YSRCP MP Gurumoorthy Anna

YSRCP MP Gurumoorthy Anna Die Hard fan Shiva Rasad Reddy
(3)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో, తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ...
27/10/2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో, తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఊపందుకుంది. ప్రజల ఆరోగ్యం లాభాల వ్యాపారంగా మారకూడదనే సంకల్పం ప్రతి సంతకంలో ప్రతిధ్వనిస్తోంది.

కౌన్సిల్ సమావేశాన్ని రౌడీయిజానికి వేదికగా మార్చిన కూటమి ప్రభుత్వం - ఎంపీ గురుమూర్తి ఆగ్రహం.తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమ...
24/10/2025

కౌన్సిల్ సమావేశాన్ని రౌడీయిజానికి వేదికగా మార్చిన కూటమి ప్రభుత్వం - ఎంపీ గురుమూర్తి ఆగ్రహం.

తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా అధికార కూటమి పార్టీ వ్యక్తులు సెనెట్ హాల్‌లోకి ప్రవేశించి కార్పొరేటర్‌పై దాడి చేసిన ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా విస్తరించే అంశాన్ని ప్రధాన అజెండాగా పెట్టాలని కోరారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన పవిత్ర వేదిక అయిన కౌన్సిల్ హాల్‌లో పట్టపగలు గుండాయిజాన్ని ప్రోత్సాహించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఎంపీ మండిపడ్డారు.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో భద్రత ఉండాల్సిన సమావేశ మందిరంలోనూ దాడులు జరగడం ప్రభుత్వం వైఫల్యమని స్పష్టం చేశారు. గతంలో డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో తమ కార్పొరేటర్లను అపహరించడానికి బయట దాడులకు పాల్పడితే, ఇప్పుడు ఏకంగా సెనెట్ హాలు లోపలే దాడి జరగడం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తిరుపతిలో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితుల్లో మత్తులో వ్యక్తులు సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. మంచి అజెండాపై చర్చ జరుగుతున్న సమయంలో దానిని అడ్డుకునేందుకే కుట్రపూరితంగా ఈ దాడి జరిపించిందని ఆయన ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రోత్సాహస్తుందా అని ప్రశ్నించిన ఎంపీ, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అరాచక ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.





తిరుపతి వై.యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురు...
23/10/2025

తిరుపతి వై.యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు.

*ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఒక్కరూ సురక్షితంగా దీపావళి పండ...
20/10/2025

*ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఒక్కరూ సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు !*

*ఇట్లు మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ*

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి...
18/10/2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు..

ఏర్పేడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి.ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారి 565 పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న...
18/10/2025

ఏర్పేడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి.

ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారి 565 పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను శనివారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పరిశీలించారు. ఏర్పేడు ఎల్.సి 36 రైల్వే క్రాసింగ్ కారణంగా ఆ రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గుర్తించి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. 2023 లో రూ. 98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనా పనులు ఇంకా నత్తనడకన సాగుతుండటం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ ఐఐటి, ఐజర్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులు, అలాగే వెంకటగిరి, రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో ఎంపీ గురుమూర్తి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాలను పరిశీలించారు.

అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడిన ఎంపీ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తయితే ఏర్పేడు-వెంకటగిరి మార్గంలో వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా, విద్యార్ధులు, ప్రయాణికులు, వ్యాపారులు, సరుకు రవాణాకు పెద్ద ఉపశమనం కలుగుతుందని ఆయన తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.

విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు.
02/10/2025

విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు.


అహింసతో ఆయుధాలను జయించిన మహనీయుడు, ప్రపంచానికి శాంతి మంత్రం నేర్పిన సాధకుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా నివాళు...
02/10/2025

అహింసతో ఆయుధాలను జయించిన మహనీయుడు, ప్రపంచానికి శాంతి మంత్రం నేర్పిన సాధకుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా నివాళులు..

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమికవైసీపీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప్ర‌శంస‌దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్...
27/09/2025

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక

వైసీపీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప్ర‌శంస‌

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక పోషిస్తుందని తిరుపతి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి ప్ర‌శంసించారు. తిరుప‌తి ఐఐటీ శాశ్వ‌త క్యాంప‌స్ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా రూ.2313 కోట్ల అంచనాలతో ఫేజ్‌-బీ ప‌నుల‌కు శ‌నివారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ విధానంలో భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఈ ప్రాంతానికి గర్వకారణమ‌న్నారు. అలాగే చారిత్రక రోజన్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు యువ‌త ఉజ్వ‌ల భ‌విష్య‌త్ నిర్మాణ‌మ‌న్నారు. ఇందుకోసం సుస్థిరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పిస్తూ, విద్యార్థుల ఆవిష్కరణలకు, పరిశోధనలకు కొత్త దారులు తీసుకువస్తున్న ప్రాజెక్టుగా ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఐఐటీ ప‌రిశోధ‌న ఫ‌లితాలు అందుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన డీఆర్‌డీఏ, టాటా, జేఎస్‌డ‌బ్ల్యూ లాంటి సంస్థ‌ల‌తో తిరుప‌తి ఐఐటీ స‌మ‌న్వ‌యంతో ముందుకెళుతూ పరిశ్రమలకు బలం చేకూర్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు.

అదే సమయంలో ఈ ప్రాంతంలోని మామిడి, టమాటా రైతులకు ఉపయోగ‌ప‌డేలా ఆహార ప్రాసెసింగ్ రంగంపై కూడా ఐఐటీ తిరుపతి దృష్టి సారించిందన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి కూడా త‌న ప‌రిశోధన ఫ‌లాల్ని అందిస్తోంద‌ని ఆయ‌న కొనియాడారు. దీని ద్వారా రైతులకు సాంకేతికత, ఆవిష్కరణలు, వృద్ధి అందుబాటులోకి వస్తాయన్నారు. రెండో దశలో సుమారు 2,500 మంది విద్యార్థులకు సేవలందించనున్న ఈ సంస్థ యువతకు, ప్రాంత అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందిస్తోంద‌న్నారు.

