు బెదిరి కొంతదూరాన ఉన్న చెట్లకిందికి పారిపోయారు. ఆ సమయములో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయ హస్తముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుణ్ణి చూసి ప్రహ్లాదుడు పరమానందభరితుడై చేతులు జోడించి స్తుతించాడు.

_*పుండరీకాక్షా! ఆశ్రితపక్షా! అధర్మశిక్షా! ధర్మవర్ధనా! దుర్మతిమర్దనా! శ్రీపతీ! యోగసద్గతీ! వాసుదేవా! మహానుభావా! నిర్వికారా! సదాధారా! గోబ్రాహ్మణహితా! త్రిగుణాతీతా! పరమపావనా! బ్రహ్మణ్యదేవా! గోవిందా! సచ్చిదానందా! సనకాది యోగీంద్రసన్నుతా! హృషీకేశా! నమస్తే నమస్తే నమస్తే!*_/

ప్రహ్లాదుని స్తుతికి సంతసించి శ్రీహరి దగ్గరగా తీసుకుని అల్లనల్లన శరీరం నిమిరి ప్రహ్లాదా! బాల్యంలో ఉన్న వాడవే అయినా నీ తండ్రి చేసిన దారుణకర్మకు బెదరక నన్ను మనసా వదలక భక్తియుక్తుడవై ప్రవర్తిస్తూన్నావు కనుక నువ్వు కోరిన వరం ఇస్తాను అడుగు- అని ఆప్యాయంగా అనగా దేవా! నేను ఏ జన్మలోనూ నీ పాదభక్తి వదలని మనసు కలవాడనై ఉండేట్టు వరం అనుగ్రహించు! అని ప్రహ్లాదుడు అడిగాడు.

ప్రహ్లాదా! నీకు మరి జన్మ లేదు. నీ యీ ప్రవర్తన విష్ణుభక్తులకు మేల్బంతి అయింది. ముక్తి నీ చేతిబంతి. పాపం నీ చుట్టుప్రక్కల చేరదు. కాబట్టి నాయందు భక్తిని గురించి అలా ఉండనీ, ఇంకొక వరం కోరుకో అని విష్ణువనగా నా తండ్రి అహంకారముతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు. నా ప్రార్థన మన్నించి అతని చెడుతనమును పోగొట్టి పుణ్యాత్ముణ్ణి చెయ్యవలసిందని నా కోరిక అని ప్రహ్లాదుడు కోరాడు.

ఆ మాటకి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే నీ తండ్రి పుణ్యమార్గం నేను చూస్తానులే. ఇంకొక వరం అడుగు అని అనగా నేను సంసారినయినా పురుషార్ధములను నాల్గింటినీ ధర్మప్రవృత్తితో నీ భక్తి చేయూతగా సాధించేవాడను అయ్యేట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు.

తథాస్తు! అని చెక్కిలి నిమిరి శ్రీహరి అదృశ్యుడయ్యాడు. ప్రహ్లాదుడు చిన్నారి నడకలతో నగరం ప్రవేశించి తండ్రివద్దకు వెళ్లి నమస్కరించి ప్రక్కగా నిల్చున్నాడు.

హిరణ్యకశిపుడు హరి వరంవల్ల మునుపటి ద్వేషం పోయి సత్వగుణం కలవాడై కొడుకును కాగిలించుకుని శిరసు మూర్కొని చెక్కిలి నిమిరి కుమారా! నావల్ల పడరాని బాధపడినా ఆ శ్రీహరి దయవల్ల క్షేమంగా ఉన్నావు. ఇది నా భాగ్యం అని లాలనగా ఓదార్చి కొడుకుతో ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీరత్యాగం సామాన్యముగా అవదు. ఆ విష్ణువువల్లనే అవ్వాలని మళ్లీ రాజసమూర్తియై విష్ణువును ద్వేషించనారంభించాడు. అంతట ఒకనాడు నిండు సభలో లోకభీకరమైన అట్టహాసం; ఒకింత సేపటికి స్తంభం విరిగింది. దానిలోంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు.

తరువాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలం ధర్మమార్గాన జనరంజనముగా పరిపాలించి పుత్రపౌత్రాభివృద్ధితో ఆనందముగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడుగా ప్రసిద్ధుడయ్యాడు.

_*పౌర్ణమి, అష్టమి, ద్వాదశి, అమావాస్య-- ఈ తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివేవారికి అభీష్టసిద్ధి, గోదాన భూదానఫలమూ కలుగుతుంది.*_ మైత్రేయా! ఇదీ ప్రహ్లాద చరిత్ర.

ఆ ప్రహ్లాదునకు విరోచనుడు, ఆయుష్మంతుడు, శిబి, భాష్కలుడు అని నలుగురు కొడుకులు. విరోచనుని కొడుకు బలి. బలికి బాణాసురుడు మొదలుగా నూర్గురు కొడుకులు.

ప్రహ్లాదుని వంశమునందు పుట్టినవారే నివాతకవచులు మూడు కోట్లు.

హిరణ్యాక్షునకు ఝర్హరి, శకుని, భూతసంతాపనుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాభుడు అని ఆర్గురు కొడుకులు.

కశ్యపుని మూడవ భార్యయైన దనువునకు పదిముగ్గురు కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడైన వైశ్వానరునకు కాలిక, పౌలోమ అని ఇద్దరు కూతుళ్లు, వారు మరీచి భార్యలయ్యారు. ఆ యిద్దరి సంతతి కాలకేయులు పౌలోములు అని అరవై వేలమంది.

దనువు సంతతిలోని వాడే అయిన విప్రచిత్తికి సింహికయందు వంశుడు, శల్యుడు, నభండుడు, వాతాపి, ఇల్వలుడు, నముచి, ఖస్యముడు, అంధకుడు, నరకుడు, కాలనాభుడు, స్వర్భానుడు, వక్రయోధి అనేవారు పుట్టారు.

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*__*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*__* 14వ భాగం:-*_బహుపుత్రున...
15/12/2024

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

_* 14వ భాగం:-*_

బహుపుత్రునకు పది నలుగురు మనువులు పుట్టారు.

అంగిరసునకు రుచికుడు పుట్టాడు. బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడు. కృతాశ్వునకు దేవాయుధాలు కలిగాయి. ఈ అమర సమూహం బ్రహ్మదినమునందు ఆయా యుగాలలో యజ్ఞ భాగాలకు పుట్టుతూ ఉంటారు.

ఇక చెప్పేది చాలా విశిష్టమైన భక్తచరిత్ర. విను. కశ్యపుని రెండవ భార్యయైన దితియందు హిరణ్యకశివు హిరణ్యాక్షులు, సింహిక పుట్టారు. సింహిక విప్రజిత్తి అనే రాక్షసుని భార్య అయింది. హిరణ్యకశివునకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు - అనే నలుగురు కొడుకులు పుట్టారు. వారిలో ప్రహ్లాదుడు పరమభాగవతుడు. అతని చరిత్ర మనసుకి మాటకీ అందని మహనీయ గుణవిశిష్టం. అతని చరిత్ర నాకు అందినంత చెప్తాను విను.

హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి చాలాకాలం తపస్సు చేసి ముల్లోకాలకూ తన దొరతనం కలిగేట్టు బ్రహ్మవల్ల వరం పొందాడు. సకలలోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు. దానితో దేవతలు సుఖస్థితీ గతీ లేనివారయ్యారు.

అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్యమణిమయ సౌధమునందు కొలువుతీరి గురువులతో, కొడుకును ప్రహ్లాదుణ్ణి రప్పించి...

కుమారా! గురువులేమి చెప్తున్నారు? శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా? ఏదీ ఒక పద్యం చదువు - అని అనగా ప్రహ్లాదుడు చదువవలసినది చదివి విష్ణుభక్తి కన్న, విష్ణుస్తోత్రం కన్న నేర్వవలసింది ఏముంటుంది నాయనా! అని తేలికగా అన్నాడు.

కొడుకుమాట ఆ తండ్రికి శూలముతో పొడిచినట్టు వినిపించి కోపించి కళ్లెర్రచేసి - కొడుకుకి దగ్గరగా ఆసనాసీనుడైన గురువుని చూసి అన్నాడు...

ఏమయ్యా! నువ్వు గురువువా? జాతికి బ్రాహ్మణుడవుగాని నీతికి కావు. పసివాడికి నువ్వు చెప్పిన చదువు ఇదా? దనుజకంటకుడైన ఆ విష్ణువును గురించి చెప్తున్నావా? ఏమనాలి నిన్ను? కుటిలమతీ!...

హిరణ్యకశిపుని కరకు మాటవిని ఆ గురువు దనుజాధిపా! విను నేను చెప్పేది. నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసును. నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను. వింటున్నట్టు నటిస్తాడు. పాఠం అయిన తరువాత ఆవలకు పోయి దనుజ బాలురకు విష్ణువు గురించే చెప్తూ ఉంటాడట. ఏమి చెయ్యమన్నావు. నా తప్పేమీ లేదు అని చెప్పగా హిరణ్యకశిపుడు కొడుకుని అదలించి ఇదిగో యీనాటి నుంచి గురువు చెప్పినది బుద్ధిగ నేర్చుకుంటూ ఉండు. మనవంశానికి విరోధి అయిన ఆ విష్ణువు ఘోష నీకు తగదు. మనయింటా వంటా లేని బుద్ధి - ఇది మంచిది కాదు. ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా? నీ వెర్రికాని... అని బుద్ధి చెప్పి - గురువుతో పంపించాడు.

ఇంటికి వెళ్లిన తరువాత గురువు బుజ్జగిస్తూ ప్రహ్లాదా! నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకూ ప్రభువుగా వరం పొందిన మహావీరుడు. కనుక ఆ విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడు. విన్నావా! ఇక నేను చెప్పే నీతిశాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు.

అని అనగా విని ప్రహ్లాదుడన్నాడు: అయ్యా! నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకూ అబ్బినట్టుంది. సకలలోకాధిపతి విష్ణువును కాదని యింకొకనిని చెప్పడం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే దనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకూ పట్టినట్టున్నాయి. ఇలాటి నీ దగ్గర చదువుకోడం తెలివి తక్కువతనం, ఒక్కటే నా నిర్ణయం. ఆ విష్ణుదేవుని కాదని నీ చెప్పే చదువు నేను వినేది లేదు.

ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్పలేకపోయాడు.

కొన్నాళ్లు అయిన తరువాత హిరణ్యకశిపుడు మేడపై మద్యపానం చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకుని రప్పించి ఊఁ - శ్రద్ధగా నీతిశాస్త్రం చదువుతున్నావా? ఏదీ చదువు; వింటాను అని అనగా చెప్పాడు కొడుకు.

శ్రీరమణీ మనోహరుడు, సర్వలోకవిఖ్యాత చరిత్రుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని భజించిన ధన్యుడను. నాకీ నీతులు గీతులూ ఎందుకు?

అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆపరా? కోపముతో పళ్లు పటపట కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి దురాత్మా! వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడవైనావు. దనుజ జాతికి మారకుడైన వానిని భజిస్తున్నావా? ఎంత ధైర్యం? నా ముందు నా పగవానిని పొగడుతున్నావే.. ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు. చంపవలసిందే. నువ్వు భజించే ఆ దనుజవైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతోకట్టి ఏనుగులచే పొడిపించి విషాన్నం పెట్టించి- ఇలాగు ఏవేవో మారణప్రయోగాలు చేశాడు. వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు గాని క్షీణించలేదు.

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*__*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*__*👉 12వ భాగం:-*__*మారిష వ...
13/12/2024

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

_*👉 12వ భాగం:-*_

_*మారిష వృత్తాంతం:*_

ఒకప్పుడు కంధుడు అనే ముని గోమతీ తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తూండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సు చెడగొట్టాలని సంకల్పించి ప్రమోచన అనే అప్సరసను రప్పించి వెళ్లు. గోమతీ తీరాన తపస్సు చేస్తున్న కంధుని నీ మోసాలతో వశపరచుకుని తపస్సు చెరచిరా. తగిన చెలికత్తెలతో వెళ్లు - అని నియమించగా ఆ అప్సరస చెలికత్తెలను కొందరిని వెంటపెట్టుకుని కందుని ఆశ్రమానికి వెళ్లింది. ఆ ముని తపశ్చర్యను చూసి ఎదురుగా వెళ్లడానికి భయపడి దరినున్న పొదరిళ్లలో ఆటలాడుతూ, పాటలు పాడుతూ అతనికి కనిపిస్తూ కనిపించక విహరించసాగింది.

