Mana Rayachoti

Mana Rayachoti RAYACHOTI & ANNAMAYYA DIRSTRICT NEWS AND AROUND THE GLOBE

25/08/2025
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్తAP: తల్లికి వందనం పథకం పెండింగ్ నిధులువిడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆ...
25/08/2025

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త

AP: తల్లికి వందనం పథకం పెండింగ్ నిధులు

విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని స్పష్టం చేశారు. దీంతో దాదాపు రూ. 325 కోట్ల నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయి. పేదరికం కారణంగా పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది.

*M. పుల్లారెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు..*చిన్నమండెం మండలం 25-08-2025సోమవార...
25/08/2025

*M. పుల్లారెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు..*

చిన్నమండెం మండలం
25-08-2025

సోమవారం రోజు రాత్రి మండలంలోని నడిగడ్డపల్లెలో గల నల్లకుంట పుల్లారెడ్డి ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటి వద్దకు వెళ్లి భౌతికయానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు...

*వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.**ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనుంది.* *రాబోయే దసరా శరన్...
25/08/2025

*వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.*

*ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనుంది.*

*రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తాం.*

*వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు కూటమి ప్రభుత్వం వెచ్చించనుంది -మంత్రి నారా లోకేష్*

త్వరలో మదనపల్లె జిల్లా ప్రకటన..?
25/08/2025

త్వరలో మదనపల్లె జిల్లా ప్రకటన..?

అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో నలంద డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న స్వాతి(22) లేడీస్ హాస్టల్ తెల్లవారు...
25/08/2025

అనంతపురం జిల్లా

అనంతపురం నగరంలో నలంద డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న స్వాతి(22) లేడీస్ హాస్టల్ తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య.

మృతురాలి స్వస్థలం సత్యసాయి జిల్లా, పెనుగొండ మండలం, గొందిపల్లి గ్రామం.

స్వాతి చదువుకుంటూ నగరంలో ని దీపు రక్త పరీక్ష కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది.

బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లె*అంకిశెట్టిపల్లె వైసీపీ సర్పంచి శరత్ రెడ్డి చెక్ పవర్ రద్దు*అంకిశెట్టిపల్లి గ్ర...
25/08/2025

బ్రేకింగ్ న్యూస్

అన్నమయ్య జిల్లా మదనపల్లె

*అంకిశెట్టిపల్లె వైసీపీ సర్పంచి శరత్ రెడ్డి చెక్ పవర్ రద్దు*

అంకిశెట్టిపల్లి గ్రామ వైసిపి సర్పంచి శరత్ రెడ్డి చెక్ పవర్ ను అధికారులు రద్దు చేశారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లి గ్రామ వైసీపీ సర్పంచిగా పనిచేస్తున్న శరత్ రెడ్డి పై అవినీతి అక్రమాలు, రెండేళ్ల వ్యవధిలో రూ. 22 లక్షల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డట్లు జిల్లా డిపిఓ రాధా ఇతర అధికారుల విచారణలో తేలడంతో అతని చెక్ పవర్ ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రద్దుచేశారు. సర్పంచి శరత్ రెడ్డి తన పదవీ కాలంలో ప్రభుత్వ స్థలాలు విక్రయించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి పాల్పడ్డ సర్పంచి చెక్ పవర్ రద్దు కావడంతో, పంచాయతీ కార్యదర్శి, ఈవోపిఆర్డీల పర్యవేక్షణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని మదనపల్లి ఇంచార్జి ఎంపీడీవో మస్తాన్ తెలిపారు.

*ఎక్కడ బెస్ట్‌ డీల్‌ ఉంటే అక్కడే చమురుకొంటాం: కుండబద్దలు కొట్టిన భారత్‌** రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్...
25/08/2025

*ఎక్కడ బెస్ట్‌ డీల్‌ ఉంటే అక్కడే చమురుకొంటాం: కుండబద్దలు కొట్టిన భారత్‌*

* రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పశ్చిమ దేశాల విమర్శలను న్యూదిల్లీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.

*శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు...*  చిన్నమండెం తేదీ:25-08-25సోమవారం రోజు ...
25/08/2025

*శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు...*

చిన్నమండెం
తేదీ:25-08-25

సోమవారం రోజు ఉదయం పడమటికోన గ్రామం వడ్డేపల్లి నందు నూతనంగా వెలిసినటు వంటి శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మంత్రి గారిని గజమాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు..

