Mana Rayachoti

Mana Rayachoti RAYACHOTI & ANNAMAYYA DIRSTRICT NEWS AND AROUND THE GLOBE

గల్లంతైన పాప యామిని వయసు ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాలు ఆచూకీ లభ్యం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన మంత్రి రాష్ట్ర ర...
20/09/2025

గల్లంతైన పాప యామిని వయసు ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాలు ఆచూకీ లభ్యం

సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన మంత్రి రాష్ట్ర రవాణా క్రీడల యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ ఐఏఎస్

మాండవ్య నది వద్ద కంపచెట్ల వద్ద బాలిక మృతదేహం లభ్యం

అన్నమయ్య జిల్లా...రాయచోటి.గల్లంతైన పాప యామిని వయసు ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాలు ఆచూకీ లభ్యం...సంఘటన స్థలానికి చేరుకొని ...
20/09/2025

అన్నమయ్య జిల్లా...
రాయచోటి.

గల్లంతైన పాప యామిని వయసు ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాలు ఆచూకీ లభ్యం...

సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన మంత్రి రాష్ట్ర రవాణా క్రీడల యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ ఐఏఎస్

మాండవ్య నది వద్ద కంపచెట్ల వద్ద బాలిక మృతదేహం లభ్యం

అన్నమయ్య జిల్లా: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎస్పీ హెచ్చరికఅన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ఎస...
20/09/2025

అన్నమయ్య జిల్లా: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత వల్ల చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున, ప్రజలు అటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

జిల్లా ఎస్పీ సూచనలు:

రహదారులపై నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నడపకూడదు; నడకలోనూ జాగ్రత్తలు పాటించాలి.

విద్యుత్ స్తంభాలు, తీగలు పడే అవకాశమున్నందున వాటి సమీపంలో నిల్చోకూడదు.

పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇళ్లలో తేమ, లీకేజీ సమస్యలు ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవాలి.

చెరువులు, వాగులు, వంకలు దాటడానికి ప్రయత్నించరాదు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లి, సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి.

చిన్నపిల్లలు కుంటలు, చెరువుల్లో ఈత కొట్టడం, ఆడుకోవడం, చేపలు పట్టడం చేయరాదు.

పిడుగులు పడే సమయాల్లో చెట్లు, ఎత్తైన టవర్స్, విద్యుత్ స్తంభాల కింద నిల్చోకూడదు.

ఎవరైనా ప్రమాదకర పరిస్థితులు గమనించినా లేదా అత్యవసర సహాయం అవసరమైతే వెంటనే 100 / 112 పోలీసు ఎమర్జెన్సీ నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ కు సమాచారం అందించాలి.
– జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా

ప్రెస్ నోట్అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ క...
20/09/2025

ప్రెస్ నోట్

అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐ.పి.ఎస్., విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత కారణంగా చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

జిల్లా ఎస్పీ సూచనలు:
👉రహదారులపై నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నడపరాదు, నడకలోనూ జాగ్రత్తలు పాటించాలి.

👉విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు పడిపోయే అవకాశమున్నందున వాటి సమీపంలో నిల్చోకూడదు.

👉పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

👉వర్షాల కారణంగా ఇళ్లలో తేమ, లీకేజీ సమస్యలు ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవాలి.

👉ఎటువంటి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు దాటడానికి ప్రయత్నించరాదు.

👉అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లి, సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలి.

👉చిన్నపిల్లలు కుంటలు, చెరువుల్లో ఈత కొట్టడం, ఆడుకోవడం, చేపలు పట్టడం చేయరాదు.

👉పిడుగులు పడే సమయాల్లో చెట్లు, ఎత్తైన టవర్స్, విద్యుత్ స్తంభాల కింద నిల్చోరాదు.

👉జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా ప్రమాదకర పరిస్థితులు గమనించినా లేదా అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే 100 / 112 పోలీసు ఎమర్జెన్సీ నంబర్ కు లేదా సమీప పోలీసు స్టేషన్‌ కు సమాచారం అందించాలని సూచించారు
-జిల్లా ఎస్పీ ,అన్నమయ్య.

రాయచోటిలో విషాదం - భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న డ్రైనేజీ - డ్రైనేజి కాలువలో పడి కొట్టుకుపోయిన తల్లీ బిడ్డ- తల్లి బిడ...
19/09/2025

రాయచోటిలో విషాదం - భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న డ్రైనేజీ - డ్రైనేజి కాలువలో పడి కొట్టుకుపోయిన తల్లీ బిడ్డ- తల్లి బిడ్డను కాపాడబోయిన 25 సంవత్సరాల యువకుడు గల్లంతు - డ్రైనేజి వరద నీటిలో కొట్టుకుపోయిన 25 సంవత్సరాల యువకుడు- SN కాలనీలోని అంగన్వాడీ స్కూల్ వెనుకవైపు డ్రైనేజి కాలువలో ఘటన- ఫంక్షన్ హాల్ వద్ద శవమై తెలిన తల్లి బిడ్డ, యువకుడు- మొదటి తల్లి మున్నీతో కలిసి ఇలియాస్ అనే బాలుడు డ్రైనేజీలో పడి వరద నీటిలో మృతి- వారిని కాపాడబోయిన గణేష్ అనే యువకుడు కూడా మృతి.



