Pedana YSRCP

Pedana YSRCP Jai Jagan Jai Uppala Jai YSRCP

04/06/2026

తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించిన‌ మ‌హానాడు చూస్తే అబ‌ద్ధాలు ఎలా మాట్లాడాలో వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించిన‌ట్టుగా ఉంది. వైయ‌స్ జ‌గ‌న్ గారిని, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని నిందించ‌డానికే స‌భ పెట్టుకున్నారు. దానికి మ‌హానాడు బ‌దులు జ‌గ‌న్ నాడు అని పెట్టుకోవాల్సింది. పాల‌న చేత‌కాక‌ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారు.

హోంమంత్రి అనిత ఒక మ‌హిళ అయ్యుండీ మ‌హిళ‌ల‌కు జ‌రిగే దారుణాల‌పై కాకుండా వైయ‌స్ జ‌గ‌న్ కుటుంబాన్ని విమ‌ర్శించ‌డానికే మైకులు తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పార్టీ అని పెట్టుకోవ‌డం ఉత్త‌మం. చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధి ఉంటే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చి చూపించాలి.

-ఉప్పాల హారిక‌ రాము, కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెడన నియోజకవర్గ వైయస్ ఆర్ సీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఉప్పాల రాము గారి నాయక...
04/06/2026

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెడన నియోజకవర్గ వైయస్ ఆర్ సీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఉప్పాల రాము గారి నాయకత్వంలో, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాము గారి సమక్షంలో చంద్రబాబు వెన్నుపోటుకీ రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు నెరవేరని సూపర్ సిక్స్ హామీలకు వ్యతిరేకంగా మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ముందుగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలనేసి ఘనంగా నివాళులర్పించి తదుపరి పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా హాజరైన శ్రీ పేర్ని నాని గారు, శ్రీ వరుకుటి అశోక్ బాబు గారుసభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది..

ఈ సందర్భంగా SIR జోన్ 3 ఇంచార్జ్ శ్రీ వరికుటి అశోక్ బాబు గారు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఏజెంట్లకు సమగ్ర అవగాహన కల్పించారు. ప్రొజెక్టర్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా ఓటరు జాబితా సవరణలో పాటించాల్సిన విధానాలు, బాధ్యతలను విపులంగా వివరించారు..

అనంతరం మాజీ మంత్రి వర్యులు కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారు పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలను పరిశీలించడం, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారి వివరాల నిర్ధారణ వంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు....

పెడన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఎల్‌ఏలను నియమించి ప్రత్యేక శిక్షణ అందించినట్లు ఉప్పాల రాము గారు తెలిపారు. భవిష్యత్తులో గ్రామస్థాయిలో ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు...

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని మండలాల టౌన్ లకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA's) బూత్ అధ్యక్షులు సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

రెండేళ్ల చంద్రబాబు కూటమి పాల‌న‌లో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లేనని, ద‌గా, మోసం, వెన్నుపోటుకి ప‌రాకాష్ట‌గా ఈ రెండేళ్ల ...
02/06/2026

రెండేళ్ల చంద్రబాబు కూటమి పాల‌న‌లో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లేనని, ద‌గా, మోసం, వెన్నుపోటుకి ప‌రాకాష్ట‌గా ఈ రెండేళ్ల కూట‌మి పాల‌న నిలిచిపోతుంద‌ని వైయస్సార్సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు వెన్నుపోటు పాల‌న‌కు రెండేళ్లు పేరుతో తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ వైయ‌స్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర స్థాయి స‌మావేశానికి ఆయ‌న ముఖ్య హాజ‌రై ప్ర‌స‌గించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసేసి, మహిళలకు పెద్దపీట వేశాను, 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నాడ‌ని చెప్పారు. చీకటి సామ్రాజ్యాధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

"చంద్రబాబే ఓ గోబెల్స్ బాస్. ఇతరుల్ని ఎస్కో బార్ అంటాడు, ఆయనే పెద్ద ఎస్కో బార్. ఓ నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు. లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు." అలాంటి వ్యక్తిని రాజ‌కీయంగా నాశ‌నం చేయ‌గ‌లిగిన శ‌క్తి జ‌గ‌న్ గారికే ఉంది. చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఆయ‌నే అన్నారు. మ‌హిళా విభాగం ద్వారా ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను రాష్ట్ర మ‌హిళ‌ల‌కు గుర్తుచేసి, వాస్తవాలను గణాంకాలతో సహా వివరించడంతోపాటు మేమున్నామనే భరోసా ఇవ్వాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటున్న లోకేష్ కి చిత్తశుద్ది ఉంటే ఇప్పుడు రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లలో ఇవ్వొచ్చు కదా అని వైయ‌స్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి ప్ర‌శ్నించారు. వీరితోపాటు ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయ‌స్సార్సీపీ మ‌హిళా నాయ‌కులు పాల్గొని ప్ర‌సంగించారు.

