Singarayakonda Updates

Singarayakonda Updates Singarayakonda is a census town in Prakasam district of the Indian state of Andhra Pradesh
(1)

మన ఊరు - మన వార్తలు నేటి సింగరాయకొండ వార్తలు :: June 7, 2026 #సింగరాయకొండ  #అప్డేట్స్Singarayakonda Updates
07/06/2026

మన ఊరు - మన వార్తలు
నేటి సింగరాయకొండ వార్తలు :: June 7, 2026


#సింగరాయకొండ #అప్డేట్స్
Singarayakonda Updates

ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి కల్పనప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల ...
06/06/2026

ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి కల్పన

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి కల్పన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ఆసక్తికరమైన బోధనా పద్ధతులను అనుసరించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని పాఠశాలలకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు అందజేస్తామని తెలిపారు. గ్యారెంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమలులో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.

అనంతరం శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి, వారు రూపొందించిన టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం)లను పరిశీలించారు. శిక్షణా కేంద్రంలో కల్పించిన వసతులు, భోజన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కోర్స్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాసరావును అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంఓ నాగేంద్ర నాయక్, జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం, ప్రథమ్ పరిశీలకులు రవిచంద్ర, మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు, కేఆర్పీలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, డీఆర్పీలు బీసాబత్తిన శ్రీనివాసరావు, కీర్తి శ్రీనివాసరావు, రమణారెడ్డి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ శిక్షణా కార్యక్రమంలో 140 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నారు.

♟️🏆 భారత చెస్‌కు మరో చారిత్రాత్మక ఘనత!భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రగ్యానంద ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ 2026 టైటిల్‌ను గెలు...
06/06/2026

♟️🏆 భారత చెస్‌కు మరో చారిత్రాత్మక ఘనత!

భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రగ్యానంద ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ 2026 టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచిన ప్రగ్యానందకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

🇮🇳 భారత చెస్ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై మరోసారి చాటిన యువ సంచలనం!

06/06/2026

𝗣𝗿𝗶𝗺𝗲 𝟵 𝗡𝗲𝘄𝘀 - ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల లో వేటకు వెళ్లి మత్స్యకార వృద్ధుడు మృతి...

మన ఊరు - మన వార్తలు నేటి సింగరాయకొండ వార్తలు :: June 6, 2026 #సింగరాయకొండ  #అప్డేట్స్Singarayakonda Updates
05/06/2026

మన ఊరు - మన వార్తలు
నేటి సింగరాయకొండ వార్తలు :: June 6, 2026


#సింగరాయకొండ #అప్డేట్స్
Singarayakonda Updates

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరిసింగరాయకొండ, జూన్ 5: ప్రపంచ పర్యావరణ ది...
05/06/2026

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి

సింగరాయకొండ, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం అత్యంత అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, కార్యదర్శి బక్కమంతల వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు కొల్లూరి వెంకట నరసింహారావు, రాఘవేంద్ర, సంజీవరెడ్డి, శ్రీనివాసులు, పంతగాని వెంకటేశ్వర్లు, వంశీ, రియాజ్, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

05/06/2026

సింగరాయకొండ రన్ వే పై ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీనికి ప్రధాన కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారు??

మన ఊరు - మన వార్తలు నేటి సింగరాయకొండ వార్తలు :: June 5, 2026 #సింగరాయకొండ  #అప్డేట్స్Singarayakonda Updates
04/06/2026

మన ఊరు - మన వార్తలు
నేటి సింగరాయకొండ వార్తలు :: June 5, 2026


#సింగరాయకొండ #అప్డేట్స్
Singarayakonda Updates

సింగరాయకొండ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..కంటైనర్ వాహనం ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడిక్కడే మృతి.సింగరాయకొండ మండల పరిధిలో...
04/06/2026

సింగరాయకొండ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..

కంటైనర్ వాహనం ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడిక్కడే మృతి.

సింగరాయకొండ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై, వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కందుకూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరై తిరిగి సింగరాయకొండకు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా, కంటైనర్ వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.

