15/11/2023
నా వడ్డెర జాతి ప్రజలు ఎన్నికలలో ఆగం కావద్దు..
ప్రస్తుతం తాండూరులో రాజకీయ కుట్ర జరుగుతోంది..
నన్ను ఓడించడానికి విచ్చిన్నకర శక్తులు అన్ని ఒకటి అవుతున్నాయి.
మీరంతా చూస్తున్నారు..
నిన్నటి వరకు కొట్టుకున్న వ్యక్తులు, ఏనాడూ మోహాలు చూసుకోని వ్యక్తులు ఒకటి అవుతున్నారు..
నన్ను ఓడించడానికి ఈ శక్తులు ఒకటి అయ్యాయి..
అయినా నేను భయపడను, ఎందుకంటే నాకు ప్రజల అండ ఉంది..
తాండూరు ప్రజలు నాకు తోడుగా ఉన్నారు..
ఇక్కడి నుంచి ఇంటికి పోయిన తరువాత మీరు బాగా ఆలోచించాలి..
తాండూరును నాశనం చేసేందుకు పరాయి వ్యక్తులు వాలిపోయారు..
నేను అభివృద్ధి చేయాలని కృషి చేస్తుంటే, పరాయి వ్యక్తులు నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు..
వడ్డెర సామాజిక వర్గం సభ్యులు పరాయి వ్యక్తులు చెప్పే మాటలు విని ఆగం కావద్దు..
తాండూరును బాగు చేసుకునేందుకు, తాండూరు ప్రజల బాగు కొరకు మీరంతా గట్టిగా ఐక్యంగా ఉండాలి..
కారు గుర్తుకు ఓటు వేయాలి..కేసీఆర్ ను గెలిపించాలి..
మనం అధికారంలోకి వస్తున్నాం, అన్ని సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి..
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పించన్ పెరుగుతుంది..
గ్యాస్ సిలిండర్ ధర రూ.400 అవుతుంది..
ప్రతి మహిళకు ప్రతినెలా రూ.3 వేలు చెల్లిస్తాం..
పేద కుటుంబానికి చెందిన ఎవరు చనిపోయినా రూ.5 లక్షలు చెల్లిస్తారు..
కాంగ్రెస్ వస్తే, కరెంటు ఉండదు..
కాంగ్రెస్ వస్తే, ఉచిత విద్యుత్ ఉండదు..
కాంగ్రెస్ వస్తే, రైతుబంధు ఉండదు..
కాంగ్రెస్ వస్తే, రైతుబీమా ఉండదు..
కాంగ్రెస్ వస్తే, ప్రజలు సుఖంగా ఉండరు..
కాంగ్రెస్ వస్తే, ధరణి రద్దు చేస్తారు.
కాంగ్రెస్ వస్తే, పించన్లు తొలగిస్తారు..
మరి అలాంటి కాంగ్రెస్ మనకు కావాలా..??
కావున మనం కేసీఆర్ ను గెలిపించాలి..
కారు గుర్తుకు ఓటు వేయాలి..
- తాండూరు భవాని ఫంక్షన్ హాల్ లో జరిగిన వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు