Journalist siva

Journalist siva no fear

16/10/2025

గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాస్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎల్ అగ్రహారం గ్రామ పరిధి హైవేపై ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందాడు. ఐదు రోజులుగా అతని కుటుంబ సభ్యులు వివరాలు తెలియకపోవడంతో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ లో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాస్ గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, మరోసారి తన ద్రాతృత్వాన్ని చాటుకున్నారు. గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాస్ ను పలువురు అభినందిస్తున్నారు.

15/10/2025

తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది.

కన్న కొడుక్కి తలకొరివి పెట్టిన కన్నతల్లి.

ఇటీవల కొడుకు అరుణ్ కుమార్ అనారోగ్యానికి గురై మృతి చెందాడు.

గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, జయంతి కి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అరుణ్ ఉన్నారు.

పదేళ్ల కిందట భర్త వెంకటేశ్వరరావు మృతి చెందడు.

కడుపు కోతతో జయంతి కొడుకు అరుణకు తలకొరివి పెట్టింది.

దింతో కొడుక్కి తలకొరివి పెట్టిన ఘటన గ్రామస్తులను కన్నీరు పెట్టించింది.

16/02/2024

వాలంటీర్స్ 33 వేల ఆడపిల్లల అదృశ్యానికి కారణం అని నేను ఎప్పుడు అనలేదు,వాలంటీర్స్ డేటా కలెక్ట్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ లో ఉన్న మీ కంపెనీ కి వెళ్లి,అక్కడ నుంచి వేరే చోట్లకి వెళ్లిపోయింది..అంతే తప్ప,నాకు వాలంటీర్స్ అంటే గౌరవం ఉంది,వాలంటీర్స్ భవిష్యత్తుకి మేము అండగా నిలబడతాం అని తెలియజేసుకుంటున్నాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

18/07/2022

ఆవేశం తో మాట్లాడితే అనార్ధాలకు దారి తీస్తుంది, ఆలోచనతో మాట్లాడు అన్ని అర్ధం అవుతాయి,

28/06/2022

కాకినాడ జిల్లా

తుని మండలం కుమ్మరి లోవ గ్రామ శివారులో కాలనీ వద్ద రోడ్డు దాటుతున్న బెంగాల్ టైగర్

27/05/2022

కనీస సౌకర్యాలు లేని ఏజెన్సీ ప్రాంతాలు
పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. రహదారి సౌకర్యం లేక వైద్యం కోసం డోలీమోతలు తప్పని దుస్థితిలో గిరిజనులు ఉన్నారు. సలుగు పంచాయతీ దబ్బగరువు గ్రామంలో డిప్పల పైడితల్లి అనే వ్యక్తిని గురువారం రాత్రి పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు పైడితల్లిని డోలీమోతతో రాత్రి సమయంలో, కారు చీకట్లో ఇబ్బందులు పడుతూ 8 కిలోమీటర్లు మోసుకొని ఆసుపత్రికి తీసుకుని వెళుతున్నారు!

19/05/2022

అమలాపురం బండారులంక వీరభద్ర స్వామి గుడి వద్ద రోడ్డుపై బైఠాయించి అమలాపురం జిల్లా కోనసీమ జిల్లా గానే ఉండాలని ఏ పేరు వద్దు అని జై కోనసీమ అంటూ నినాదాలు చేశారు.

19/05/2022

కొండపల్లి*

*రిజర్వ్ ఫారెస్ట్ లో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు...పరారైన కేటుగాళ్లు*

రిజర్వ్ ఫారెస్ట్ లో త్రవ్వకాలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు

గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుగుతున్నట్లు అనుమానిస్తున్న అటవీ శాఖ అధికారులు

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గట్టు పై 7కిలో మీటర్ల లోపల బెన్నీ ఐరన్ కోర్ మిల్స్ సమీపంలో త్రవ్వకాలు

1880వ సంవత్సరంలో బ్రిటీష్ వారి హయాంలో నిర్మించిన ఐరన్ కోర్ మిల్స్

నిధుల కోసం పురాతన కట్టడాలను ద్వంసం చేసి సుమారు 50అడుగుల లోతు త్రవ్వకాలను చేపట్టిన అక్రమార్కులు

పురాతనమైన బావిని కూడా త్రవ్వినట్లుగా గుర్తింపు

త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో బంగారం,వజ్రాలతో కూడిన భారీ నిధి ఉన్నట్లు పుకార్లు

అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే పరారైన కేటుగాళ్లు

అడవి లో కర్రలను నరికి తయారు చేసిన నిచ్చెన ని గుర్తించి ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులు

10మంది ముఠా ఉండవచ్చని అంచనా

త్రవ్వకాలకు పాల్పడిన వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని తెలిపిన అటవీ శాఖ అధికారులు

అధికారుల తీరుపై విమర్శలు,పురాతన సంపదను,అడవిని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

పటిష్ట భద్రతని కూడా కల్పించకపోతే నిధుల కోసం త్వవ్వకాలతో కొండపల్లి అడవి తన రూపాన్ని కోల్పోనుందనడంలో అతిశయోక్తి లేదు2

18/05/2022

రాష్ట్రప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

పశ్చిమగోదావరి జిల్లా ఇరిగేషన్ వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణగారు మాట్లాడుతూ ఈ రాష్ట్రప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని గతంలో మాదిరిగా కాకుండా రైతు వెంటే ఉంటూ తాను చేసిన వ్యవసాయానికి ప్రతిఫలం అందే విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను నడిపిస్తుందని అన్నారు ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ ద్వారా కాలువలకు సేద్యపు నీటిని ప్రతి రైతుకు అందించాలనే ఆశయంతో ఈ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఎటువంటి వర్షాభావ పరిస్థితులకు తుఫాన్లకు లోనుకాని వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకోవాలని ఆయన అన్నారు అదేవిధంగా కొల్లేరు ప్రాంతంలో 4 రెగ్యులేటర్ లను నిర్మించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు జూన్ మాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదగా పనులు ప్రారంభిస్తామన్నారు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులు అవసరాలను తీర్చడం తోపాటు చివరి ధాన్యపు గింజలు వరకూ ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఇరిగేషన్ కు సంబంధించి కాంట్రాక్టర్లు అలసత్వాన్ని విడనాడాలని పరిమిత కాల వ్యవధిలో పనులను పూర్తి చేయాలని సూచించారు టెండర్లు చేజిక్కించుకొని అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూన్ మొదటి వారం లోనే నీరును ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి తదనుగుణంగా వ్యవసాయ ప్రణాళిక ఉండాలని అన్నారు

17/05/2022

*గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో... మంత్రి రోజా కు వింత అనుభవం...* ఫించన్ వస్తోంది కానీ... *నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరని, తనకు పెళ్ళిచేయాలని కోరిన వృద్ధుడు...*

Address

Tadepalligudem

Telephone

+19705023856

Website

Alerts

Be the first to know and let us send you an email when Journalist siva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Journalist siva:

Share