Telangana Prajasakti

Telangana Prajasakti Telangana Prajasakti, also spelled as TS.Prajashakti, is a Telugu news digital platform that is published in digital media, India by the Muppidi Madhusudhan.

It started as a online media in 2014 with Telangana as the center.

21/01/2026
ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న లోరియల్ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభం దావోస్‌:: ప్రపంచం...
21/01/2026

ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న లోరియల్

ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభం

దావోస్‌::

ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్​లో ప్రారంభించనుంది.

దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ –2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. దీంతో గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరుగనుంది.

నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లను లోరియల్ ఆహ్వానించింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లోరియల్ జీసీసీని హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచనపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని చెప్పారు. మెడ్‌టెక్‌, హెల్త్‌టెక్‌ మాత్రమే కాకుండా బ్యూటీ–టెక్‌ వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని మంత్రి అన్నారు. ఇప్పటికే మారియెట్, వ్యాన్ గార్డ్, నెట్ ఫ్లిక్స్, మెక్ డోనాల్డ్స్, హినెకెన్ , జాగర్ , కోస్ట్కో వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయన్నారు.

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH) గురించి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. జీసీసీతో పాటు మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్ను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హియెరోనిమస్ సానుకూలంగా స్పందించారు

దుర్గం చెరువు మాటనగర గుండెల్లో నీలి నిశ్శబ్దం,దుర్గం చెరువు—ఒక కాలపు అందం.పక్షుల పాటల్లో ఊగిన అలలు,ఈరోజు మౌనంగా మూలుగుతు...
21/01/2026

దుర్గం చెరువు మాట
నగర గుండెల్లో నీలి నిశ్శబ్దం,
దుర్గం చెరువు—ఒక కాలపు అందం.
పక్షుల పాటల్లో ఊగిన అలలు,
ఈరోజు మౌనంగా మూలుగుతున్న కలలు.
గుర్రపుడెక్క నీడలు పడిన నీటిలో,
కలుషితమైంది స్వచ్ఛత కథలో.
బోట్ల నవ్వులు ఆగిన తీరాన,
పర్యాటకం కూడా వేసింది మౌనాన్నే ముద్రాన.
అప్పుడు అడుగుపెట్టాడు బాధ్యతతో,
హైడ్రా చేతిలో ఆశల వెలుగుతో.
రంగనాథ్ చూపు చెరువు వైపు,
“రక్షణే మా ధ్యేయం” అన్న సంకల్పపు దీపం నెత్తురు లేకుండా వెలిగింపు.
జీహెచ్‌ఎంసీ, జలమండలి చేతులు కలిపి,
నీటిపారుదల స్వప్నం దిశగా నడిపి,
రహేజా ప్రతినిధులతో కలిసి నడిచిన అడుగులు,
చెరువు పునర్జన్మకు మోగిన పాదమృదంగులు.
మళ్లీ అలలు చెప్తాయి కథలు,
పచ్చదనం పూస్తుంది తీరాల కలలు.
దుర్గం చెరువు—నగర హృదయ స్పందన,
రక్షితమైతే అదే నిజమైన అభివృద్ధి లిఖితం.
ముప్పిడి మధుసూధన్
21.01.2026

దుర్గం చెరువు మాట

నగర గుండెల్లో నీలి నిశ్శబ్దం,
దుర్గం చెరువు—ఒక కాలపు అందం.
పక్షుల పాటల్లో ఊగిన అలలు,
ఈరోజు మౌనంగా మూలుగుతున్న కలలు.

గుర్రపుడెక్క నీడలు పడిన నీటిలో,
కలుషితమైంది స్వచ్ఛత కథలో.
బోట్ల నవ్వులు ఆగిన తీరాన,
పర్యాటకం కూడా వేసింది మౌనాన్నే ముద్రాన.

అప్పుడు అడుగుపెట్టాడు బాధ్యతతో,
హైడ్రా చేతిలో ఆశల వెలుగుతో.
రంగనాథ్ చూపు చెరువు వైపు,
“రక్షణే మా ధ్యేయం” అన్న సంకల్పపు దీపం నెత్తురు లేకుండా వెలిగింపు.