భక్తి, విశ్వాసం, త్యాగస్ఫూర్తికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినం నాడు అల్లాహ్ మీ ప్రార్థనలను స్వీకరించి, మీ ఇంట ఆనందం, ...
31/05/2026

భక్తి, విశ్వాసం, త్యాగస్ఫూర్తికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినం నాడు అల్లాహ్ మీ ప్రార్థనలను స్వీకరించి, మీ ఇంట ఆనందం, శాంతి, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ పవిత్ర పండుగ మనందరిలో సేవాభావం, దానగుణం, మానవత్వం మరింత పెంపొందించాలి. ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.

YSR Congress Party - YSRCP
YS Jagan Mohan Reddy
Pedana YSRCP Uppala Ramu
Team Uppala Ramu Uppala Ramu Srd
Harika Ramu Uppala Uppala Harika



గౌరవనీయులైన-మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులకు,జిల్లా అధ్యక్షులకు,జిల్లా కమిటీ సభ్యులకు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులక...
20/04/2026

గౌరవనీయులైన-మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులకు,జిల్లా అధ్యక్షులకు,జిల్లా కమిటీ సభ్యులకు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులకు, అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సభ్యులకు, మండల,గ్రామ, నగర అధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు, మహిళా ప్రజాప్రతినిధులకు నమస్కారం,
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహిళా విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించబడును.
📅 తేదీ: 22-04-2026 (బుధవారం)
⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక:
పెడన తోటమూలలోని ది పెడన ఫంక్షన్ హాల్
📌 Location Map: https://maps.app.goo.gl/3RZohoA97VXagu4x8?g_st=ac⁠�
(ఈ ఫంక్షన్ హాల్ బంటుమిల్లి రోడ్, పెడన ప్రాంతంలో ఉంది)

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా *రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ* *శ్రీమతి వరుదు కళ్యాణి* గారు హాజరుకానున్నారు.
కాబట్టి, ఈ ముఖ్యమైన సమావేశానికి మీరు తప్పక హాజరై విజయవంతం చేయగలరని మనవి.
*ధన్యవాదాలు* .
మీ,
ఉప్పాల హారిక
కృష్ణ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
మరియు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ

*🙏అందరికీ నమస్కారం🙏**_ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన ముంధా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వా...
02/11/2025

*🙏అందరికీ నమస్కారం🙏*

*_ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన ముంధా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వారికి ధైర్యం చెప్పడానికి ప్రభుత్వము కనీసం రైతులకు ఇప్పటివరకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేనందుకుగాను మన వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ది.04.11.2025 న పెడన నియోజకవర్గం లోని తరకటూరు నుండి రామరాజుపాలెం వరకు తుఫాన్ వల్ల నష్టపోయిన వారి పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా వారి పక్షాన పోరాడేలా పర్యటన చేస్తున్నారు..._*

_కావున పెడన నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు మొదలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు/ కో ఆప్షన్ సభ్యులు/ ఎంపీపీలు/జెడ్పీటీసీలు/ రాష్ట్ర స్థాయి వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు /బూత్ కమిటీ కన్వీనర్లు/మాజి మరియు మండల పార్టీ అధ్యక్షులు - ప్రధాన కార్యదర్శులు - అధికార ప్రతినిధులు - కార్యదర్శులు - సంయుక్త కార్యదర్శులు - కార్యవర్గ సభ్యులు /వైస్ ఎంపీపీ లు / సర్పంచులు /ఉప సర్పంచులు /వార్డు మెంబర్లు [సర్పంచులు లేని చోట ఇంచార్జిలు ] ఎంపీటీసీలు / -మార్కెట్ కమిటీ డైరెక్టర్లు / వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు / ప్రాధమిక సహకార సంఘం అధ్యక్షులు మరియు డైరెక్టర్లు/ఆర్బీకే చైర్మన్లు / గ్రామ కన్వీనర్లు / ఎస్సీ సెల్ కన్వీనర్లు / బీసీ సెల్ కన్వీనర్లు / మైనార్టీ సెల్ కన్వీనర్లు / ఎస్టీ సెల్ కన్వీనర్లు / యువజన విభాగం కన్వీనర్లు / రైతు విభాగం కన్వీనర్లు / సచివాలయ కన్వీనర్లు/ గృహ సారథులు . పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు సోషల్ మీడియా కార్యకర్తలు తప్పకుండా హజరు కావలసినదిగా మనవి.._

*_-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం/పెడన_*
Uppala Ramu Srd Harika Uppala
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP
YSRCP Social Media
Ysrcp Pedana Constituency

*🙏అందరికీ నమస్కారం🙏**_సోమవారం అనగా [13-10-2025] ఉదయం 10:30 గంటలకు పెడన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌ...
12/10/2025