ఆ సమయంలో చల్లని మలయవాయువు ఆ అప్సరసకు తోడయి దాని నెమ్మేనినెత్తావి ఆ మునికి మైమరపు కలిగించేది. అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముందువంగి ఉంచేది. వీణమీటుతూ, శృంగార కీర్తనలు పాడేది. అప్పు డప్పుడు తన చేతులు తగిలేట్టుగా వంగి పయ్యెదజార్చి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వుతో చూసేది. ఆ విలాసాలకూ, వికారాలకూ ముని తపోదీక్షకు స్వస్తి చెప్పి మదనవిలాస దీక్షకు సంసిద్ధుడయి ఒకనాడు సుందరీ! నా మనసు దొంగిలించినదానవు. శిక్ష నా కౌగిటిలో నిన్ను బంధించడం అని అనగా ఆ దేవవేశ్య స్వామీ! మీ మాటకి ఎదురుచెప్పగలనా? అని దగ్గరగా వచ్చింది ఇంకేముంది - ముని ఆ వేల్పుసానితో విలాసాలు చిత్తగిస్తూ కొన్ని సంవత్సరాలు వెళ్లించాడు.

ఆ విధంగా ముని తపస్సు పాడుచేసి ఒకనాడు ఆచ్చరమచ్చెకంటి మునీంద్రా! నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను. ఇక్కడికి వచ్చి చాలాకాలం అయింది. ఇక సెలవిస్తే అమరావతికి వెళ్లుతాను. ఇంకా జాగుచేస్తే సురపతి ఆగ్రహిస్తాడు అని అనగా కంధముని కాదు కాదు. నాకు సంతృప్తి కలగలేదు. నాతో ఉన్న నిన్ను తెలిసి ఇంద్రుడు ఏమీ చెయ్యలేదు. రా! అని చేతిని పట్టుకుని పొదరింటికి తీసుకుపోయాడు.

మళ్లీ కొంతకాలమయిన తరువాత ప్రమ్లోచి స్వామీ! ఇక సెలవిప్పించు- అని నొక్కి వేడింది.

సుందరీ! నేను సూర్యోదయ సమయంలో దినకరునకు అర్ఘ్య మిస్తుండగా నువ్వు నా కంటపడ్డావు. నీతో నిన్నరాత్రి వెళ్లించాను. ఈ ఒక్కనాటితో నన్ను విడిచి వెళ్లడం న్యాయమా? అని ముని అనగా మునీంద్రా! నీ మాటకి ఎదురుచెప్పలేను. కాని జరిగినది ప్రమాణవాక్కుగా చెప్తాను. నాతో నీవు గడపిన కాలం- తొమ్మిదివందల ఏడు సంవత్సరాల ఆరునెలల మూడు దినాలు. యోగదృష్టితో చూడు. ప్రమ్లోచి మాటలు విని ముని కనులు మూసి ధ్యానించి తెలుసుకున్నాడు. కనులు తెరిచాడు. కోపరేఖతో కనులు ఎరుపెక్కాయి. నా తపస్సు ఇలా పాడుచేశావా? ఇంద్రుని కపటోపాయం. అయినా తప్పు నీదే. కాని యింతకాలం నన్ను అలరించావు. కనుక క్షమించాను. ఇక పో! నా ఎదుట ఉండకు. మళ్లీ ఎన్నడూ నా వద్దకు రాకు.
అని సింహంలాగా గర్జించాడు. చిత్తం. సెలవు అని ప్రమ్లోచి రివ్వున పైకెగిరింది.