సింగరాయకొండకు చెందిన షేక్ నాగూర్ వలి ద్విచక్ర వాహనం నడుపుతుండగా, బైక్ వెనుక కూర్చున్న ఇద్దరు వృద్ధులు — అల్లి ఖాన్ మరియు నాగూర్ బి — ప్రమాదంలో ఘటన స్థలంలోనే మృతి చెందారు. అయితే వాహనం నడుపుతున్న షేక్ నాగూర్ వలికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మరియు హైవే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ను ఒంగోలు సమీపం లో అదుపులోకి తీసుకున్నారు

ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఏపీలో మద్యం బాటిళ్ల సైజు మార్పు.. లిక్కర్ షాపుల దగ్గర ఆ బోర్డులు, ఫ్లెక్సీలు పెట్టొద్దని ఆదేశాలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మ...
04/06/2026

ఏపీలో మద్యం బాటిళ్ల సైజు మార్పు.. లిక్కర్ షాపుల దగ్గర ఆ బోర్డులు, ఫ్లెక్సీలు పెట్టొద్దని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే మార్కెట్‌లోకి కొత్తగా 150 ఎంఎల్, 200 ఎంఎల్‌ పరిమాణంలో మద్యం బాటిళ్లను తీసుకురానున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 90, 180, 375, 750, 1000 ఎంఎల్‌ లిక్కర్ బాటిల్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మద్యం సరఫరా చేసే కంపెనీలు సరికొత్త ఆలోచన చేశాయి. 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో బాటిల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రతిపాదించాయి.. ఎక్సైజ్‌శాఖ కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఇకపై ఒక కేసులో 200 ఎంఎల్‌ బాటిళ్లు 45, 150 ఎంఎల్‌ బాటిళ్లు 60 ఉంటాయి.

ఈ కొత్త లిక్కర్ బాటిళ్లకు సంబంధించి.. ఐఎంఎఫ్ఎల్‌ (చౌకమద్యం) రూల్స్‌ను సవరిస్తూ ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా లిక్కర్ షాపుల్లో ఎక్కువ మంది క్వార్టర్‌ సీసాలే కొనుగోలు చేస్తుంటారు. అంతకంటే తక్కువ లిక్కర్‌ చాలనుకుంటే అందులో సగం 90ఎంఎల్‌ ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న 150, 200 ఎంఎల్‌ బాటిల్స్ ధర కొంత తగ్గుతుందని.. కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలే కొత్త పరిమాణంలోని సీసాలకూ వర్తిస్తాయి కాబట్టి అమ్మకాల్లో మార్పులొచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు, బార్ల దగ్గర బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు నిషేధించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. మంత్రి ఆదేశాలు మేరకు ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. మద్యం షాపులు, బార్ల యజమానులు ఈ ప్రభుత్వ ఆదేశాలకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో మద్యం షాపులు, బార్ల దగ్గర ఏదో ఒక బ్రాండ్‌ పేరుతోనే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ బ్రాండ్‌లను ప్రచారం చేసుకోవడానికి బ్రాండ్ పేరుతో పాటుగా షాపు, బార్ లైసెన్స్ తీసుకున్న పేరుతో కలిపి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

అయితే నిబంధనల ప్రకారం మద్యం బ్రాండ్లను ప్రచారం చేయకూడదన్నారు అధికారులు. కానీ మద్యం బ్రాండ్ కంపెనీలన్నీ ప్రచారం కోసం.. అదే బ్రాండ్‌ పేరుతో సోడా, మంచినీళ్లు అమ్మేలా రిజిస్ర్టేషన్‌ చేసుకుంటాయని గుర్తు చేశారు. మద్యం షాపులు, బార్ల దగ్గర ఏర్పాటు చేసే బ్రాండ్ పేరు పెద్దగా చూపించింది.. మంచినీళ్లు, సోడా అని ప్రింట్ చేస్తారని ఆరోపించారు. అందుకే మద్యం షాపులు, బార్ల దగ్గర ఆయా కంపెనీలు వారి బ్రాండ్‌ పేరుతో ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఈ బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు నిషేధం అమలుకు మద్యం దుకాణాలు, బార్ల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.

Address

Singarayakonda
523101

Alerts

Be the first to know and let us send you an email when Singarayakonda Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Singarayakonda Updates:

Share