23/03/2023
వీడియో జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది
- వీడియో జర్నలిస్టుల యూనియన్ ఎన్నికలో నేతల హామీ
- గౌరవాధ్యక్షులుగా ఎస్కే మహేష్
- అధ్యక్షులుగా స్నేహల్, కార్యదర్శి గా కిరణ్
కర్నూల్, మార్చి 23:
వీడియో జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చిన ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది అని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు జీ. కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఎన్. రాజు, శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అనుబంధంగా కర్నూల్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని మీడియా రూం దగ్గర జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తల సేకరణలో కొంతమంది అక్రమార్కుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని, వీడియో జర్నలిస్టులు కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే వీడియో జర్నలిస్టులకు ఇబ్బంది ఎదురైన యూనియన్ అండగా ఉంటుందని భరోసాని ఇచ్చారు. అనంతరం వీడియో జర్నలిస్టుల నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.
*నూతన కార్యవర్గం :*
యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎస్కే మహేష్, గౌరవ సలహాదారులు
ఎం.వీరేశం, అధ్యక్షుడిగా
జె.స్నేహల్ ఉపాధ్యక్షులుగా కె.రాజు, వి.రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి గా ఎన్జీ. కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శులుగా ఎ.సూర్యబాబు,
కె.అనిల్ కుమార్, కోశాధికారి
ఇ.చంద్ర శేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గా ఎ.చెన్నయ్య, కార్యవర్గ సభ్యులుగా సురేంద్ర బాబు, చాంద్ బాషా, సురేష్, రమేష్, రామకృష్ణా రెడ్డి, నాగేష్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూ జే నాయకులు, సభ్యులు పాల్గొన్నారు