Pedana YSRCP

Pedana YSRCP Jai Jagan Jai Uppala Jai YSRCP

రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలి...ఎండిపోతున్న పంటలకు సాగు నీరు ఇచ్చి కాపాడాలి...సాగు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే...
07/08/2026

రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలి...

ఎండిపోతున్న పంటలకు సాగు నీరు ఇచ్చి కాపాడాలి...

సాగు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది...

రెండో రోజుకి చేరుకున్న రిలే నిరాహార దీక్ష...

మద్దతు తెలుపుతున్న రైతాంగం...

పెడన పట్టణంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఉప్పాల రాము గారు శ్రీమతి హారిక గారు...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఉప్పాల రాము గారి ఆధ్వర్యంలో రెండవ రోజుగా పెడన పట్టణం బస్టాండ్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది...

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు మరియు రైతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...

కృష్ణాజిల్లా, గూడూరు, 06 ఆగస్టు 2026..._*సాగునీటి అంశంపై గూడూరులో రిలే నిరాహార దీక్ష...*_*_రైతులకు అండగా ఉప్పాల రాము.._*...
06/08/2026

కృష్ణాజిల్లా,
గూడూరు,
06 ఆగస్టు 2026...

_*సాగునీటి అంశంపై గూడూరులో రిలే నిరాహార దీక్ష...*_

*_రైతులకు అండగా ఉప్పాల రాము.._*

*_నీరు ఇవ్వని పక్షాన ఈ ప్రభుత్వం మహా పాదయాత్ర చేస్తానని పేర్కొన్న ఉప్పాల రాము.._*

*_గూడూరు మెయిన్ సెంటర్ నందు రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలని రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న రైతులతో పాటు పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఉప్పాల రాము గారు మరియు కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు..._*

రాము గారు మాట్లాడుతూ జూన్ 29 తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ఏరువాక అని కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవముగా కార్యక్రమం చేశారు రైతులందరినీ కూడా మార్గదర్శకంగా సూచించి ఆకుమడులు పోసుకోవచ్చు ఎదలు జల్లుకోవచ్చు సందేశం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఏరువాకకు ముందే విత్తనాలు కూడా సబ్సిడీకి ఏ ఉద్దేశంతో ఈ సందేశం ఇచ్చావ్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను...

నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలా చెప్పలేదు నీరు ఇవ్వలేము వ్యవసాయం దండగ అని ఎవరు చెప్పలేదు ఒక నారా చంద్రబాబునాయుడు గారు తప్ప....

మీరు ఒక సందేశం ఇచ్చి ఏరువాక స్టార్ట్ చేసి యాట ఎలాగైతే వ్యవసాయం చేసుకుంటాము అలాగా ప్రతి రైతు చేసుకోవచ్చు అన్న సంతోషకరమైన టైంలో నెత్తిమీద పిడుగు వేసినట్టుగా ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు జులై 18 వ తారీఖున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓన్లీ తాగడానికి మాత్రమే నీరు ఇస్తున్నాము సాగినీటికి నీరు లేదు అని పత్రిక సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు ఒక బాధ్యత గల మంత్రి ఇలా చెప్పొచ్చా అని ప్రశ్నించారు....

ఈ సందర్భంగా ఈరోజు గూడూరులో రేపు పెడనలో ఎల్లుండి బంటుమిల్లిలో ఒకరోజు కృత్తివెన్నులో 10వ తారీఖున అందరం కలిసి పెడనలో భారీ ర్యాలీ నిర్వహిస్తా అలాగే అప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే పల్లిపాలెం వద్ద నుంచి గుడ్లవల్లేరు వరకు రైతులు తరఫున మహా పాదయాత్ర మొదలు పెడతాను లేదు అప్పటికి కళ్ళు తెరవలేదు అంటే మల్ల పల్లిపాలెం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా నడుస్తా అప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని అన్నారు....

స్థానిక శాసనసభ్యుడు కృష్ణ ప్రసాద్ కు చెప్తా ఉన్నాను నియోజకవర్గ ప్రజలు ఎంత రంగు అంగుతో 35000 మెజార్టీ ఇచ్చారు ఇవాల్టికైనా నోరు తెరిచి పెడన నియోజకవర్గం తరఫున రైతుల తరఫున మీ ముఖ్యమంత్రి తో మాట్లాడి వెంటనే నీరు తెస్తే మంచిది అని సూచించారు...

ఈ కార్యక్రమంలో రైతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...

04/08/2026

*_జలవనురుల శాఖ పర్యవేక్షణ ఇంజనీరు గారిని కలిసి తక్షణమే సార్వకు నీరు ఇవ్వాలని వినతపత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా నియోజకవర్గ సమన్యాయకర్తలు..._*

*_కృష్ణాజిల్లాలో సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తెలియజేసేందుకు పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఉప్పాల రాము గారు,అవనిగడ్డ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు,మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పేర్ని కిట్టు గారు పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారు,గుడివాడ నియోజకవర్గ సీనియర్ నాయకుడు శ్రీ దుక్కిపాటి శశిభూషణ్ గారు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీ తిరుమాని శ్రీనివాసరావుతో పాటు పలువురు రైతు విభాగం నాయకులు సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ సర్కిల్ కార్యాలయ ఎస్ఈ జె గుణకణరావుని కలిసి వినత పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు..._*

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రజల సమస్యలను నేరుగా తన దృష్టికి చేర్చేందుకు వైయస్ ఆర్ కాంగ్ర...
21/07/2026

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రజల సమస్యలను నేరుగా తన దృష్టికి చేర్చేందుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన "జగనన్న 2.0 సూపర్ యాప్" పోస్టర్ ఆవిష్కరణని పెడన పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ ఉప్పాల రాము గారు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు..

(https://Jaganannaconnects.com/download)




నిన్న భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల అండగా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకం...
16/07/2026

నిన్న భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల అండగా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
YS Jagan Mohan Reddy

Address

Pedana
521366

Website

Alerts

Be the first to know and let us send you an email when Pedana YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category