YSRCP MP Gurumoorthy Anna

YSRCP MP Gurumoorthy Anna Die Hard fan Shiva Rasad Reddy
(3)

09/08/2025

రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డి గారితో తిరుపతి ఎంపీ గురుమూర్తి మూలాకత్..

మిథున్ రెడ్డి గారికి సోదరి రాఖీ కట్టడానికి అధికారుల అభ్యంతరం..

రాఖీ బాక్సులు వెనక్కి పంపిన జైలు అధికారులు..

కోర్టు అనుమతులు ఉన్నా ఒక పూటే ఇంటి భోజనానికి అనుమతిస్తున్నారు..

*ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి – తిరుపతి ఎంపి గురుమూర్తి*కేంద్ర ప్రభుత్వ శాఖలు...
06/08/2025

*ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి – తిరుపతి ఎంపి గురుమూర్తి*

కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన అంశాన్ని ప్రశ్నించారు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా నవంబర్ – 2022 నుండి మే 2025 వరకు అందిన ఫిర్యాదులు, పరిష్కరించబడిన ఫిర్యాదులు, పరిష్కరించడానికి తీసుకొన్న సగటు సమయం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అండ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా 2022 నవంబర్ నుండి 2025 మే వరకు అందిన ఫిర్యాదులు, పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య, వాటి పరిష్కారానికి తీసుకున్న సగటు సమయం, అలాగే వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై వివరణ కోరారు.

సిపిజిఆర్ఎఎంఎస్ ద్వారా ప్రజా ఫిర్యాదులని సమర్థంగా పరిష్కరిస్తున్నట్టు సంబంధిత కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. 2022 నవంబర్ 1 నుండి 2025 మే 26 వరకు 42.62 లక్షల ఫిర్యాదులు అందగా, వాటిలో 42.73 లక్షల ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని తెలియజేసారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు 64,960 మాత్రమే కాగా, ఫిర్యాదుల సగటు పరిష్కార సమయం 16 రోజులుగా నమోదైందని తెలియజేశారు.

వ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 10 దశల సంస్కరణలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆధారిత విశ్లేషణ, దేశంలోని 22 భాషల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావడం, అలాగే మూలకారణ విశ్లేషణ కోసం డేటా స్ట్రాటజీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రజా ఫిర్యాదులపై శాఖల పనితీరును తెలుసుకునేందుకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అసెస్‌మెంట్ అండ్ ఇండెక్స్ ను ప్రవేశపెట్టిందని తెలిపారు. తద్వారా పారదర్శకతతోపాటు ఉన్నతస్థాయి పరిశీలనకు అవకాశం ఏర్పడుతోందని తెలియజేసారు. గ్రామీణ ప్రాంతాల్లో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవల విస్తరణ, ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్ల ద్వారా ప్రజల స్పందనను పరిగణనలోకి తీసుకునే విధానం ఉన్నాయని తెలిపారు. అలాగే, 2024 ఆగస్టులో విడుదలైన మార్గదర్శకాల్లో పరిష్కార గడువును 30 రోజుల నుంచి 21 రోజులకు తగ్గించారని పేర్కొన్నారు.

*తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు ఆలస్యంపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి*తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల...
06/08/2025

*తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు ఆలస్యంపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి*

తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినప్పటికీ ఇంత వరకు ప్రారంభించని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.దాదాపు ఏడాది క్రితం ప్రకటించిన ఈ కేంద్రం సిబ్బంది నియామకం ఆలస్యం వల్ల ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు.

నిర్వాహక లోపాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవలు అందకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో నియామకాలు జరిగేలోగా తాత్కాలిక ఒప్పంద సిబ్బంది ద్వారా తిరుపతి సిజిహెచ్ఎస్ కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

అదేవిధంగా తిరుపతి జిల్లా శ్రీసిటీ, నెల్లూరులో ప్రతిపాదిత 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రులు కూడా ఇప్పటివరకు భూమిపూజ స్థాయికి కూడా రాలేదని చెప్పారు. కేంద్రం నుండి మంజూరు అయినప్పటికీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని విమర్శించారు. తిరుపతి జిల్లాలో సత్యవేడు, తిరుమల, నాయుడుపేట, వరదయ్యపాళెం నెల్లూరు జిల్లా ముత్తుకూరుల్లో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఇప్పటికీ ప్రారంభనికి నోచుకోలేదని, వాటి ప్రారంభం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేద, మధ్య తరగతి కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆరోగ్య పరిరక్షణ అందించే ఈ సౌకర్యాలు ఆలస్యంగా రావడం బాధాకరమని పేర్కొన్నారు.