ఆ ఎగరడంలో దాని గర్భమునందున్న ముని వీర్యం చెమటగా అవయవాల నుంచి కారింది. ప్రమ్లోచి చెట్ల చిగురాకులతో ఆ చెమట తుడుచుకుని వెళ్లిపోయింది. కంథముని అక్కడి నుంచి పురుషోత్తమ తీర్ధమునకు పోయి దేవవేశ్యతో గడపిన అధర్మ ప్రవర్తన పాపం పోవడానికి బ్రహ్మసూత్ర స్తోత్రముతో మహావిష్ణువును ప్రార్ధిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు.

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*__*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*__* 11వ భాగం:-*_మహారాజా! ధ...
12/12/2024

_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

_* 11వ భాగం:-*_

మహారాజా! ధర్మనష్టం, దానివల్ల అనావృష్టి, దానిమూలాన పాడిపంటలూ నశించాయి. సన్యములూ, ఓషధులూ జీర్ణములై చెడిపోయాయి. ఇలా ఆకలిదప్పులకు చిక్కి శల్యాలమై పోయాము. అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కక్కుర్తిపడి ప్రాణాలు నిల్పుకుంటున్నారు.

అన్నం ధాన్యమూలం. అందరికీ ఆధారం అన్నం. ఆ అన్నం లేకపోతే ఇక బ్రతుకెక్కడిది? ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయం చూసి ప్రజారక్షకుడవై వర్ధిల్లు మహారాజా! అని ఘోషించారు.

వారి ఘోష విని ఒక్కక్షణం పృథు చక్రవర్తి ఆలోచించాడు. సస్యనాశం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమినీ హతమారుస్తాను అని దిగ్గున లేచి విల్లందుకుని బాణం సంధించాడు. ఇక ప్రయోగించడమే తడవు. భూమి అదిరి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్లాలని పరుగెత్తుతూండగా చక్రవర్తి వెంటవెళ్లుతూ నువ్వు ఎక్కడకు వెళ్లినా సరే నా బాణానికి గురికాక తప్పదు అని గట్టిగా అనగా భూమి రాజా! స్త్రీవధ పాపం అని నీకు తెలియదా? కాగా నన్ను చంపితే ప్రజలస్థితి ఏమి? నీవు పాలించేది ఎలాగ? ఆలోచించావా?...

ప్రజలకు తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలవు. అందరిని కాపాడడానికి నిన్ను చంపడం పుణ్యమే గాని పాపం కాదు. వారి స్థితి తరువాత చూస్తాను. దైవబలం సమృద్ధిగా ఉన్నవాడను నేను. వారిని సుఖంగా పాలించడం నాకు కష్టంకాదు.

సరే - ఒక ఉపాయం చెప్తాను విను. దానివల్ల ప్రజాసంరక్షణ జరుగుతుంది. సస్యాలూ, ఓషధులూ నాలో జీర్ణములై ఉన్నాయి. ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడను కలిగించు. అది తాగే సమయంలో ఓషధులూ, సస్యాలూ ఆవిర్భవిస్తాయి. ఆ ప్రయత్నం చెయ్యి చక్రవర్తి భూదేవి మాటవిన్నాడు. సరే అన్నాడు.

స్వాయంభువును దూడగా కల్పించి తానే పితికాడు. ఏకధారగా పాలు కురిశాయి. అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూత్న శోభతో పైకి లేచాయి. ఎక్కడచూసినా భూమి సస్యశ్యామలమై కనుపండువుగా ఉన్నది. ఆ పాలతో దేవదైత్య కిన్నరాదులకు, మృగాలకూ, మానవులకు సమృద్ధిగా వారివారికి కావలసిన ఆహారం సమకూరింది. అలాగ భూమిని మళ్లీ యథాపూర్వ రూపానికి తెచ్చి సరసుర రంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో 'పృథివి' అనే పేరు వచ్చింది.

