Bukke Dharma Naik IIS

Bukke Dharma Naik IIS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bukke Dharma Naik IIS, Media/News Company, rayachoti, Rayachoti.

ఈ రోజు రాత్రి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించిన లంబాడీల ఆరాధ్య పండుగ తీజ్ ఉత్సవాలల్లో జై సేవలాల్, మా...
08/08/2024

ఈ రోజు రాత్రి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించిన లంబాడీల ఆరాధ్య పండుగ తీజ్ ఉత్సవాలల్లో జై సేవలాల్, మారెమ్మ అమ్మవార్లను దర్శించుకుని తీజ్ ఉత్సవాలలో పాల్గొన్నాను.

https://youtu.be/E_4eOfom_BA?si=ROrBetc859e0aRuT
08/08/2024

https://youtu.be/E_4eOfom_BA?si=ROrBetc859e0aRuT

బోధన్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు " కార్గిల్ విజయ్ దివస్" రజతోత్సవం సంధర్భంగా central beareau of communication మరియు బోధన్ ప....

https://youtu.be/YlksiKv070M?si=gceHx1tYyGp2BHv6
08/08/2024

https://youtu.be/YlksiKv070M?si=gceHx1tYyGp2BHv6

సెంట్రల్ బ్యూరో ఆప్ కమ్యూనికేషన్ feild office నిజామాబాద్ మరియు ఆకాశవాణి, నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రీయ విద్.....

https://youtu.be/WRSa41Pbb_c?feature=shared
02/03/2024

https://youtu.be/WRSa41Pbb_c?feature=shared

Central bureau of communication Field Publicity officer శ్రీ B.ధర్మనాయక్ గారితో పరిచయం.పరిచయకర్త: CH.మోహన్ దాస్ గారు

13/05/2023

అమ్మ’ లేకపోతే జననం లేదు.. ‘అమ్మ’ లేకపోతే గమనం లేదు.. ‘అమ్మ’ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. ‘అమ్మ’ లేకపోతే అసలు సృష్టే లేదు.. బిడ్డలకు ఆది గురువై.. సేవాతత్వానికి నిలువెత్తు నిదర్శనమై.. జీవితాంతం పిల్లల సంతోషం కోసం శ్రమించే దేవత అమ్మ.. తల్లులందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

పత్రికా ప్రకటన*👉🏻జగనన్న కాలనీలలో లబ్దిదారులందరూ...త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలి**👉🏻లబ్దిదారులకు అవసరమైన సదుపా...
13/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻జగనన్న కాలనీలలో లబ్దిదారులందరూ...త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలి*

*👉🏻లబ్దిదారులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలి*

*👉🏻కంటేవారిపల్లి జగనన్న కాలనీ లేవుట్ లో జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*కురబలకోట, మే 13*

*జగనన్న కాలనీలలో లబ్దిదారులందరూ...త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ అన్నారు.*

*శనివారం అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, కంటేవారిపల్లి జగనన్న కాలనీ లేవుట్ లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.*

*కంటేవారిపల్లి జగనన్న కాలనీ లే అవుట్ లో మొత్తం ఎన్ని ఫ్లాట్లు, ఎన్ని ఇల్లు మంజూరు చేశారు వంటి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీలో లబ్దిదారులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులందరని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్చి ప్రభుత్వం తరఫున సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు.*

*కలెక్టర్ గారితో పాటు మదనపల్లి ఆర్డీఓ మురళి, ఎంపీడీఓ, తహసీల్దార్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

*----Issued by PRO, Annamayya Dist----*

పత్రికా ప్రకటన*👉🏻ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ లో సాహసక్రీడలు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి**👉🏻పర్యాటకులు కోసం ట్ర...
13/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ లో సాహసక్రీడలు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి*

*👉🏻పర్యాటకులు కోసం ట్రెక్కింగ్‌ తదితర కార్యక్రమాలు*

*👉🏻హార్సిలీహిల్స్‌ ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*హార్సిలీహిల్స్‌, మే 13:-*

*అన్నమయ్య జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రంగా ఆంధ్రా ఊటీగా విరాజిల్లుతున్న హార్సిలీహిల్స్‌ లో సాహసక్రీడలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ ఆదేశించారు.*

*శనివారం ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ ను సందర్శించి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.*