*ఎట్టకేలకు తగిలిన సిగ్నల్**ఎంపి గురుమూర్తి కృషితో బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు మార్గం సుగమం*తిరుపతి పార్లమెంటు పరిధిలోని ...
06/08/2025

*ఎట్టకేలకు తగిలిన సిగ్నల్*

*ఎంపి గురుమూర్తి కృషితో బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు మార్గం సుగమం*

తిరుపతి పార్లమెంటు పరిధిలోని గూడూరు నియోజకవర్గం పూడిరాయదొరువు, సూళ్ళురుపేట నియోజకవర్గం ఇరకం దీవిలో ఎట్టకేలకు బిఎస్ఎన్ఎల్ 4జి టవర్ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. తీర ప్రాంత గ్రామాలైన పూడిరాయదొరువు, ఇరకం దీవిలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక తుఫాను వంటి అత్యవసర సమయాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలని అక్కడ పర్యటించిన సమయంలో స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా సరిహద్దు, మారుమూల గ్రామాల్లో 4జి టవర్లను ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో, పూడిరాయదొరువు, ఇరకం దీవి గ్రామాలను కూడా ఆ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయాలని కోరడం జరిగింది. టవర్ల ఏర్పాటుకు బిఎస్ఎన్ఎల్ అంగీకారం తెలిపినా ఈ రెండు ప్రాంతాలు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉండటంతో, అటవీ శాఖ అనుమతులు అవసరమయ్యాయి. ఇది టవర్ల ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారింది. తదుపరి తిరుపతి ఎంపి కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ శాఖ అనుమతులు, పూడిరాయదొరువు టవర్ కోసం విద్యుత్ కనెక్షన్ ఏర్పాటులో సమస్యలని బిఎస్ఎన్ఎల్ అధికారులు ఎంపీకి వివరించారు. స్పందించిన ఎంపి గురుమూర్తి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు సదరు శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. అటవీ శాఖ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ కి లేఖ రాశారు. కాగా శాఖా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపి గురుమూర్తి తెలిపారు. టవర్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో త్వరలోనే ఈ గ్రామాలకు నాణ్యమైన మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

*తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి – ఎంపి గురుమూర్తి*ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహక...
01/08/2025

*తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి – ఎంపి గురుమూర్తి*

ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో రెండు 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని, మరో నాలుగు ఆయుష్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో ఐదు ఆయుష్ ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు కూడా సహకారం అందించామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 92 కో-లొకేటెడ్ ఆయుష్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం ముఖ్యమైన ఆయుష్ మందుల సరఫరాకు కేంద్రం ద్వారా మద్దతు లభించిందని మంత్రి వివరించారు. అంతేకాక, ఒక కొత్త ఆయుష్ విద్యాసంస్థ ఏర్పాటుతో పాటు, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం అందించామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని చెంగనగుంట రూ.9.08 లక్షలు, కురుగొండ రూ.8.62 లక్షలు, మోమిడి రూ.8.01 లక్షలు, మంగళం ప్రాజెక్టుకు రూ.8.29 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నాలుగు కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి జూన్ 2025 వరకు మొత్తం 25,173 మంది లబ్ధిదారులు ఆయుష్ సేవలు పొందారని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ద్వారా ఇటీవల తిరుపతి జిల్లాలోని రాస్-కృషి విజ్ఞాన కేంద్రంలో “నన్నారి సాగు, కోత తర్వాత నిర్వహణ, మార్కెటింగ్ అవకాశాలు” అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడిందని, దాని ద్వారా సుమారు 60 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలో ఒక హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు రూ.10.80 లక్షలు, అశ్వగంధ మొక్కల ప్రచారానికి రూ.18.90 లక్షలు ఆర్థిక సహాయం అందించబడిందని కేంద్ర మంత్రి వివరించారు.

*ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్త్రుతమన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృత సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.*

31/07/2025

తాడేపల్లి లో 9 గంటలకి స్టార్ట్ అయిన తుఫాను 11:30 కు నెల్లూరులో తీరం తాకనుంది...
తుఫాన్ పేరు జగన్ జనసునామి నామకరణం...🔥

*యువతకు నైపుణ్య శిక్షణ – తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీ 4.0 అమలుపై స్పష్టత**పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కే...
30/07/2025

*యువతకు నైపుణ్య శిక్షణ – తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీ 4.0 అమలుపై స్పష్టత*

*పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం సమాధానం*

ఆధునిక సాంకేతిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కేంద్ర బడ్జెట్లో ప్రవేశ పెట్టిన ఇండస్ట్రీ 4.0 అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం లోక్‌సభలో వివరాలు కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీ 4.0 ఆధారిత శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయా, ఐజర్, ఎస్వీ యూనివర్సిటీ, లేదా ఇతర నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఈ రంగాల్లో శిక్షణ అందించేందుకు ఎంపికయ్యాయా, తిరుపతి వంటి జిల్లాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమకు మద్దతు, ప్రోత్సాహకాలు ఇచ్చారా, ఇండస్ట్రీ 4.0, డిజిటల్ తయారీ వంటి జాతీయ కార్యక్రమాల ద్వారా తిరుపతి యువతకు ప్రత్యక్ష లాభాలు వచ్చేలా కేంద్రం ఎటువంటి ప్రణాళికలు రూపొందించిందో వివరాలు కావాలని కోరారు.

ఈ ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమాధానం ఇచ్చారు. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద 2.79 లక్షలకు పైగా అభ్యర్థులను చేర్చుకుందని, ఈ కార్యక్రమం నాస్కామ్ తో సహకారంతో నడుస్తోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, త్రీడి ప్రింటింగ్, సైబర్ సెక్యూరిటీ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం పేర్కొన్నారు.

ఇటీవల తిరుపతిలో ఎంపి గురుమూర్తి కృషితో ఏర్పాటు చేయబడిన నైలెట్ కేంద్రాన్ని స్థాపించిన విషయం అందరికి విదితమే, ప్రస్తుతం తిరుపతి నైలెట్ కేంద్రంలో పైన పేర్కొన్న కోర్సులే కాకుండా పైథాన్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు డ్రోన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలను అందిస్తోందని తెలియజేసారు.

తిరుపతిలోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ కేంద్రంలో స్థానిక ఐటి పరిశ్రమ, స్టార్టప్‌లు, వాటి వ్యవస్థాపకులకు ఇంక్యుబేషన్ సేవలతోపాటు పలు సేవలను అందిస్తోందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేసిందని ఇందులో తిరుపతి జిల్లా సత్యవేడు మండలం, చెరివి గ్రామంలో, ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామం, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని తిరుపతి విమానాశ్రయం సమీపంలో, వైఎస్సార్ కడప జిల్లా, కొప్పర్తిలో సుమారు 62 కంపెనీలు రూ. 6,421 కోట్లతో 59,694 మందికి అదనపు ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలియజేసారు. ప్రభుత్వం 2021లో విశాఖపట్నంలో ఇండస్ట్రీ 4.0పై కల్పతరు సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని స్థాపించింది. ఇప్పటివరకు, కల్పతరు 45 స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చిందని తెలియజేసారు.

*ఏపీలో శాంతి భద్రతలపై వైయస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఆందోళన**లోక్ సభలో రూల్ 377 ద్వారా కేంద్రం దృష్టికి మిదున్ రెడ్డి అక...
29/07/2025

*ఏపీలో శాంతి భద్రతలపై వైయస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఆందోళన*

