YSRCP MP Gurumoorthy Anna

YSRCP MP Gurumoorthy Anna Die Hard fan Shiva Rasad Reddy
(3)

11/07/2025

ఆంధ్ర కింగ్ పేరు తెలుసుగా వైయస్ జే 🔥

09/07/2025

చిత్తు చిత్తు గా వచ్చిన చిత్తూర్ లో జనం ...🔥

08/07/2025

అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా పాలించి, ప్రజల కష్టాలు కడతేర్చి, భవిష్యత్ తరాల ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసిన దార్శనికుడా, మీ చిరునవ్వు ప్రజల మోముపై చిరకాలం నిలిచేలా మా ప్రయత్నం కొనసాగిస్తాం...

ప్రియతమ మహానేత, దివంగత డాక్టర్ #వైయస్_రాజశేఖరరెడ్డి_గారి 76వ జయంతి సందర్భంగా ఘన నివాళులు...🙏

జోహార్ వైయస్ఆర్

*విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల రిజిస్ట్రేషన్ సమస్యపై కేంద్ర మంత్రికి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ*ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన...
04/07/2025

*విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల రిజిస్ట్రేషన్ సమస్యపై కేంద్ర మంత్రికి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ*

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేకమంది విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు పర్మినెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. ఈ లేఖలో ఎంపీ వివరిస్తూ, విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన యువ డాక్టర్లు భారతదేశంలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ను విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారని, అంతేకాక నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేశారని పేర్కొన్నారు. అయితే, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.

ప్రదానంగా -

• కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ తరగతుల గుర్తింపు పై స్పష్టత లేకపోవడం,

• డాక్యుమెంటేషన్ విధానాలు మారడం,

• నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు లేకుండా, విదేశీ యూనివర్శిటీలకు సాధ్యంకాని ఫార్మాట్‌లలో కంపెన్సేషన్ సర్టిఫికేట్‌లను కోరడం వల్ల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ దరఖాస్తులో జాప్యాలను, తిరస్కరణలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల వల్ల యువ వైద్యులు, పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోలేక, ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ, దేశ ఆరోగ్యరంగానికి సేవ చేయలేని దుస్థితిలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకొని, ఆంధ్రప్రదేశ్ వైద్య మండలికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎంపీ గురుమూర్తి కోరారు. అంతేగాక, ఇప్పటికే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినవారికి ఒక ప్రత్యేక రాయితీగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తే అనేకమంది అభ్యర్థుల భవిష్యత్తు నిలదొక్కుకుంటుందని తెలిపారు.

*తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్‌తో కీలక ప్రతిపాదనలు – ఎంపీ మద్దిల గురుమూర్తి*ముంబయిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్...
04/07/2025

*తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్‌తో కీలక ప్రతిపాదనలు – ఎంపీ మద్దిల గురుమూర్తి*

ముంబయిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను తిరుపతి పార్లమెంటు సభ్యులు డా. మద్దిల గురుమూర్తి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి అభివృద్ధికి సహాయపడే ముఖ్య అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు.

*తిరుపతిలో టాటా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, బిపిఓ ఏర్పాటుకు విజ్ఞప్తి.*

తిరుపతి జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా, ఐజర్, ఐఐటి, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీలతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఈ ప్రాంత యువతకు అత్యాధునిక రంగాలు అయినటువంటి డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, సేవా రంగాలలో శిక్షణ కల్పించే టాటా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అవసరమని తెలిపారు. అదే విధంగా బిపిఓ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.

*కలంకారి ప్రాచీన కళకు టాటా ఫ్యాషన్ ద్వారా ప్రోత్సాహం ఇవ్వండి.*

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రాచీన కళ అయిన కలంకారీ నేటి ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తగిన గుర్తింపు పొందడం లేదని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కళను పునరుజ్జీవింపజేసేందుకు టాటా క్లిక్, వెస్ట్సైడ్ వంటి టాటా ఫ్యాషన్ సంస్థల ద్వారా కలంకారీ ఉత్పత్తులను ఆధునిక డిజైన్‌లతో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కలంకారీ కళాకారులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయని, అలాగే భారతీయ సాంస్కృతిక సంపదను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేసే అవకాశం ఉంటుందన్నారు.

*తిరుపతి నుండి కువైట్, గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించండి*

రాయలసీమకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, అయినా తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవని ఎంపీ గుర్తు చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి నుండి కువైట్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఇది స్థానికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా, భక్తుల రాకపోకలు, వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ మూడు ప్రతిపాదనలు తిరుపతి ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ఎంపీ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ కి వివరించగా సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు.

🩺 On this  , we salute the dedication, compassion, and tireless service of our doctors.You are the real heroes who heal ...
01/07/2025

🩺 On this , we salute the dedication, compassion, and tireless service of our doctors.

You are the real heroes who heal with heart and hands.

🙏 Thank you for being our strength in every crisis.