*🙏అందరికీ నమస్కారం🙏*

*_సోమవారం అనగా [13-10-2025] ఉదయం 10:30 గంటలకు పెడన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌరవ శ్రీ ఉప్పాల రాము గారు మరియు కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారి ఆధ్వర్యంలో. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా తయారుచేసి ప్రజల ప్రాణాలని హరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ పెడన ఎమ్మార్వో గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది..._*

_కావున పెడన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మొదలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు/ కో ఆప్షన్ సభ్యులు/ ఎంపీపీలు/జెడ్పీటీసీలు/ రాష్ట్ర స్థాయి వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు /బూత్ కమిటీ కన్వీనర్లు/మాజి మరియు మండల పార్టీ అధ్యక్షులు - ప్రధాన కార్యదర్శులు - అధికార ప్రతినిధులు - కార్యదర్శులు - సంయుక్త కార్యదర్శులు - కార్యవర్గ సభ్యులు /వైస్ ఎంపీపీ లు / సర్పంచులు /ఉప సర్పంచులు /వార్డు మెంబర్లు [సర్పంచులు లేని చోట ఇంచార్జిలు ] ఎంపీటీసీలు / -మార్కెట్ కమిటీ డైరెక్టర్లు / వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు / ప్రాధమిక సహకార సంఘం అధ్యక్షులు మరియు డైరెక్టర్లు/ఆర్బీకే చైర్మన్లు / గ్రామ కన్వీనర్లు / ఎస్సీ సెల్ కన్వీనర్లు / బీసీ సెల్ కన్వీనర్లు / మైనార్టీ సెల్ కన్వీనర్లు / ఎస్టీ సెల్ కన్వీనర్లు / యువజన విభాగం కన్వీనర్లు / రైతు విభాగం కన్వీనర్లు / సచివాలయ కన్వీనర్లు/ గృహ సారథులు . పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు సోషల్ మీడియా కార్యకర్తలు తప్పకుండా హజరు కావలసినదిగా మనవి.._

_పెడన నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ఆహ్వానం..._

*-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం/పెడన*

పెడన టౌన్,వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,11 అక్టోబర్ 2025...*కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన ఇంచార్జ్ ఉప్పాల ...
11/10/2025

పెడన టౌన్,
వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,
11 అక్టోబర్ 2025...

*కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన ఇంచార్జ్ ఉప్పాల రాము...*

*పేదలపై చంద్రబాబుకి ఇంత కక్ష ఎందుకు అని కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ ఇంచార్జ్ శ్రీ ఉప్పాల రాము...*

*నేడు పెడన లోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో పెడన నియోజకవర్గ నుంచి విచ్చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరించిన పెడన నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌరవ శ్రీ ఉప్పాల రాము గారు...*

ఈ కార్యక్రమ భాగంగా రాము గారు మాట్లాడుతూ..

నేటి నుంచి పెడన నియోజకవర్గ ప్రతి గ్రామాలలో రచ్చబండ కార్యక్రమం మొదలు..

అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి వినతిపత్రాలిస్తాం, నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం, నవంబర్ 24న సంతకాల సేకరణ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి, నవంబర్ 25న జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను అందజేస్తాం..

రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుంది, 45 రోజులకు పైగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళతాం అని అన్నారు...

_ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..._

_కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు  జిల్లాలకు మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల  హారిక గారు నియామకం.._Thank Yo...
05/08/2025

_కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు జిల్లాలకు మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల హారిక గారు నియామకం.._
Thank You Jagan Anna
Uppala Ramu Team Uppala Ramu Uppala Harika Uppala Ramu Srd Harika Ramu Uppala Jagananna Connects Pedana YSRCP Uppala Ramu Garage YSRCP Social Media

పెడన మండలం,కూడూరు గ్రామం,15 జులై 2025...*_శ్రీమతి ఉప్పాల హారిక గారిని పరామర్శించిన ఇంచార్జ్ కొడాలి నాని గారు..._**_పెడన ...
16/07/2025

పెడన మండలం,
కూడూరు గ్రామం,
15 జులై 2025...

*_శ్రీమతి ఉప్పాల హారిక గారిని పరామర్శించిన ఇంచార్జ్ కొడాలి నాని గారు..._*

*_పెడన మండలం కూడూరు గ్రామంలో ఇటీవల గుడివాడలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారి మీద జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకుని ఖండిస్తూ చైర్ పర్సన్ పరామర్శించి ఏ విషయంలోనైనా ఉండగా ఉంటానని భరోసా ఇచ్చిన మాజీ మంత్రివర్యులు గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవ శ్రీ కొడాలి నాని గారు మరియు మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు గారు..._*

_ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు రాము గారు మరియు నాని గారి అభిమానులు పాల్గొన్నారు..._

Address

Pedana
521366

Website

Alerts

Be the first to know and let us send you an email when Pedana YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category