Rajadhani Vartalu

Rajadhani Vartalu Breaking News from Capital Amarvati, AP, TS, National,International-rajadhanivartalu.com
9440662699 In print a weekly newspaper since Oct-2015.

PROFESSIONAL PROFILE

VASTITUDE MEDIA Pvt.Ltd: Founder & Managing Director - 2015 to till date
• Established a media house in 2015 to play an important role in print, digital & social media activities. Also publishing news on digital & social media plotforms like website, youtube, facebook & twitter. In addition conducting press briefs, business meet-ups
• Accredited Journalist from the government

of Andhra Pradesh since 2015, Card no: SHQ-0664

RAJADHANI VARTALU: A print publication weekly
• Editor & Publisher of ‘Rajadhani Vartalu’, a Telugu weekly newspaper. First news weekly being published from Amaravati, Capital City of AP
• Publishing people’s problems & propagate government schemes to the people, thus being a catalyst in the development of AP. This 7-year-old weekly has won the appreciation from all sections of AP
• Distribution to AP secretariat & Assembly employees, Ministers, Officers and in local communities surrounding Mangalagiri, Guntur & Vijayawada

ONLINE
• Rajadhanivartalu.com - an online website, publishing daily news
• Social Media- Publish news on regular intervals on various platforms’ like facebook, youtube, twitter

INFORMATION TECHNOLOGY: 1999 - 2014
• NRI, Returned from America, Worked in Top software firms like Oracle America, NEC Electronics, Keane, Polycom & Top 5 consulting firms like Deloitte, Fox, Barclays Bank, Dolby Labs, HCMC, Wells Fargo & UTHCT
• Lived in USA for 14 years. Senior IT professional with PeopleSoft-Oracle implementation experience incorporating best business practices. Acted as a Liaison, recruited consultants for projects, helped clients at onsite, certified in ITIL with excellent communication and inter-personal skills

ACHIEVEMENTS, COMMUNITY SERVICE & INTERESTS
• Legal: Won the case thus, helped release INR 227 Cr. on Dec 27th from the government of AP to Engineering students of year 2019-2020 under Jagananna Vidyadeevena Fees Reimbursement Scheme by filing Public Interest Litigation(PIL) - 67 of 2021
• Helped build local prayer hall for Muslim welfare society of Rayapudi by donating Rs.15 lakhs
• Sponsored students education & make them the best citizens of the Nation
• Promote Education, Youth Training & Skill development
• Mentoring students on technology, guide them on the available jobs both at home & in USA
• Creating awareness on Human rights, Greenery, government schemes for the welfare of the people
• Despite previous government’s obstacles, helped in felicitating farmer’s grievances, assigned land owners, students & farm labors, bring the issues to the notice of govt. for amicable issue resolutions
• Lives in Rayapudi, which is in the core capital area of Amaravati, AP

OTHERS
• Founder of Amaravati Welfare Council, AP – NGO, now handed over to Sri Ramanuja Trust
• President, AP Chapter-All India Small&Medium News Papers Federation (AISMNF),New Delhi– 2019

12/12/2025

విశాఖ: విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం

• మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో పూర్తి కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ పూర్తి క్యాంపస్

• 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనున్న కాగ్నిజెంట్

• అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగించనున్న కాగ్నిజెంట్

• ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి

• కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటుకు భూమిపూజ

• ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్

• త్వరలోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు

• ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు

• గూగుల్ రాకతో ఇప్పటికే డేటా సిటీగా ఎదుగుతున్న విశాఖ

• కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు ప్రారంభించడంతో విశాఖ వైపు ప్రముఖ ఐటీ కంపెనీల చూపు

• ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు, రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా పెరిగిన అవకాశాలు

• కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు

https://www.youtube.com/watch?v=AoKoZ9dqG2w
12/12/2025

https://www.youtube.com/watch?v=AoKoZ9dqG2w

********* # # # # # # # # #@@@@@@@ Vartalu Youtube Channel - news and developments from Andhra Pradesh, more so particularly from Telugu Diaspora from aroun...