*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం* *– కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు*హర్యానాలోని గురుగ్...
01/07/2025

*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం*

*– కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు*

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ నెల‌ 3, 4 తేదీల్లో "రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర" అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్ట‌ర్ శిరీష‌ను ఆహ్వానించకుండా, డిప్యూటీ మేయర్‌ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై తిరుపతి పార్లమెంటు సభ్యులు డా.మద్దిల గురుమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖా మంత్రి మనోహర్ లాల్ కి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులోని అంశాలు పరిశీలిస్తే ... ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ను ఈ సదస్సుకు పంపనున్నట్లు పేర్కొనడం, ప్రజా ప్రాతినిధ్య నిబంధనలను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

“మేయర్‌గా ప్రజలచే నేరుగా ఎన్నికయ్యే వ్యక్తి, నగరానికి పూర్తి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాంటి అధికారిక హోదా కలిగిన వ్యక్తిని పక్కన పెట్టి డిప్యూటీ మేయర్‌ను ఎంపిక చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, నిబంధనలను ఉల్లంగించడమేనని ఎంపీ స్పష్టం చేశారు.

తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషా తిరుపతి నగరపాలక సంస్థకు మొట్టమొదటగా ఎన్నికైన మహిళా మేయర్, ప్రముఖ వైద్యురాలు, బీసీ యాదవ కమ్యూనిటీకి చెందినవారు కావడం విశేషం అని ఆయన తెలిపారు. ఆమె ఎన్నిక, సామాజిక న్యాయం, అలాగే పురుషుల‌తో స‌మానంగా రాజ‌కీయాల్లో మ‌హిళ‌లు రాణిస్తున్నార‌నేందుకు నిదర్శనమని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకొని, తిరుపతి మేయర్‌కు సదస్సుకు తగిన ఆహ్వానం అందేలా చూడాలని, అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ డిమాండ్ చేశారు.

అక్రమ కేసులను ఎదుర్కొంటూ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేందుకు జూలై 3వ తే...
28/06/2025

అక్రమ కేసులను ఎదుర్కొంటూ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేందుకు జూలై 3వ తేదీన నెల్లూరు జిల్లాకు విచ్చేసినటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు YS Jagan Mohan Reddy గారి పర్యటన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆనంవిజయ్ కుమార్ రెడ్డి గారి నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో

ఆంధ్రప్రదేశ్‌ మామిడి రైతులను ఆదుకోవాలి - కేంద్ర వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి.ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న త...
28/06/2025

ఆంధ్రప్రదేశ్‌ మామిడి రైతులను ఆదుకోవాలి - కేంద్ర వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి.

ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. లేఖలో ఎంపీ పేర్కొన్న వివరాల ప్రకారం, దేశంలోనే అత్యధికంగా 12.35 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు. ఇది దేశ మామిడి సాగు విస్తీర్ణంలో 16.5 శాతం వాటాను కలిగి ఉందని, అయితే విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉండడం సాగు పరంగా పలు మౌలిక సమస్యలను సూచిస్తోందని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో విస్తృతంగా సాగు అయ్యే తోతాపురి మామిడి ధరలు భారీగా క్షీణించడంతో రైతులు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మామిడి మద్దతు ధర కిలోకు రూ.12 ఉన్నప్పటికీ రైతులు కిలో కేవలం రూపాయి నుండి నాలుగు రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇది పంట పెట్టుబడులను కూడా తిరిగి పొందహలేని దుస్థితి అని వివరించారు. మామిడి కోత కూలీల కోసం చేసిన ఖర్చులు కూడా అందకుండా పోవడంతో చెట్లపైనే మామిడిని వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి ధర పతనంతో ఉత్పన్నమైన పలు కారణాల వలన చిత్తూరు-తిరుపతి ప్రాంతంలో ఉన్న 52 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లలో 28 యూనిట్లు మూతపడినట్లు లేఖలో వివరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ మామిడి ఎగుమతుల్లో 20% వాటా కలిగి ఉన్నా, రైతులు ఆ తాయిలో లాబాలను అందుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తోతాపురి మామిడిని ₹12 మద్దతు ధరకు కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర వ్యవసాయ ధరల సంఘం, సిసిఇఎ సమన్వయంతో ప్రత్యేక పథకం తీసుకురావాలని కోరారు.

ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం తిరుపతిలో "నేషనల్ మ్యాంగో బోర్డు" ఏర్పాటు చేయాలని, ఇది ధరల స్థిరీకరణ, మార్కెట్ అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం, రైతు సమాఖ్యలకు మద్దతు వంటి కార్యకలాపాలు నిర్వహించగలదని సూచించారు. అలాగే చిత్తూరు జిల్లాలో "జాతీయ మామిడి పరిశోధనా కేంద్రం" ఏర్పాటు చేసి పంట దిగుబడి మెరుగుదల, తెగులు నివారణ, వాతావరణ అనుకూల సాగు పద్ధతులపై పరిశోధనలు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న రైతు ఆదాయం రెట్టింపు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటాయని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.


*శ్రీకాళహస్తి బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం*శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్‌...
24/06/2025

*శ్రీకాళహస్తి బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం*

శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్‌లో కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు 16 మంది విద్యార్థులు అనారోగ్యానికి లోనై శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి తరలించబడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిల్లీలో ఉన్న ఎంపీ గురుమూర్తి చరవాణి ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అనంతరం జిల్లా బీసి సంక్షేమ శాఖ అధికారితో మాట్లాడిన ఎంపీ విద్యార్దులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్య ధోరణి సహించారనిదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలసిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

Address

Tirupati

Telephone

+919010990075

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP MP Gurumoorthy Anna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share