అమరావతి :*📍ఏపీలో గ్రామ /వార్డు సచివాలయ ఉద్యోగులను ఏయే FPS(రేషన్)షాపులకు మ్యాప్ చేశారో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్...
25/08/2025

అమరావతి :

*📍ఏపీలో గ్రామ /వార్డు సచివాలయ ఉద్యోగులను ఏయే FPS(రేషన్)షాపులకు మ్యాప్ చేశారో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.*

*📍R4.67 Mapping of GSWS Employees to Fair Price Shops*

👇🏻👇🏻👇🏻👇🏻
🔗https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/ #!/FPShopsReport

*📍గమనిక:* తహశీల్దార్ లాగిన్ లో మ్యాపింగ్ పూర్తి అయిన వారి వివరాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి.

NA అని ఉంటే ఇంకా మ్యాపింగ్ పూర్తి కాలేదు అని గమనించగలరు.

📍మ్యాప్ అయిన సచివాలయ ఉద్యోగులు ఆ చౌక దుకాణం(FPS) పరిధిలోని వారికి కొత్తగా వచ్చిన *స్మార్ట్ రైస్ కార్డులను* పంపిణీ చేయవలసి ఉంటుంది.

రక్తదానం అనేది ఒక గొప్ప సామాజిక సేవ:మయాన మహమ్మద్ అలీ పఠాన్ గారు, షేక్ అతావుల్లా గారు  అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ...
25/08/2025

రక్తదానం అనేది ఒక గొప్ప సామాజిక సేవ:మయాన మహమ్మద్ అలీ పఠాన్ గారు, షేక్ అతావుల్లా గారు

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం

అత్యవసర పరిస్థితిలో గర్భిణీ A నెగిటివ్ రక్తదానం

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం అలిమాబాద్ స్ట్రీట్ కి చెందిన షేక్ సీమ అనే గర్భిణీ స్త్రీ డెలివరీ కొరకు అమరావతి హాస్పిటల్ నందు చేరగా ఆమెకు వెంటనే A- నెగిటివ్ రక్తము అత్యవసరమని డాక్టర్స్ పేషెంట్ వారికి తెలపగా వారు వెంటనే హీబ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మయాన మహమ్మద్ అలీ పఠాన్ గారిని సంప్రదించగా వారు అమానత్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు షేక్ అతావుల్లా గారితో కలిసి అపోలో ఫార్మసీ స్టాప్ సద్దాం గారి చేత శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ నందు A- నెగిటివ్ రక్తదానం చేపించారు.

అత్యవసర సమయంలో స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సద్దాం గారికి ఆర్గనైజేషన్ తరపున పేషంట్ వారి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెంకటేష్, అస్లాం, పేషంట్ వారి బంధువులు పలువురు పాల్గొన్నారు

తండ్రి కష్టపడి చదివించాడు కొడుకులు విజయం సాధించారు.పొన్నూరు పట్టణం 29వ వార్డు కు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం  SPP రోడ్డు మొబ...
25/08/2025

తండ్రి కష్టపడి చదివించాడు కొడుకులు విజయం సాధించారు.

పొన్నూరు పట్టణం 29వ వార్డు కు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం SPP రోడ్డు మొబైల్ షాప్ నిర్వహిస్తూ తన ఇద్దరు కుమారులను ఉన్నతమైన చదువులు చదివించాడు.

పెద్ద కుమారుడు మొహమ్మద్ ఇస్మాయిల్ అన్సారి చెన్నైలో TCS కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఎలాంటి కోచింగ్ లేకుండా DSC ఫలితాల్లో. 80.53 మార్కులు సాధించి టీచర్ ఉద్యోగం సాధించాడు.

అలాగే రెండవ కుమారుడు
మొహమ్మద్ సోహెల్ తన్వీర్
నీట్ యూజీ-2023 ప్రవేశ పరీక్షలో 3030వ ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాదులో డాక్టర్ చదువుతున్నాడు.


మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి సెల్ పాయింట్ నిర్వహిస్తూ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించి తన ఇద్దరు కుమారులను సమాజం కోసం పనిచేసే వ్యక్తులుగా తీర్చిదిద్దిన మొహమ్మద్ ఇబ్రహీంకు అభినందనలు తెలుపుతున్నాం
#హృదయపూర్వక శుభాకాంక్షలు..

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Rayachoti:

Share