Mana Rayachoti

Mana Rayachoti RAYACHOTI & ANNAMAYYA DIRSTRICT NEWS AND AROUND THE GLOBE

అన్నమయ్య జిల్లా//16-04-2026(రాయచోటి పట్టణం)⚜️*నూతన పార్క్ పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ......
16/04/2026

అన్నమయ్య జిల్లా//16-04-2026
(రాయచోటి పట్టణం)

⚜️*నూతన పార్క్ పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ...*

🪴 రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో మున్సిపల్ నిధులతో సుమారు రూ.47 లక్షలతో జరుగుతున్న నూతన పార్కు పనులను గురువారం ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరిశీలించారు..నాణ్యత లో రాజి లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని గుత్తేదారుడికి సూచించారు....

*కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ*మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతిమృతులంతా కర్ణ...
16/04/2026

*కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ*

మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి

మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు

ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

16/04/2026

*బొలెరో వాహనం-లారీ ఢీ.. 8 మంది మృతి*
********

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం రెడీమిక్స్ లారీని ఢీకొనడంతో 8 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు.

ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు.

గాయపడిన వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.

కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

*నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు*బెంగళూరులోని RR నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పక్షవాతంతో బాధపడ...
16/04/2026

*నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు*

బెంగళూరులోని RR నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

పక్షవాతంతో బాధపడుతున్న 75 ఏళ్ల తల్లిని ఆమె కుమారుడు వెంకటేష్ కనికరం లేకుండా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు.

తల్లి సంరక్షణ భారంగా మారిందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలంలోనే వృద్ధురాలు మృతి చెందగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

*కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి*బెంగళూరులోని ఇమ్మడిహళ్లి మెయిన్ రోడ్డులో ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్ మెంట్...
16/04/2026

*కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి*

బెంగళూరులోని ఇమ్మడిహళ్లి మెయిన్ రోడ్డులో ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్ మెంట్స్ లో చోటు చేసుకున్న సంచలన ఘటన

భర్త చంద్రశేఖర్ డ్యూటీకి వెళ్లాక తన కుమార్తె తారుణ్య(13)ను హతమార్చి, తాను సూసైడ్ చేసుకున్న సువర్ణ (45)

ఊపిరి ఆడకుండా తారుణ్యని చంపి.. సువర్ణ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు విచారణలో వెల్లడి

కుమార్తె ఫ్యూచర్ గురించి సువర్ణ ఎప్పుడూ ఆందోళన చెందేదని.. ఆ భయంతోనే ఈ పని చేసి ఉండొచ్చని అనుమానం

ఈ ఘటనపై రెండు కేసులు నమోదు.. చంద్రశేఖర్ తన భార్యపై ఫిర్యాదు, లోతుగా విచారణ చేయాలని కోరుతూ సువర్ణ తమ్ముడు ఫిర్యాదు

*☘️మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.*కర్ణాటక...
16/04/2026

*☘️మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.*

కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం బాధాకరమని తెలిపారు; గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

*ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ* చట్టసభల్లో మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం మరికాసేపట్లో ...
16/04/2026

*ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ*

చట్టసభల్లో మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం మరికాసేపట్లో మూడు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత దిశగా నేడు దేశం చరిత్రాత్మక ముందడుగు వేయబోతోందని అన్నారు. భారత దేశ మహిళలపై గౌరవంతో ఈ దిశగా సాగుతున్నామని అన్నారు. తల్లులకు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి మనం ఇచ్చే గౌరవమని వ్యాఖ్యానించారు. మహిళల గొప్పదనాన్ని చాటిచేప్పే శ్లోకాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు.

ఈ బిల్లులకు చట్టరూపం ఇచ్చేందుకు పార్లమెంటు నేటి నుంచీ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానున్న విషయం తెలిసిందే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్ఠంగా 850కు పెంచేలా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెడుతోంది. సీట్ల తుది సంఖ్యను మాత్రం డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభిస్తే 2029 నుంచీ ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల కేటాయింపుతో తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.. KP

*కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి..**అమరావతి, ఏప్రిల్ 16 :-* కర్నూలు జిల్లా చిలకలడోన వద...
16/04/2026

*కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి..*

*అమరావతి, ఏప్రిల్ 16 :-* కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొలెరో-లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. కర్ణాటకకు చెందిన భక్తుల వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని, ఘటనా స్థలంలోనే 8 మంది మృతి చెందారని వివరించారు. గాయపడిన 10 మందికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా...*👉  జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..*👉 రోడ్డు ప్రమాదాల న...
16/04/2026

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా...*

👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..*

👉 రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కొనసాగుతోన్న *"స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో "*

➡️ జిల్లాలో రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేపట్టిన "స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో " కార్యక్రమం కొనసాగుతోంది.

➡️ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా పోలీసు అధికారులు తమ సిబ్బందితో అర్ధరాత్రి దాటాక లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు, తదితర వాహనాల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపుతున్నారు.

➡️ లారీలు, కార్లు, వ్యాన్లు, బస్సులు, తదితర వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు పోలీసు అధికారులు సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.

కడప జిల్లా...కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న సినీ యాక్టర్ (పుష్ప ఫ్రెమ్ కేశవ) జగదీష్ ...దర్గాకు విచ్చేసిన సినీ యాక్...
16/04/2026

కడప జిల్లా...

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న సినీ యాక్టర్ (పుష్ప ఫ్రెమ్ కేశవ) జగదీష్ ...

దర్గాకు విచ్చేసిన సినీ యాక్టర్ (పుష్ప ఫ్రెమ్ కేశవ) జగదీష్ ను ఘనంగా స్వాగతం పలికిన దర్గా నిర్వాహకులు...

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న సినీ యాక్టర్ (పుష్ప ఫ్రెమ్ రాఘవ కేశవ)జగదీష్ ...

రేపు తెర చేప సినిమా విడుదల కాబోతుంది ప్రతిఒక్కరు ఆదరించండి...

దర్గాకు మూడవసారి రావడం చాలా సంతోషంగా ఉంది...

*విజిలెన్స్‌ కమిషనర్‌గా నీరభ్‌ కుమార్‌ నియామకం: సీఎం చంద్రబాబు ఆదేశాలు********ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది...
16/04/2026

*విజిలెన్స్‌ కమిషనర్‌గా నీరభ్‌ కుమార్‌ నియామకం: సీఎం చంద్రబాబు ఆదేశాలు*
*******

ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, విజిలెన్స్‌ కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా స్థానంలో నీరభ్‌ కుమార్‌ను నియమించారు.

ఈ నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. త్వరలోనే గవర్నర్‌ ద్వారా నియామక ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు వెల్లడించారు.

ఈ మార్పు రాష్ట్ర పరిపాలనలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

16/04/2026

చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి నారా లోకేష్, టిడిపి నాయకులతో కలిసి ప్రారంభించిన రవాణా, యువజన, క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి..

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Rayachoti:

Share