_*ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఏలాటి పాపమూ అంటదు. తేజస్సు, సమృద్ధిగా సిరిసంపదలూ, సుఖసంతోషాలూ, కీర్తి, ఆయురారోగ్యాభివృద్ధి, అశ్వమేథ యాగం చేసిన ఫలమూ ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు.*_

ఆ పృథుచక్రవర్తికి అంతర్ది, వార్థి అని ఇద్దరు కొడుకులు. వారిలో అంతర్ధికి శిఖండియను భార్య యందు హవిర్ధానుడు అనే కొడుకు పుట్టాడు. వానికి అగ్ని వలన పుట్టిన ధిషణ అనే కాంత యందు ఒక కొడుకు కలిగాడు. అతడు యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీనాగ్రములుగా ఉంచడం వల్ల ప్రాచీనబర్హి అని ప్రసిద్ధు డయ్యాడు. అతనికి సముద్ర పుత్రియైన సౌవర్ణయందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతసులు పదిమంది పుట్టారు. వారు భేదము లేని పద్ధతిని ధర్మప్రవర్తనులై పదివేల సంవత్సరాలు సముద్రం నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడు.

గురువర్యా! ప్రచేతసులు సముద్రమధ్యమున అంతకాలం తపస్సు చెయ్యడానికి కారణం ఏమి? ఆ కథ వినాలని ఉంది అని అడగగా పరాశరుడు చెప్పాడు.

ప్రాచీనబర్హి ఇంద్రుడులాగా భూవలయమును ధర్మవైభవముతో పాలించాడు. తనమాట జవదాటక భక్తితో ప్రవర్తిస్తూన్న కొడుకులతో ఒక నాదన్నాడు.

మీరు ధర్మసమైక్యముతో ప్రవర్తిస్తూన్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేదీ ఉండదు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చెయ్యండి. ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూతసృష్టి చెయ్యండి అని చెప్పగా వారందుల కంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతకాలం తపస్సు చేశారు. కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై మీ తపస్సుకి మెచ్చాను. వరాలు కోరండి ఇస్తా నన్నాడు.

'కమలామనోరమణా! జగదేకపవిత్రచరిత్రా! సరోజనేత్రా! శుభాలోకనా! సకల లోకపాలనా! కరుణాపయోనిధీ! మాకు ప్రజాపతి ప్రాభవం అనుగ్రహించు! అని వారు కోరారు.

'మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్హితుడు అయ్యాడు.

అలాగ విష్ణువువల్ల వరం పొంది తరువాత వారు సముద్ర మధ్యము నుంచి వెలుపలకు వచ్చారు. అంతకాలం వారు తపస్సు చేస్తూ సముద్రములో ఉండడం వల్ల దేశం అరాజకమై చెట్లు తెగ పెరిగి భయంకరారణ్యమైపోయింది. ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండుసొబగుతో మోహినీ దేవతను పోలిన ఒక కన్యను కల్పించి వారివద్దకు వచ్చి సమర్పించి అన్నాడు.

మీరు దేశమందు లేకపోవడంవల్ల వృక్షాలు తెగపెరిగి ఉండడంలో దోషం లేదు. ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి, చెట్లన్నీ మాడి మసి అయిపోయాయి. తపస్సు చేసిన మీవంటి వారికి దీర్ఘకోపం కూడదు. చెట్లు మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో యీ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగింది. పేరు మారిష ఈమెను గృహిణిగా పరిగ్రహించండి.

అప్రమేయబలుడైన సుతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకూ నాకూ గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరున ప్రజాపతి అవుతాడు. అతనివల్ల ప్రజాసమృద్ధి అవుతుంది అని సానునయముగా చెప్పగా ప్రచేతసు లంగీకరించి చంద్రునితో అన్నారు.

ఈమె చెట్లనుంచి ఎలా పుట్టింది? నీ కిరణప్రసారముచే పెరగడ మేమిటి? అది వివరించు - అని అనగా చంద్రుడు చెప్పాడు.

_*రేపటి భాగంలో మళ్లీ కలుసుకుందాం...*_

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

_*🪷-"శ్రీ విష్ణు పురాణం"-🪷*__*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ _*శ్రీ గురుభ్యోనమః*_🕉️🌷🕉️🌷🕉️🌷🕉️_* 10వ భాగం:-*_అంగుడు ...
12/12/2024

_*🪷-"శ్రీ విష్ణు పురాణం"-🪷*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_

