Mana Rayachoti

Mana Rayachoti RAYACHOTI & ANNAMAYYA DIRSTRICT NEWS AND AROUND THE GLOBE
(1)

SRH register their fourth win of the IPL 2025 season! 🧡🙌They chased down a massive 206 with ease, winning by six wickets...
19/05/2025

SRH register their fourth win of the IPL 2025 season! 🧡🙌

They chased down a massive 206 with ease, winning by six wickets! 🤝

🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨Lucknow Super Giants become the fifth team to get knocked out of the IPL 2025 season after their defeat to S...
19/05/2025

🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨

Lucknow Super Giants become the fifth team to get knocked out of the IPL 2025 season after their defeat to SRH!

19/05/2025
అన్నమయ్య జిల్లా మదనపల్లె లో  జరిగిన " హిందూ హనుమాన్ శోభా యాత్ర "  సంఘటన పై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా  సమావే...
19/05/2025

అన్నమయ్య జిల్లా మదనపల్లె లో జరిగిన " హిందూ హనుమాన్ శోభా యాత్ర " సంఘటన పై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం....

17.05.2025 వ తేదీకి 3 రోజుల క్రితం మదనపల్లి పట్టణంలోని రామాలయం నుండి ఎన్‌టి‌ఆర్ సర్కిల్ > నీరుగట్టువారిపల్లే > చౌడేశ్వరి సర్కల్ > గొల్లపల్లి క్రాస్ > అంబేద్కర్ సర్కల్ > బర్మా వీధి > సబ్ కలెక్టర్ ఆఫీసు > నిమ్మనపల్లి సర్కల్ > ఎన్‌వి‌ఆర్ లే ఔట్ > శేష మహల్ > చిత్తూర్ బస్టాండ్ > నెహ్రూ బజార్, అప్పరావ్ వీధి > బెంగళూరు బస్ స్టాండ్ మీదుగా రామాలయం వరకు “హిందూ హనుమాన్ శోభ యాత్ర” జరపాలని శ్రీ బండి బాలాజీ విజయ్ కుమార్ @ బండి బాలాజీ, వారితో సుమారు 400 మంది 300 మోటార్ సైకిళ్లలో ర్యాలీ చేయాలని అనుమతి కొరగా జిల్లాలో వున్న ప్రస్తుత శాంతిభద్రతల కారణంగా మరియు, మదనపల్లిలో ఉన్న ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా, మదనపల్లి SDPO శ్రీ S. మహేంద్ర 16.05.2025 వ తేదీ రాత్రి 8.00 గం. లకు సదరు ర్యాలీ నిర్వాహకులతో తన ఆఫీసునందు మీటింగ్ నిర్వహించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ వుండటకు ర్యాలీని 17.05.2025 వతేదీ మద్యాహ్నము 3.00 గంటలకు ప్రారంబించి రామాలయం నుండి ఎన్‌టి‌ఆర్ సర్కిల్ > అనిబిసెంట్ సర్కిల్ > మల్లిఖార్జున సర్కిల్ > మెట్రో కాంప్లెక్స్ సర్కిల్ > అంబేద్కర్ సర్కల్ > బర్మా వీధి > సబ్ కలెక్టర్ ఆఫీసు > చిత్తూర్ బస్టాండ్ > నెహ్రూ బజార్ > వెంకటేశ్వరస్వామి గుడి > మడికాయల శివాలయం > కాలనీ గేట్ మీదుగా రామాలయం చేరే విధంగా హెల్మెట్లు ధరించి ర్యాలీ చేయాలని, రూటు అనుమతి ఇవ్వడం జరిగినది. దానికి నిర్వాహకులు ఒప్పుకోని పోవడం జరిగినది. దీని మేరకు, మదనపల్లి SDPO గారు తగిన సిబ్బందితో అనుమతించిన రూటులో బందోబస్తు వేసుకొని సంసిద్దంగా వుండటం జరిగినది.