*లోక్ సభలో రూల్ 377 ద్వారా కేంద్రం దృష్టికి మిదున్ రెడ్డి అక్రమ అరెస్టు అంశం*

ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం మేటర్ అండర్ రూల్ 377 ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, పరిస్థితి విషమంగా మారిందని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రమాదకరమైన దాడి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా ఈ సమావేశాలలో తనతో పాటు ఉండాల్సిన తన సహచరుడు, రాజంపేట ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌ పి.వి.మిథున్ రెడ్డిని అక్రమ కేసులో అరెస్టు చేయడం గురించి ప్రస్తావించారు. ఇదొక్క సంఘటనే కాదని, ఇవన్నీ కుట్రల శ్రేణిలో భాగమని సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని బెదిరించడం, పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం, ఇవన్నీ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలుగా భావించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడం మాత్రమే కాకుండా, న్యాయం, సమానత్వం, ప్రాతినిధ్య పరంగా పాలన అనే సూత్రాల ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలన కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, రాజ్యాంగం అమలులో ఉండేలా చర్యలు తీసుకోవాలి ఎంపీ కోరారు.

*కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా భారత సైన్యం యొక్క ధైర్యం, త్యాగం మరియు అజేయ స్ఫూర్తికి వందనం. వారి ధైర్యం, అంకితభావం దేశ...
26/07/2025

*కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా భారత సైన్యం యొక్క ధైర్యం, త్యాగం మరియు అజేయ స్ఫూర్తికి వందనం. వారి ధైర్యం, అంకితభావం దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ధైర్య, సాహసాలు, సేవలను స్మరించుకొంటూ వారికి ఘన నివాళులు..*

*మద్దిల గురుమూర్తి*
*తిరుపతి ఎంపీ*

లోకసభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన పార్లమెంటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ...
25/07/2025

లోకసభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన పార్లమెంటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.

*తిరుపతి నుండి కువైట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు కోరుతూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓతో ఎంపీ గురుమూర్తి భేటీ*తిరుపతి...
23/07/2025

*తిరుపతి నుండి కువైట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు కోరుతూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓతో ఎంపీ గురుమూర్తి భేటీ*

తిరుపతి విమానాశ్రయం నుండి కువైట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభానికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ శ్రీ అలోక్ సింగ్ గారితో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, తిరుపతి విమానాశ్రయం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను, అలాగే రాయలసీమ ప్రాంతం నుండి గల్ఫ్ దేశాలలో వలస కార్మికులు ఎక్కవగా ఉండటం గురించి ఆయనకి వివరించారు. తిరుపతి నుండి నేరుగా కువైట్‌కి వెళ్లే విమానం నడిపితే గల్ఫ్ వలసదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని, దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతాయని ఆయనకి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తికి శ్రీ అలోక్ సింగ్ గారు సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

*ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న**మల్టీ టాస్కింగ్ సిబ్బంది, సాగర మి...
22/07/2025

*ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న*

*మల్టీ టాస్కింగ్ సిబ్బంది, సాగర మిత్రాలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి*

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఆమోదించబడిందని తెలిపారు. ఈ ప్రణాళిక గడువు 31 మార్చి 2025న ముగిసిందని, అయితే 15వ ఆర్థిక సంఘం చివరి వరకు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని పొడిగించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం కింద ప్రస్తుతం ఎంతమంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్య కమిషనర్ కార్యాలయంలో మత్స్య సంపద యోజన రాష్ట్ర కార్యాచరణ విభాగంలో ఒకే ఒక్క మల్టీ టాస్కింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించిందని తెలిపారు. ఈ పథకం నిబంధనల ప్రకారం సిబ్బంది నియామకం పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదిక అని తెలియజేసారు. పథకం వ్యవధి ముగిసిన తరువాత ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను లేదా సర్దుబాటును అందించే ప్రతిపాదన ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, “తీరప్రాంతం విస్తారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బ్లూ ఎకానమీ’ వృద్ధి కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి పథకాలు కీలకమన్నారు. ఇది ఫలితాలివ్వడమే కాకుండా మత్స్య జీవనోపాధులకు తోడ్పడుతోంది కాబట్టి ఈ పథకాన్ని భవిష్యత్తులో కొనసాగించాలని కోరారు. అలా ఈ పథకాన్ని కొనసాగించని పక్షంలో ఇందులో పని చేస్తున్న అనుభవజ్ఞులైన మల్టీ టాస్కింగ్ సిబ్బంది తోపాటు సుమారు 317 మంది సాగర మిత్రాలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.

Address

Tirupati

Telephone

+919010990075

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP MP Gurumoorthy Anna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share