16/06/2020
Salute to Raychoti Police
కడప జిల్లా రాయచోటి మండలం మాధవరం వడ్డేపల్లి కి చెందిన తప్పిపోయిన బాలురలను కాపాడిన రాయచోటి పోలిసులు..
రేస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు బాలురలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో ఉపిరిపిల్చుకోన్నారు గ్రామాస్తులు.
కడప జిల్లా, రాయచోటి మండలం, మాధవరం గ్రామం, వడ్డేపల్లి కు చేందిన రెడ్డి బాబు, గిరిబాబు, సురేష్ బాబు అనే ముగ్గురు బాలురు అడవికి వెళ్ళి గల్లంతయ్యారు. రెడ్డి బాబు, గిరిబాబు లు అన్నదమ్ములు కాగా వీరివురు 6వ తరగతి చదువుతున్నట్లు సమాచారం.విరిద్దరి బావమరిది సురేష్ బాబు మూడవ తరగతి చువుతున్నట్లు తేలిసింది. లాక్ డౌన్ కారణంగా ఏక్కడ బయటికి వెళ్ళలేక ఇంట్లోనే వుంటున్న వీరు లాక్డౌన్ సడలింపులు కావడంతో కుందేళ్ళను, ఉడుములను పట్టుకోవడానికి 10 గంటల ప్రాంతంలో ఎపిలవంకపల్లి తూర్పువైపున వున్న కోండపైకి ఎక్కి దారి తప్పారు. సాయంత్రం కోండక్రింద గోర్రేల కాపారులు వారిని చూసి డయల్ 100 కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది, పోలీసు సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలీంపు చర్యలు చేపట్టారు. చిమ్మచికటిలో వారి అరుపులను కనుగోన్న ఒకానీస్టేబుల్ వారిని కనుగోని వారి ఇతర బృందాలకు సమాచారం అందించారు. ముగ్గురిలో ఒ బాలుడికి స్వల్పంగాయాలయ్యినట్లు వారికి వాటర్ బాటిళ్ళు అందించానని మిగితా వారు పైకి రావాలని సూచించాడు. కోండ దగ్గరికి వెళ్లిన ఏస్ఐ మహమ్మద్ రఫీ బృందం పైకి ఏక్కే మార్గం లేక రోప్ (తాడులు కావాలని రాయచోటి పోలీస్టేషన్ కు సమాచారం అందించారు. అర్బన్ సీఐ రాజు తాడులు ఇతర సిబ్బందిని తీసుకెళ్లి లోయలో వున్న వారిని కోండపైకి లాగి సిబ్బంది సహయంతో వారిని అతికష్టం క్రిందకు దించడంతో అందరు ఉపిరిపిలుచుకోన్నారు.
రాయచోటి పోలిసు వారికీ రాచవీడు మీడియా తరపున ప్రత్యేక ధన్యవాదములు...