✅17.05.2025 వతేదీ మదనపల్లి పట్టణంలోని రామాలయం నుండి సాయంత్రం 4.30 pm గంటలకు శ్రీ బండి బాలాజీ విజయ్ కుమార్ సుమారు 400 మందితో 300 మోటార్ సైకిళ్లలో ర్యాలీగా బయలుదేరి,అనుమతించిన రూటు మేర రాకుండా, ముందుగా వాళ్ళు నిర్ణయించుకొన్న రూటులోవచ్చి, ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు సా. 5.00 pm గం.లకు చేరుకొనగా, అక్కడ పోలీసు శాఖ నుంచి అనుమతి పొందిన రూటు మార్గంలో వెళ్లాలని, మదనపల్లి SDPO శ్రీ S. మహేందర్ గారు, I టౌన్, II టౌన్ మరియు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్లు ర్యాలీ నిర్వాహకులను సూచించగా, తాము ముందు నిర్ణయించుకున్న పాత రూట్ మ్యాప్ లోనే వెళ్తామని, పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగి ధర్నాకు కూర్చోవడం జరిగినది. అప్పటికే రెండు గంటలు ఆలస్యంగా ర్యాలి మొదలుపెట్టినందున ట్రాఫిక్ 2 గంటల నుండి స్థంభించినది. పోలీసువారు అనుమతించిన రూట్ లోనే వెళ్లాలని ప్రజలకు, ట్రాఫిక్ సమస్య లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లాలని సూచించిన కానీ, వారు వినలేదు. వారిలో సుమారు 150 మందిని బండి బాలాజీ రెచ్చగొట్టగా, మోటార్ సైకిల్ లను బలవంతంగా తోలుకుంటూ కదిరి రోడ్డువైపు వెళ్లి పోయినారు. మిగిలిన వారు పొలిసు వారి మాట వినకుండా, అక్కడే కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తుండగా, అటుగా వెళ్ళుచున్న ఎస్పీ గారికి దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుచున్నారని పలు పిర్యాదులు రాగా జిల్లా ఎస్పీ గారు వెంటనే ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరి అక్కడ రోడ్డుపైన కూర్చొన్న వారితో మాట్లాడి, ఇలా చేయడం మంచి పద్దతి కాదని, ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పోలీస్ బందోబస్త్ వున్న రూటులో, పోలీసు వారు అనుమతి యిచ్చిన రూటులో వెళ్ళమని కొరినారు. పోలీసులు ఎంత చెప్పిన బండి బాలాజీ వినకపోయేసరికి, బండి బాలజీని అదుపులోనికి తీసుకోని, మదనపల్లి II టౌను పోలీసు స్టేషనుకు తరలించడం జరిగినది.

✅తరువాత బండి బాలాజీ సూచనల మేరకు అతని అనుచరులు 150 మంది గొల్లపల్లి సర్కిల్ కు వెళ్ళి పోలీసులు ఎవరు లేని రూట్లో కూర్చొని సుమారు అరగంట పాటు తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారి-240లో, బస్సులు ఆపి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించడం జరిగినది. తదుపరి అక్కడనుండి పోలీసుల అనుమతి లేకపోయిన అక్కడ నుండి బయలుదేరి, కొంత మంది II టౌను పోలీసు స్టేషను ముందు ఆగి, ధర్నాచేసి తిరిగి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో, ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్నారని, 2 టౌను స్టేషనులోవున్న సెంట్రీ, మిగులు సిబ్బంది వెంటనే రోడ్డుపై వచ్చి ట్రాఫిక్ అంతరాయము గురించి ఎంత వారించిన వాళ్ళు వినకపోవడంతో, సుమారు ఒకగంట పాటు ప్రజలకు తీవ్ర అసౌకర్యంకు గురిచేయడంతో అక్కడికి చేరుకొన్న మదనపల్లి I టౌను, II టౌను, మొలకలచెరువు సి.ఐలు మరియు వివిద స్టేషనుల సిబ్బంది ఎంత చెప్పిన బండి బాలాజీ అనుచరులు వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో, వర్షం పడే అవకాశం ఉంది, ప్రజలు మరింత అసౌకర్యానికి గురవతారని గమనించి, సిబ్బంది అక్కడ వున్నవారిని చెదరగొట్టడమైనది.