*ఈ సందర్భంగా ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ లో సాహస క్రీడలు ఏర్పాటుకు అనువుగా ఉందా లేదా అని నిపుణులతో కలిసి పరిశీలించారు. ఏటీవీ వెహికల్స్, రాప్లింగ్, పర్యాటకులు కోసం ట్రెక్కింగ్‌ తదితర కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యచరణ చేయాలని అధికారులను ఆదేశించారు. హార్సిలీహిల్స్‌ మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొండకు వచ్చే పర్యాటకులు విడిది చేయడానికి వీలుగా అనువైన సౌకర్యాలతో పాటు, చిన్న పిల్లలు ఆడుకునేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే అతిథులకు అందించే సౌకర్యాలు, సేవలు సందర్శకులను ఆకట్టుకునేలా మరింత అభివృద్ధి చేయాలన్నారు.*

*కలెక్టర్ గారితో పాటు మదనపల్లి ఆర్ డిఓ మురళీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

*----Issued by PRO, Annamayya District----*

*సక్సెస్ స్టోరీ**అన్నమయ్య జిల్లా**రాయచోటి**తేదీ : 13-05-2023**★ శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు**★ పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర...
13/05/2023

*సక్సెస్ స్టోరీ*

*అన్నమయ్య జిల్లా*
*రాయచోటి*

*తేదీ : 13-05-2023*

*★ శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు*

*★ పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో అన్నమయ్య జిల్లా*

*★ ఇంతవరకూ 20,946 ఇళ్లు పూర్తి*

*★ వివిధ దశల్లో 52,490 ఇళ్లు*

*★ 502 లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలు*

*★ రూ.606.01 కోట్ల బిల్లులు చెల్లింపు*

*★ మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రతి శనివారం ‘హౌసింగ్‌ డే’*

*★ లక్ష్యం నిర్ణయించుకొని వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు*

*రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో పేదల సొంతింటి కల సాకారమవుతోంది. అన్నమయ్య జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 502 లేఅవుట్లలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. సొంత స్థలం కలిగిన వారు ప్రభుత్వం సాయంతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకుని సొంతింటికి చేరి తమ కల నేరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 502 లేఅవుట్లుగా చేసి 79,661 మందికి ఇళ్లు మంజూరు చేశారు. అందులో 73,436 మంది లబ్దిదారులు రిజిస్ట్రార్ చేసుకున్నారు. ఇంకా 5898 మంది లబ్దిదారులు రిజిస్ట్రార్ చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకు 20,946 వేల ఇళ్లు పూర్తి చేయగా వాటిలో 20,946 వేల వరకు గృహ ప్రవేశాలు జరిగాయి. ఇళ్ల నిర్మాణంలో అన్నమయ్య జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే నాలుగవ స్థానంలో నిలుస్తోంది*.

*పుంజుకున్న నిర్మాణాలు...వివిధ దశల్లో 52,490 ఇళ్లు :-*

ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. 'నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా శ్లాబ్‌, సన్‌డైన్‌, బేసిమెంట్‌ తదితర దశల నిర్మాణాల్లో 52,490 ఇళ్లు ఉన్నాయి. ఎన్.ఎస్ దశలో 938, బిలో బేస్‌మెంట్‌ లెవెల్ 20,294, బేస్‌మెంట్‌ లెవెల్‌ 21,177, ఇళ్లు ఉన్నాయి. రూఫ్‌ లెవెల్లో 6899, స్లాబ్‌ లెవెల్లో 3,182 ఇళ్లు ఉన్నాయి. కలెక్టర్‌ గిరీషా పిఎస్ జిల్లాలోని జగనన్న లేఅవుట్‌లో ఇళ్లు నిర్మాణం వేగంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు హౌసింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలో పెద్ద ఎత్తున గృహప్రవేశలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

*మా జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి :-*

నా పేరు షేక్ మహమ్మద్ అలీ రాయచోటి నారాయణరెడ్డి పల్లి జగనన్న లేఅవుట్ కాలనీలో ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశం అయ్యాను. నేను ఇంతకు ముందు రాయచోటిలో అద్దె గది కోసం రూ.5 వేలు చెల్లింపు చేసే వాడిని. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తమకు ఇచ్చిన ఇంటి స్థలం నేడు లక్షల రూపాయల ఆస్తిగా నిలిచింది. విలువైన స్థలాలను ఉచితంగా అందించి మాలాంటి పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. *-మహమ్మద్ అలీ షేక్, నారాయణరెడ్డి పల్లి జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటి, అన్నమయ్య జిల్లా.*