జీహెచ్‌ఎంసీ, జలమండలి చేతులు కలిపి,
నీటిపారుదల స్వప్నం దిశగా నడిపి,
రహేజా ప్రతినిధులతో కలిసి నడిచిన అడుగులు,
చెరువు పునర్జన్మకు మోగిన పాదమృదంగులు.

మళ్లీ అలలు చెప్తాయి కథలు,
పచ్చదనం పూస్తుంది తీరాల కలలు.
దుర్గం చెరువు—నగర హృదయ స్పందన,
రక్షితమైతే అదే నిజమైన అభివృద్ధి లిఖితం.

ముప్పిడి మధుసూధన్
21.01.2026

ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్...
21/01/2026

ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

✳️ ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార–వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ముఖ్యమంత్రి గారు అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రతినిధులకు సూచించారు.

✳️ హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5.75 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

✳️ “ప్రతి ఏడాది మేము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తాం. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం,” అని తెలిపారు.

✳️ హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCCs) ప్రధాన కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడుతామని చెప్పారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

✳️ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని అన్నారు.

✳️ ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030ను ఆవిష్కరించారు.

✳️ సమావేశంలో పాల్గొన్న మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు–కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన క్యూర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని తెలిపారు.

✳️ ప్రముఖ నటుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి గారితో కలిసి వారు విందులో పాల్గొన్నారు.

హాస్టల్స్ లో మెనూ ప్రకారం  నాణ్యమైన భోజనం అందించాలని లేనిచో చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ...
26/06/2025

హాస్టల్స్ లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని లేనిచో చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను హెచ్చరించారు.

బుధవారం భువనగిరి పట్టణంలోని సింగన్న గూడెం చౌరస్తాలోని ఎస్టి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... హాస్టల్ లో విద్యార్థులకి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.హాస్టల్ లో నిల్వ ఉన్న కూరగాయలు , ఆహార పదార్థాలను పరిశీలించి నాణ్యత లేని పదార్థాలను తీసేసి క్వాలిటీ పదార్థాలను ఉపయోగించాలన్నారు.
మెనూ ప్రకారం పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ చదువు పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీద కుటుంబం పోవాలంటే కష్ట పడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు , సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.విద్యార్థులకి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు.హాస్టల్ లో ఉన్న సిసి కెమెరాలు ఉపయోగం లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. హాస్టల్ లో కి దోమలు రాకుండా కిటికీలకి మెష్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
విద్యార్థులు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేందుకు అవసరమైన బుక్స్ అందుబాటులో ఉండేలా విధంగా చూస్తామన్నారు.

సమిష్టి కృషితోనే  డ్రగ్స్ రహిత జిల్లా నిర్మాణం  ----జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.సమిష్టి కృషితో నారాయణపేట ను డ్రగ్స్ ...
26/06/2025

సమిష్టి కృషితోనే డ్రగ్స్ రహిత జిల్లా నిర్మాణం

----జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సమిష్టి కృషితో నారాయణపేట ను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నారు. గురువారం ప్రపంచ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని, గతేడాది కూడా ఈ ర్యాలీలో తాను పాల్గొన్నానని, ఇప్పుడు కూడా పాల్గొనడం, ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే లభించే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారిలు మారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఈ విషయంలో మన నారాయణపేట జిల్లా ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నా.. ఇక్కడి విద్యార్థులు హైదరాబాద్, బెంగళూరు, ముంబాయి లాంటి నగరాలకు చదువుల కోసం వెళ్తుంటారని, ఆయా నగరాల ప్రభావం ఈ ప్రాంతంపై పడే అవకాశం ఉందని, అందుకే గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పౌరులు, యువత, విద్యార్థులు కృషి చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణను చేపట్టిందన్నారు. జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగించినట్లు గుర్తిస్తే రాష్ట్ర పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ 1908 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాల నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారని తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీసు శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. తర్వాత యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలే నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు, జిల్లా అధికారులు బహుమతులను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ ఐ యాం ఎన్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అంటూ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సంతకాలు చేపట్టారు. డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. చివరగా మత్తు పదార్థాల నిరోధక దినోత్సవ అవగాహన ర్యాలీని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం అక్కడ పాఠశాలల విద్యార్థులతో కలిసి మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, జిల్లా అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్, డి.ఎస్.పి నల్లపు లింగయ్య, డీఈవో గోవిందరాజులు, ఆర్టీవో మేఘా గాంధీ, డిపిఆర్ఓ ఎం.ఏ. రషీద్, జిల్లా అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీ.పీ సమీక్ష నిజామాబాద్, జూన్ 26 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలక...
26/06/2025

కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీ.పీ సమీక్ష

నిజామాబాద్, జూన్ 26 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29 కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై గురువారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు అవుతుండడంతో, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కేంద్ర హోం మంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతా పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీ.పీ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జీజీహెచ్, మెడికల్ కళాశాలలను సందర్శించిన కలెక్టర్, హెల్త్ డైరెక్టర్  అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన  వైద్య విభాగాల అధిప...
26/06/2025

జీజీహెచ్, మెడికల్ కళాశాలలను సందర్శించిన కలెక్టర్, హెల్త్ డైరెక్టర్

అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన

వైద్య విభాగాల అధిపతులతో సమీక్ష

నిజామాబాద్, జూన్ 26 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వైద్య కళాశాలలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఐ.సీ.యు, ఆర్.ఐ.సీ.యు, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు, టీ.హబ్ తదితర వాటిని తనిఖీ చేశారు. వైద్య కళాశాలలో ఫిజియాలజి, అనాటమీ, హెమటాలజి ల్యాబులు, లైబ్రరీ, లెక్చర్ హాల్ ఇతర విభాగాలను సందర్శించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కొత్తగా ఏయే సదుపాయాలు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరం అన్నది గుర్తిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ లను ఆదేశించారు. ఈ నివేదికను అనుసరిస్తూ సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అన్ని విభాగాల పనితీరు మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, వైద్య సేవల్లో జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. తాను క్రమం తప్పకుండా ఆసుపత్రిని తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. జీజీహెచ్ ఆధ్వర్యంలో అందిస్తున్న అధునాతన వైద్య సేవల గురించి ప్రజలకు తెలిసేలా చూడాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పెంపొందుతుందని సూచించారు. వైద్య కళాశాలలో జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, తద్వారా ఎన్ఎంసీ అనుమతుల మంజూరీలో ఇబ్బందులకు ఆస్కారం ఉండదని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్ లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఉండాలన్నారు. ఆయా విభాగాలలో ఖాళీలు ఉంటే, వాటి వివరాలను సమర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు. వీరి వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వైద్య విభాగాల అధిపతులు ఉన్నారు.

గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక ...
26/06/2025

గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని భువనగిరి జూనియర్ కాలేజీ నుండి ఈ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,  కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఉమ్మడి జి...
26/06/2025

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో , ప్రజా ప్రతినిధులతో కలసిగురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పై సమావేశం నిర్వహించి మాట్లాడుతున్న దృశ్యం.

గురువారం  ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో  అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏ...
26/06/2025

గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నకు
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని, తంగేడు మైదానం వద్ద ర్యాలీని జెండా
ఊపి మంత్రి ప్రారంభించారు. ర్యాలీ డి ఎల్ ఆర్
గార్డెన్ వరకు కొనసాగింది.

ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్,
ఎస్ పి షబరిష్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, అదనపు ఎస్ పి సదానందం, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్,
సంబంధిత అధికారులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Address

Telangana Prajasakti C/o H. NO. 2-151, Thatiparthy Village, Yacharam Mandal, Rangareddy District
Ranga Reddy
501509

Alerts

Be the first to know and let us send you an email when Telangana Prajasakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telangana Prajasakti:

Share