ఈ ప్రాజెక్టును ఆమోదించి తిరుపతికి కేటాయించినందుకు గాను ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడైన ఆయన ఎప్పుడైనా తిరుపతి అభివృద్ధి కోసం కోరినప్పుడు అపారమైన సహకారం అందిస్తున్నారని ఆయ‌న కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామ‌ని ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు.

ప్ర‌ధాని చొర‌వ‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డంతో విద్యార్థులు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. దేశాన్ని ముందుకు న‌డ‌పడంలో ఐఐటీ నుంచి వ‌చ్చే యువ‌త కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆయ‌న కొనియాడారు. మ‌రీ ముఖ్యంగా త‌న సొంత మండలంలో ఉన్న ఐఐటీకి అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించిన ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాల‌న్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ఐఐటీ మొదటి ఫెజ్ నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించార‌న్నారు. దేశం ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకెళ్ల‌డానికి ప్ర‌త్యేక భూమిక తిరుప‌తి ఐఐటీ పోషిస్తోంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన‌డం సంతోషంగా, గ‌ర్వంగా వుంద‌న్నారు.

రోడ్డు ప్రమాదంలో డా.కిషోర్, చిన్నారి అశ్విత మరణం అత్యంత బాధాకరం. చిన్న వయస్సులోనే వైద్య వృత్తిలో ప్రజలకు సేవలందించిన డా....
25/09/2025

రోడ్డు ప్రమాదంలో డా.కిషోర్, చిన్నారి అశ్విత మరణం అత్యంత బాధాకరం. చిన్న వయస్సులోనే వైద్య వృత్తిలో ప్రజలకు సేవలందించిన డా.కిషోర్ మృతి సమాజానికి లోటు కాగా, అమాయక చిన్నారి అశ్విత మరణం హృదయ విదారకం. ఈ ప్రమాదంలో గాయపడిన కార్పొరేటర్ డా.సంద్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మానసిక స్తైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

*తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణ కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి*తిరుమల పరకామణి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప...
22/09/2025

*తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణ కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి*

తిరుమల పరకామణి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసం దెబ్బతింటోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వేర్వేరుగా లేఖలు రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా పరకామణిలో దొంగతనం, దుర్వినియోగం జరిగిందని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని తన లేఖలో పేర్కొన్నారు. తిరుమల పరకామణి కేవలం నిధుల సమాహారం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తుందని, వారి నమ్మకం సడలిపోయేలా చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భారత రాజ్యాంగం మత సామరస్యాన్ని, మతపరమైన సంస్థల పవిత్రతను కాపాడాలని స్పష్టం చేస్తోందని గుర్తు చేసిన ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.

రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి మతాన్ని వాడుకోవడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో నిజానిజాలను వెలుగులోకి తేవడానికి, భక్తుల విశ్వాసాన్ని కాపాడడం కేవలం సీబీఐ విచారణ ద్వారానే సాధ్యమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. స్వతంత్ర సీబీఐ దర్యాప్తు ద్వారా తప్పుడు ఆరోపణలకు తెరపడుతుందని, తిరుమల పవిత్రత కాపాడబడుతుందని, కోట్లాది భక్తుల విశ్వాసం బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయం ఎప్పటికీ రాజకీయాల నుండి దూరంగా ఉండాలని, కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు.

*రొయ్య రైతులపై అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు**– ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్రం స్పందన*ఆంధ్...
18/09/2025

*రొయ్య రైతులపై అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు*

*– ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్రం స్పందన*

ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రస్తావించిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా విధించిన దిగుమతి సుంకాల కారణంగా రొయ్య రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే రొయ్యలలో దాదాపు 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుండగా, తిరుపతి జిల్లాలోనే 28 వేల ఎకరాల్లో సుమారు 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందని ఎంపీ కేంద్రానికి వివరించారు.

ఈ విషయంపై సమగ్ర పరిశీలన జరిపిన తర్వాత, మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా)తో చర్చించి పలు చర్యలు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. అమెరికా పరస్పర సుంకాల నిర్ణయం నేపథ్యంలో ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అధిక విలువ కలిగిన సముద్ర జాతుల ఉత్పత్తి వైపు దృష్టి సారించిందని తెలిపారు. ఇందులో సీబాస్, కోబియా, పొంపానో, క్రాబ్, తిలాపియా, గ్రూపర్, బ్లాక్ టైగర్, స్కాంపి వంటి జాతులను ప్రోత్సహిస్తోందన్నారు. తద్వారా ఆక్వాకల్చర్ రైతుల ఆదాయ భద్రతను పెంచి, అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో టారిఫ్‌ల కారణంగా వచ్చే ఆదాయ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తెలియజేశారు.

అంతేకాకుండా, ఎంపెడా ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను గుర్తించడం తోపాటుగా, ఇప్పటికే ఉన్న మార్కెట్లను విస్తరించే దిశగా కృషి చేస్తోందన్నారు. రైతులకు లాభదాయకమైన ధరలు లభించేలా విదేశీ ప్రదర్శనలు, కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు, వాణిజ్య ప్రతినిధి బృందాల ద్వారా చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపిందని తెలియజేశారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపి, మార్కెట్ యాక్సెస్ పెంపు, టారిఫ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

Address

Tirupati

Telephone

+919010990075

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP MP Gurumoorthy Anna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share