07/09/2024
*- విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్ని తొలగాలి...*
ఈ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని చెప్పారు. విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఆకాంక్షించారు.విగ్నేశ్వరుని దయతో ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆ విగ్నేశ్వరుణ్ణి ప్రార్ధించారు. ప్రతి ఒక్క ఇంటిలో మట్టి గణపతి ప్రతిమ ను పూజించాలన్నారు. మట్టి గణపతి పూజించడం ఎంతో శ్రేష్టమని " మట్టి గణపతే మహా గణపతి " అని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షణ తో దేవుణ్ణి పూజించాలని పిలుపునిచ్చారు.