*అద్దె ఇంటి బాధలు తీరయి :-*

నా పేరు వేమల్ల సుబ్బమ్మ నారాయణరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటిలో నివాసం ఉంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సెంటు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ధర పలికే విలువైన స్థలాలను ఉచితంగా అందించారు. మా జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. నేను ఇటీవలే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాను. ఇంటి బాధలు తీరుతున్నాయని అద్దె ఇంటి నుంచి సొంతింటికి చేరాను. *-వేమల్ల సుబ్బమ్మ, జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటి, అన్నమయ్య జిల్లా.*

*రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం :-*

ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. మండలాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన మండలాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్‌ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్‌లు సందర్శించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. లేఅవుట్లలో మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.*-అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్.*

*----Issued by PRO, Annamayya District----*q

పత్రికా ప్రకటన*👉🏻ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి**👉🏻లే అవుట్ వెళ్లేందుకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి**👉🏻అధికారులను ...
13/05/2023

పత్రికా ప్రకటన

*👉🏻ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి*

*👉🏻లే అవుట్ వెళ్లేందుకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి*

*👉🏻అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్*

*బి.కొత్తకోట, మే 13:-*

*నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు.*

*శనివారం బి.కొత్తకోట మండలం కురవానికుంట జగనన్న కాలనీ లేవుట్ ను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ పరిశీలించారు. లేఅవుట్ లో ఎన్ని ఇల్లు మంజూరు, ఎన్ని ఇళ్లు పూర్తి, ఏ ఏ దశలో ఉన్నాయి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పేదల ఇళ్ల కల సాకారం అయ్యేలా మౌలిక వసతులు కల్పించి త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. లేవుట్ వెళ్లేందుకు రోడ్డు బాగా లేకపోవడంతో త్వరగా రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు*.

*కలెక్టర్ గారితో పాటు మదనపల్లి ఆర్ డిఓ మురళి, హౌసింగ్, రెవెన్యూ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.*

*చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం - రైతన్నలో  వెళ్లివిరిసిన ఆనందం....*  *......మనోభావాలు.....**చాలా ఇబ్బందులు పడ్...
12/05/2023

*చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం - రైతన్నలో వెళ్లివిరిసిన ఆనందం....*

*......మనోభావాలు.....*

*చాలా ఇబ్బందులు పడ్డా :-*

నా పేరు బొజ్జ చంగల్ రెడ్డి, రాయచోటి మండలం, బోట్ల చెరువు గ్రామంలో నివసిస్తున్నాను. మా ఊర్లో సర్వేనెంబర్ 62.ఏ1లో 70 సెంట్ల భూమి చుక్కల భూముల పడింది. దీంతో ఏళ్ల తరబడి చాలా ఇబ్బందులు పడ్డా. జగనన్న మా పాలిట దేవుడు లాగా చుక్కల భూమికి శాశ్వత పరిష్కారం చూపడం నా కుటుంబం అంతా జగనన్నకు రుణపడి ఉంది.*-బొజ్జ చంగల్ రెడ్డి, బోట్ల చెరువు గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*చాలా ఆనందంగా ఉంది :-*

మా ఊర్లో సర్వేనెంబర్ 62.ఏ1లో 1.07 సెంట్ల భూమి చుక్కల భూముల పడింది. మా భూములన్నీ ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్కారం చూపారు. చాలా ఆనందంగా ఉంది. *-బి. నారాయణ రెడ్డి, బోట్ల చెరువు గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు :-*

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో చుక్కల భూముల సమస్యలున్న రైతులను ఆదుకుంటారని చెప్పారు. నాకు గ్రామంలో సర్వేనెంబర్ 347/1 లో విస్తీర్ణం 0.15 సెంట్ల భూమి చుక్కల భూమి కలదు. ఈ రోజు చుక్కల భూమికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న శాశ్వత పరిష్కారం చూపారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సమస్య పరిష్కారం కావడం చాలా సంతోషం ఉంది. *-పాఠాన్ రెహమత్ బీ, సిబ్యాల గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*మా ఆస్థిపై పూర్తి హక్కులు :-*

చుక్కల భూములు వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి. మా గ్రామంలో ఉన్న 27 సెంట్లు భూమిని ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పరిష్కారం చెప్పారు. మా ఆస్థిపై పూర్తి హక్కులు వచ్చాయి. ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కల్పించింది. *-చిన్నక్క, మాధవరం గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా.*

*----Issued by PRO, Annamayya District----*

Address

Rayachoti
Rayachoti
516268

Website

Alerts

Be the first to know and let us send you an email when Bukke Dharma Naik IIS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share