✅ఇందులో ప్రజలు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని, పోలీసులు ర్యాలీని అడ్డగించినారని ప్రచారం జరుగుతున్నవిషయం పూర్తిగా అవాస్తవం. పోలీసువారు పైర్యాలీకి సరియైన సమయం, రూటు నిర్దేశించి అనుమతి ఇస్తూ, అనుమతి యిచ్చిన రూటులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వుండుటకు, 100 మందికి పైగా సిబ్బందితో ముందస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. మద్యాహ్నం 3.00గం.లకు ప్రారంబించవలసిన ర్యాలీ, 3.00 గం. లకు ప్రారంబించకుండా, ఆలస్యంగా 4.30 గంటలకు ప్రారంబించి, పోలీసులు లేని రూటులో వెళ్ళుతామని పోలీసులతో వాగ్వివాదానికి దిగి అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగించి, పోలీస్ అడ్డుకొన్నప్పటికి, అనేక చోట్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించి తిరిగి II టౌను పోలీస్ స్టేషను ముందు అదేవిధంగా ట్రాఫిక్ కి అంతరాయము కలిగే విధం గా ధర్నా చేయడంతో, తప్పనిసరి పరిస్థితులలో పోలీసులు అక్కడ చేరిన గుంపును అక్కడి నుండి చెదరగొట్టి ట్రాఫిక్ క్రమ బద్దీకరించడం జరిగినది.

ఇందులో లోపాలు/ఉల్లంఘనలు.

👉పోలీసులు బందోబస్తు యిచ్చిన, వాళ్ళు అనుమతి యిచ్చిన రూటులో కాకుండా వాళ్ళు నిర్ణయించుకొన్న రూటులో వెళ్ళడం.

👉హెల్మెట్లు ధరించకుండా ర్యాలీ చేయడం.

👉పబ్లిక్ స్థలములో ధర్నా చేసి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం జరిగిందే తప్ప, వారికి అనుమతి ఇవ్వడం నిరాకరించలేదని పోలీసులు ర్యాలీని అడ్డుకొన్నారన్న వదంతులు అపద్దము.

👉ఇలాంటి దుష్ప్రచారములు ఏవరైన చేస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.

👉ఒక వర్గానికి చెందిన సీఐ. లాఠీ చార్జి చేసినారని ప్రచారం జరుగుచున్నది. దీనికి పోలీసు శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది.

👉బండి బాలాజీ అతని అనుచరులు కావాలనే, పోలీసులు తమ కోరిన రూటు అనుమతి ఇవ్వలేదని, తాము కొరుకొన్న రూటులోనే వెళ్లాలనే తమ అనుచరులు పట్టుపట్టి, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రూటుమార్చి పెల్లుతుంటే ఆపినారని, తనతో కూడా ర్యాలీ వున్నవారికి ఎలా వెళ్ళాలో చెప్పకుండా, ఏమి జరుగుతున్నాదో తెలియనీకుండా, 2 టౌను పోలీసు స్టేషను ముందర ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించి ప్రజలకు తీవ్ర అసౌకర్యము కలిగించినందున, అక్కడ గుమిగుడిన వ్యక్తులను చెదరగొట్టి, బండి బాలజీని పోలిసే స్టేషనుకు తేవడం జరిగినది, అంతే తప్ప, హిందూ హనమాన్ శోభ యాత్రకు ఎలాంటి అంతరాయము చేయలేదు.

👉బండి బాలాజీ అతని అనుచరులు పోలీసులు నిర్దేశించిన రూటులో కాకుండా వేరే రూటులో వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగించి, ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగించినందుకు చట్టపరంగా అతనిపై కేసు నమోదు చేసి, సెక్షను 35 BNSS Act మేరకు నోటీసు జారిచేసి పంపడమైనది.

🎯ఎవరైనా తప్పుడు సమాచారము సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసిన యెడల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం.
👇
*ఇట్లు*
వి.విధ్యాసాగర్ నాయుడు, ఐ.పి.యస్,
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
అన్నమయ్య జిల్లా.

శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం నందు సోమవారం సందర్భంగా పల్లకి సేవా కార్యక్రమం నందు పాల్గొన్న భక్తులకి దేవస్థాన అర్చక స్వామ...
19/05/2025

శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం నందు సోమవారం సందర్భంగా పల్లకి సేవా కార్యక్రమం నందు పాల్గొన్న భక్తులకి దేవస్థాన అర్చక స్వాములు అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందించారని దేవస్థాన కార్య నిర్వహణ అధికారి శ్రీ డివి రమణారెడ్డి గారు తెలియజేశారు

మహానాడుకు భారీగా జన సమీకరణAP: ఈ నెల 27 నుంచి కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడుకు భారీగా జనసమీకరణ చేపట్టాలని TDP నేతలు యోచ...
19/05/2025

మహానాడుకు భారీగా జన సమీకరణ

AP: ఈ నెల 27 నుంచి కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడుకు భారీగా జనసమీకరణ చేపట్టాలని TDP నేతలు యోచిస్తున్నారు. 27, 28న జరిగే ప్రతినిధుల సభకు 30 వేల మంది, 29న జరిగే మహానాడు సభకు 5 నుంచి 10 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమ, NLR, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా పార్టీ శ్రేణులను తరలించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు అప్పగించారు.

*పత్రికా ప్రకటన**జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని.. యోగాంధ్ర 2025పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలి...
19/05/2025

*పత్రికా ప్రకటన*

*జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని.. యోగాంధ్ర 2025పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలి*

*జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి*

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని.. యోగాంధ్ర 2025పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, ముందస్తు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం,వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (ఎస్పిఎంజి),అన్ని కోర్టు కాంప్లెక్సుల్లో మరుగు దొడ్లు నిర్మాణం తదితర అంశాలపై సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ వీడియో సమావేశం నిర్వహించి ఆయా అంశాలలో తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ...
జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో కూడా ఆ రోజు గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈనెల 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025 ప్రాముఖ్యతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జిల్లాలో ముందస్తు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు.
-------------------/////-----------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా*

రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాక్ ఆన్‌లైన్ పర్యటనఅన్నమయ్య జిల్లా:రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాక్ (NAAC) అగ్రిమెం...
19/05/2025

రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాక్ ఆన్‌లైన్ పర్యటన

అన్నమయ్య జిల్లా:
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాక్ (NAAC) అగ్రిమెంటేషన్ ప్రక్రియలో భాగంగా పియర్ టీం సోమవారం ఆన్‌లైన్ పర్యటనను నిర్వహించింది. ఈ పర్యటన రెండు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కార్యక్రమంలో ప్రతి క్రైటీరియా (మూల్యాంకన ప్రమాణం) పై వివరణాత్మక సమీక్ష జరిగింది.

మొదటగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం జరిగింది. అనంతరం ఇతర క్రైటీరియాలపై సమీక్షలు జరిగాయి. విద్యా ప్రమాణాలు, సేవా కార్యక్రమాలు, మౌలిక వసతులు తదితర అంశాలపై పియర్ టీం సవివరమైన సమాచారం సేకరించింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక వర్గం, నాక్ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. పియర్ టీం సూచనలు, అభిప్రాయాలు తీసుకొని కళాశాల అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ డా. ఎం. సుధాకర్ రెడ్డి, IQAC కోఆర్డినేటర్ బి. కిరణ్ కుమార్ పేర్కొన్నారు.

మంగళవారం రెండవ రోజు కార్యక్రమం కొనసాగుతుంది.

19/05/2025

మన రాయచోటి:

బెంగళూరు నుంచి హజ్ యాత్రకు బయలుదేరిన ఆంధ్ర హజ్ యాత్రికులు....

*ఏపీలో 60 గజాలలోపు ఇళ్ల నిర్మాణం.. అనుమతులు అవసరం లేదు: ఏపీ ప్రభుత్వం*అమరావతి :ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను...
19/05/2025

*ఏపీలో 60 గజాలలోపు ఇళ్ల నిర్మాణం.. అనుమతులు అవసరం లేదు: ఏపీ ప్రభుత్వం*

అమరావతి :

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 60 గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి ఇకపై మున్సిపల్ అనుమతులు అవసరం లేకుండా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం, కేవలం ఒక రూపాయి ఫీజుతో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే స్వయంగా ధృవీకరణ చేసుకోవచ్చు. ఇందులో సర్టిఫికెట్లను స్వయంగా అప్లోడ్ చేసుకొని, స్వయంగా వాటిని ఆమోదించుకోవచ్చని తెలిపింది.

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Rayachoti:

Share