పత్రికా ప్రకటన*రాజంపేట నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు మరియు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి.....**....జ...
19/09/2025

పత్రికా ప్రకటన

*రాజంపేట నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు మరియు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి.....*

*....జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్*

రాజంపేట సెప్టెంబర్ 19:

రాజంపేట నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు మరియు సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మార్వోలు ఎంపీడీవోలు వివిధ శాఖల మండల స్థాయి సిబ్బంది తదితరులతో రెవెన్యూ, వ్యవసాయం ఉద్యానవనం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాజంపేట నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశాన్ని ప్రారంభించిన రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన... రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పరిపాలనలో సమస్య వచ్చిన తర్వాత దానిపై స్పందించడం కాకుండా ప్రో యాక్టివ్ గా ఉండాలని, సమస్య రాకముందే సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా పాలన సాగాలని పేర్కొన్నారు.

రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ చెత్త సేకరణ ప్రజారోగ్య సిబ్బంది తదితర అంశాలపై రాజంపేట మున్సిపల్ కమిషనర్ తో వివిధ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా పై దృష్టి సారించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, శానిటేషన్ సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకొని సురక్షితమైన నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయంపై సమీక్షిస్తూ రాజంపేట నియోజకవర్గం లో పండిస్తున్న వివిధ రకాల పంటలు వాటి విస్తీర్ణత దృష్టి సారించాల్సిన అంశాలపై వ్యవసాయ శాఖ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యానవన శాఖ గురించి సమీక్షిస్తూ నియోజకవర్గంలో ఎక్కువగా పండిస్తున్న మామిడి అరటి పంటలపై వివరాలు అడిగి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలు మరియు ఇతర సమస్యలపై వివరాలను ఉద్యానవన శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. పశుసంవర్ధక శాఖ పై సమీక్షిస్తూ నియోజకవర్గంలో పశుసంపద వాటికి వ్యాక్సినేషన్ కార్యక్రమం సరిగా జరుగుతోందా లేదా వంటి అంశాలను పశుసంవర్ధక శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. రహదారులు మరియు భవనాలు శాఖలో పెండింగ్ పనులపై వివిధ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు మరియు భవనాల శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట్రస్థాయి రహదారులు జాతీయ రహదారులతో కలిసేలా ప్రణాళికల రూపొందించుకొని ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మరియు ఐసిడిఎస్ శాఖలవారు సమన్వయంతో పని చేయాలన్నారు. అదనపు పీహెచ్సీలు అవసరమైన చోట నివేదికలను తయారు చేసే వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. విద్యాశాఖ పై సమీక్షిస్తూ నియోజకవర్గంలో ఏ ఏ పాఠశాలల్లో ఏ సబ్జెక్టులలో విద్యార్థుల నైపుణ్యత తక్కువగా ఉంది ఎందుకు తక్కువగా ఉంది వంటి ప్రశ్నలు విద్యాశాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకంలో బస్సులలో ఆకుపన్సి రేషియో తదితర అంశాలపై ఆర్టీసీ శాఖ అధికారిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ శాఖపై సమీక్షిస్తూ స్టేజ్ కన్వర్షన్, లేఔట్లలో నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి కారణాలు తదితర అంశాలను హౌసింగ్ శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షిస్తూ ప్రస్తుతం చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై వివిధ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖపై సమీక్షిస్తూ ప్రధానమంత్రి కుసుం మరియు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాలపై వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ పై దృష్టి సారించాలని అని మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాలలో దృష్టి సారించాల్సిన అంశాల గురించి చెప్పాలని ఎంపీడీవోలను అడగగా సంబంధిత మండలాల ఎంపీడీవోలు వివిధ అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించారు.

ఈ సమావేశంలో రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన, రాజంపేట నియోజకవర్గం మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

---Issued by DIPRO, Annamayya
District---

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి పరిశుభ్రమైన రాయచోటి వైపు అడుగులురాయచోటి మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ G. రవి...
19/09/2025

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి పరిశుభ్రమైన రాయచోటి వైపు అడుగులు
రాయచోటి మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ G. రవి

రాయచోటి పట్టణంలో స్వచ్ఛతాహి సేవ 2025 కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరు సక్రమంగా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీ G. రవి గారు పిలుపునిచ్చారు. ఈ రోజు, సెప్టెంబర్ 19, 2025 శుక్రవారం నాడు, రాయచోటి స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు కళాశాల పరిసరాల శుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

స్వచ్ఛతాహి సేవ ముఖ్య లక్ష్యాలు
కమిషనర్ గారు తెలియజేసినట్లు స్వచ్ఛతాహి సేవలో భాగంగా నాలుగు ప్రధాన ఆజెండాలు అమలవుతున్నాయి:

క్లీన్ నెస్ టార్గెట్ యూనిట్ల పరివర్తన (CTUs): చెత్త మరియు దుర్వినియోగ ప్రదేశాలు (Garbage Vulnerable Points – GVPలు), వారసత్వ వ్యర్థ ప్రదేశాలను నిర్ణీత సమయంలో పూర్తిగా తొలగించడం, తిరిగి పొందిన స్థలాలను అందంగా తీర్చిదిద్దడం.