🕉️🌷🕉️🌷🕉️🌷🕉️

_* 10వ భాగం:-*_

అంగుడు మృత్యు పుత్రికయైన సునీధను పెండ్లాడి ఆమెయందు కనిన వాడు వేనుడు. వానికి పట్టంకట్టి భార్యతో సహ తపశ్చర్యకై వనవాసి అయ్యాడు. ఆ వేనుడు మాతామహదోషంవల్ల పరిపాలన ధర్మపద్ధతిని చెయ్యక పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. తాతముత్తాతలనాటి అగ్రహారాలలో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులను బాధించడం, న్యాయపద్ధతికి విరుద్ధముగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చెయ్యడం, వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కల్గించి రాష్ట్రము నుంచి వెడలగొట్టడం, శుభప్రదమైన ఆస్తికపద్ధతిని విడిచి పాషండమతం అవలంబించడం, జారచోరులనూ, దురాచారాలనూ ఆదరించి పోషిస్తూ ఉండడం, అసత్యమాడడం, ధర్మమార్గాన నడిచేవారిని క్రూరంగా శిక్షించి ఏడిపించడం, పనిపట్టి సాధువులను బాధించడం వేనుని నిత్యకృత్యాలు....

యజ్ఞాలూ, వ్రతాలూ, నోములూ, జపాలూ దేవపూజలూ చెయ్యకూడదు. చేసినవారికి మరణదండన అని తన రాష్ట్రమంతటా చాటించాడు.

తన కెవరైనా బుద్ధులు చెప్తే వారిని తన పర అనే విమర్శలేక శిక్షించి పురము నుంచి వెడలగొట్టేవాడు.

ఈలాటి వేనుని దుష్టపరతకి ఫలితం అనావృష్టి. పాడీపంట ఏష్యమైపోయాయి. ప్రజలు అన్నపానీయాలకి అలమటిస్తూ దిక్కులేని వారయ్యారు.

ఆ దశలో మునులు ఆలోచించి వానికి సద్భుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్లి పూర్వ రాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారి వంశములో పుట్టి వారిలాగ ప్రవర్తించక దుర్మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలను కూడు గుడ్డా లేని దుర్దశకి తేవడం మంచిది కాదు రాజా! మునులను చంపడం, వేదాలను దూషించడం, దేవాలయాలు పడగొట్టించడం, బ్రాహ్మణులను ఏడిపించడం రాజధర్మమా?

యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. వారి సంతోషం వాన కురిపిస్తుంది. దానితో భూమి సస్యశ్యామలం అవుతుంది. ప్రజలు పాడిపంటలతో సుఖజీవనులౌతారు. ఇప్పటి నీ ప్రవృత్తివల్ల దేశం దుర్భిక్షమునకు గురియయి భూతకోటికి దినదిన గండమయింది. మళ్లీ చెప్తున్నాము. మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపముతో కొరకొరలాడుతూ వేనుడు మునులను చూసి -

ఆపండి మీ పేలాపన. నాకన్న మిన్నగా చెప్పదగిన వాడు లోకంలో ఎవడున్నాడు? విష్ణువును నా కన్న అధికుడుగా చెప్తున్నారే. మీకన్న పిచ్చివాళ్లుంటారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలు ఉన్నవాడను నేను. కాబట్టి యజ్ఞాలు, యాగాలు అనేవి మరి చెయ్యనక్కరలేదని శాసించాను. పతిసేవ యిల్లాలికి పరమధర్మం. అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లన ఏమేమో బోధించారు. కాని వేనుడు వినలేదు. పైగా దేవతానింద పాట పాడుతూనే ఉన్నాడు. వాని వికృత పద్ధతిని భరించలేకపోయారు. కరుణాపయోనిధిని పద్మాక్షుణ్ణి శ్రీహరిని నిందిస్తున్న యీ పాపాత్ముణ్ణి తుదముట్టించి ధర్మసంరక్షణ చేసి ప్రజలను కాపాడాలి అని నిశ్చయించుకుని దర్భలు పట్టుకుని మారణమంత్రాలు పలుకుతూ ఆ దర్భలను వేనుని మీదికి విసిరారు. తీవ్రాగ్నిజ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశిత శరములై వానిని తాకగానే వేసుడు దబ్బున కిందపడి కన్ను మూశాడు.

వాని శరీరమును తైల పాకం చేయించి మంత్రుల కప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండం డన్నారు. మంత్రులు ఏమీ అనలేక ఊరకున్నారు.

