29/05/2021
ఓడి చెరువు. మండలంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల ను, బియ్యం స్టాక్ పాయింట్ ను శనివారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. మొదట ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల తనిఖీ చేసి ఇ వ్యాక్సినేషన్ ఏ విధంగా జరుగుతుంది టెస్ట్ లు ఎన్ని చేస్తున్నారు అని వైద్యాధికారి ఇ ఆనంద్ వర్ధన్ అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ వీలైనంత ఎక్కువ మందికి వేయాలని, ఎక్కువ మందికి కోవిడ్ పరీక్షలు చేయాలని అని సూచించి పూలు రికార్డులను పరిశీలించారు. అనంతరం బియ్యం స్టాక్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు స్టాక్ ఎంత ఉంది ఎంత స్టాక్ గ్రామాలకు తరలించారు అని స్టాక్ లిస్ట్ రవి స్వామి ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి అభ్యర్థి దామోదర్ రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, డీలర్లు అశ్వంత్ రెడ్డి, రంగారెడ్డి, జౌళి బాబా,తదితరులు పాల్గొన్నారు.