బహిరంగ ప్రదేశాల శుభ్రత: పట్టణంలోని సంస్థలు, సంస్థానాలు, ముఖ్యంగా రద్దీగా ఉండే మార్కెట్లు, బస్ స్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు పబ్లిక్ ప్రాంగణాలను శుభ్రపరచడం ద్వారా ప్రజల్లో పరిశుభ్రత అలవాటు పెంపొందించడం.

సఫాయిమిత్ర సురక్ష శిబిరాలు: మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, శ్రేయోభిలాష కార్యక్రమాలు మరియు భద్రతాపరమైన జాగ్రత్తలు అందించడం.

క్లీన్ గ్రీన్ ఉత్సవ్: పర్యావరణ అనుకూల పండుగలు నిర్వహించడం, మొక్కలు నాటే డ్రైవ్‌లు చేపట్టడం, పరిశుభ్రత మరియు పచ్చదనంతో కూడిన కార్యక్రమాలలో స్థానిక సమాజాన్ని చురుకుగా భాగస్వామ్యం చేయడం.

విద్యా సంస్థల అవగాహన కార్యక్రమాలు
ప్రజల్లో పరిశుభ్రత ఏకైక అలవాటుగా మారేందుకు విద్యార్థులు ముఖ్యమైన భాగస్వాములు కావాలని కమిషనర్ గారు అన్నారు. వారు చదివే వాతావరణం శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంటే సమాజంలోనూ అదే విధముగా విలువలు ఏర్పడతాయని వివరించారు. రాయచోటిలోని పలు విద్యా సంస్థలలో అవగాహన కార్యక్రమాలు వరుసగా జరుగుతాయని, విద్యార్థుల ప్రోత్సాహం ద్వారానే ఈ ఉద్యమం ప్రజా వ్యాప్తి అవుతుందని పేర్కొన్నారు.

కేంద్రం – రాష్ట్ర ఆదేశాల ಅನುసరణ
ఈ కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఇచ్చిన దేశవ్యాప్త ఆదేశాల ప్రకారం పట్టణంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కొనసాగుతుందని కమిషనర్ గారు స్పష్టం చేశారు. పౌరులందరూ సైతం స్వచ్ఛత పట్ల నిబద్ధతతో ఉండి కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు.

ప్రత్యేక కాలవ్యవధి
స్వచ్ఛతాహి సేవ 2025 కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు పట్టణమంతటా వివిధ ప్రదేశాలలో కొనసాగుతాయి. ఈ కాలంలో పబ్లిక్ ప్లేసుల్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, భవనాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే చిన్న ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

"మనమంతా కలిసికట్టుగా కృషి చేస్తే రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రతలో ఆదర్శంగా మార్చడం సాధ్యమే" అని కమిషనర్ గారు స్పష్టం చేశారు.

– కమిషనర్,
రాయచోటి మున్సిపాలిటీ

*అమరావతి : పాత వాహనాలపై హరిత పన్ను తగ్గిస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు.**మోటారు వాహనాల చట్టంలో సవరణ చేస్తూ బిల్లు ప్రవేశపెట్...
19/09/2025

*అమరావతి : పాత వాహనాలపై హరిత పన్ను తగ్గిస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు.*

*మోటారు వాహనాల చట్టంలో సవరణ చేస్తూ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.*

*హరిత పన్ను తగ్గింపు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.*

*హరిత పన్ను రూ.20 వేల నుంచి రూ.3 వేలకు తగ్గింపు.*

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు వారి కోరిక మేరక...
19/09/2025

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు

వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం.

19/09/2025
మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు గురువారం ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్ద...
19/09/2025

మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు గురువారం ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయడంతో, శుక్రవారం తిరుపతి నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూలై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్త్రాల దహనం కేసులో మురళి నిందితుడిగా ఉన్నారు. 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లె ఆర్డీవోగా పనిచేశారు. ఈ ఏడాది జూన్ 2న ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

సుండుపల్లి మండలం చేరుకొలపల్లి గ్రామం సమీపంలోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో భారీగా నీరు రోడ్డుమీదకు చేరింది. దీంతో ర...
19/09/2025

సుండుపల్లి మండలం చేరుకొలపల్లి గ్రామం సమీపంలోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో భారీగా నీరు రోడ్డుమీదకు చేరింది. దీంతో రాయచోటి–పించా ప్రధాన రహదారి దెబ్బతిని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారి పైగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం తాత్కాలికంగా రహదారిని బ్లాక్ చేశామని ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Rayachoti:

Share