ఇక ఏముంది? పరిపాలకుడు లేదు. దొంగలు మూకమూకలుగా ఊళ్లపైబడి బ్రాహ్మణులను చావగొట్టుతూ సిరిసంపదలను హరింపసాగగా ఆ బ్రాహ్మణులు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ వచ్చారు.

అరాజకం పద్ధతి అలా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేనుని ఊరు భాగమును మధించారు. ఆ భాగము నుంచి భయంకర వికృతాకారు డొకడు బయల్పడి నన్నేమి చెయ్యమన్నారని హుంకరిస్తూ అడిగాడు. అనుకున్నదొకటి జరిగినదొకటి. వీడు ప్రశాంతంగా పరిపాలన చెయ్యడని మునులు ఆలోచించి నువ్వు వింధ్య పర్వత ప్రాంతాన ఉండి మ్లేచ్చ కిరాత జాతుల కధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలి లాగా తిరుగుతూ ఎగిరి వెళ్లిపోయాడు.

తరువాత మునులు - ఈ వేనునిలో ఉన్న పాపం ఆ నిషాదరూపములో వెళ్లిపోయిందని సంతసించి ఉదాత్తానుదాత్తస్వరిత పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేనుని కుడిభుజం మధించారు. ఆ మథనం ఫలితముగా సాటిలేని భుజబలం, దివ్యతేజస్సు సులక్షణ లక్షితమైన అంగసౌష్టవం కలవాడై విష్ణువు అంశలో ఒక బాలుడు పుట్టాడు. వానిని చూచి మునులు ఆనందించి యీ బాలుడు ధరణికి తగిన పతియని ఏకవాక్కుగా వానికి పృథువు - అని నామకరణం చేశారు.

ఆ సమయములో దివినుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుభులు మోశాయి. దేవగణాలు అభినందించారు. అలా పుట్టిన పృథువు యువకుడై మహనీయ మహిమ కలవాడై విరాజిల్లుతూ ఉన్నాడు. అలా ఉండగా దేవలోకము నుంచి విశిష్ట తేజస్సు గల ఖడ్గం, ధనుస్సు, అక్షయబాణ తూణీరములు రెండు, వజ్రకవచం యుద్ధసాధనాలుగా వచ్చాయి. ధర్మానికి మగరూపయిన మంచి కొడుకు కలగడం వల్ల వేనుడు పుణ్యస్థానానికి చేరాడు. మునులు పరమానందభరితులై గంగాది పుణ్య నదులనుంచి, సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రలతో తెచ్చి పృథువునకు అభిషేకం చేశారు. దేవగణాలతో బ్రహ్మ వచ్చి శుభముహూర్తాన పృథువుకి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశాడు. విష్ణుచక్రం వచ్చి పృధువు దక్షిణ హస్తమునకు దివ్యాభరణముగా ప్రకాశించింది. దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా పృథువును చెప్పి అభినందించాడు.

ఆ విధముగా పృథువు చక్రవర్తి అయి ధర్మమూర్తిగా సురనర ప్రశంసను పొంది సమధికైశ్వర్యవంతుడై రాజ్యం చేయసాగాడు.

అలా చేస్తూ పైతామహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞమునకు సంబంధించిన సూత్ర మంత్రప్రభావముచే ఇద్దరు శిశువులు పుట్టారు. పుట్టిన పట్టిన వెంటనే యువకులు కాగా చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపరేఖలూ, మాటతీరు చూసి సంతుష్టులై మీ పేరు సూతుడు, మాగధుడు. మీరే చక్రవర్తిని స్తుతిస్తూ ఉండం డన్నారు. వారికి చక్కని వాగ్వైభవం కలిగించారు. సమయానుసారంగా సూతమాగధులు పృథుచక్రవర్తిని కీర్తిస్తూ ఉన్నారు.

అలా ఉండగా ప్రజలు ఆకలిదప్పులకు లోనై, ఆగలేక పృథు చక్రవర్తివద్దకు వెళ్లి -

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏

Address

Nellore
524001

Telephone

+919010208245

Website

Alerts

Be the first to know and let us send you an email when BB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BB:

Share