12/12/2025

అనంతపురము, డిసెంబర్ 12 :

అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర (అటల్ ఆశయం - మోదీతో సుసాధ్యం ) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, పభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బిజెపి నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, రాజేష్ తదితరులతో కలిసి పాల్గొని నేటి శుక్రవారం అనంతపురము నగరంలోని గుత్తి రోడ్డులో భారత మాజీ ప్రధాని మంత్రి, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారి కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేశారు. అనంతరం మంత్రులు, తదితరులు వాజ్ పేయి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Illegal Collections Targeting Educational Institutions in APAlleged Rackets in the Name of Student and Community Associa...
12/12/2025

Illegal Collections Targeting Educational Institutions in AP
Alleged Rackets in the Name of Student and Community Associations

Illegal Collections Targeting Educational Institutions in AP

11/12/2025

బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలి

గుంటూరు, డిసెంబరు 11 : గుంటూరు జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. బాల్య వివాహాలు వలన కలిగే అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) కార్యక్రమంపై వందరోజుల ప్రచార కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమస్య పరిష్కారానికి వాస్తవ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుటకు సామాజిక, ఆర్థిక కారణాలు, స్పష్టమైన అంశాలను విశ్లేషించాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు నియంత్రణకు అవరోధాలుగా ఉన్న కారణాలు విశదీకరించాలని చెప్పారు. చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు విద్యావకాశాలు, ఉన్నత ఉద్యోగ అవకాశాలు వాటి ఫలితాలు వివరించాల్సిన అవసరం ఉందని వివరించారు. కిశోర బాలికలపై దృష్టి సారించాలని, మహిళ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి చిన్నారులకు విద్యావకాశాలు, ఉన్నత ఉద్యోగ అవకాశాలుపై కౌన్సెలింగ్ ఇవ్వాలని తద్వారా స్ఫూర్తిని నింపాలని తెలిపారు. మహిళా సాధికారతపైన స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు. వంద రోజుల ప్రచార పర్వంలో
షెడ్యూల్ ను పక్కాగా తయారు చేయాలని ఆదేశించారు.

ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన మాట్లాడుతూ బాల్య వివాహాలు నివారణకు ప్రభుత్వం జి.ఓ నంబరు 31, 39తో ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇందులో వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞను చేశారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి,
గుంటూరు నగర పాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీనివాస రావు, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల నాయుడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రి దేవి, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

11/12/2025

బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక
•స్క్రీనింగ్ పరీక్షకు హాజరైన 723 మందిలో మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక
•12 వ తేదీన గొల్లపూడి లోని బీసీ స్టడీ సర్కిల్ లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన
•14 వ తేదీ నుండి హైద్రాబాదుకు చెందిన లా-ఎక్సెలెన్సు ఐఎఎస్ ఇన్స్టిట్యూట్ వారిచే కోచింగ్ ప్రారంభం
•బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం
•బీసీ హాస్టళ్ల మరమత్తులు, పునర్నిర్మాణ పనులకు రూ. 141 కోట్లు మంజూరు
•ప్రతి బీసీ హస్టల్ లో ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు
రాష్ట్ర బీసి, ఇ.బి.సి. సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత

అమరావతి, డిశంబరు 10: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక అయినట్లు రాష్ట్ర బీసి, ఇ.బి.సి. సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షకు హాజయ్యేందుకు 864 మంది ధరఖాస్తు చేస్తుకోగా, 723 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని, వారిలో మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన 100 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 12 వ తేదీన గొల్లపూడి లోని బీసీ స్టడీ సర్కిల్ లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించడం జరుగుతుందని, 14 వ తేదీ నుండి హైద్రాబాదుకు చెందిన లా-ఎక్సెలెన్సు ఐఎఎస్ ఇన్స్టిట్యూట్ వారిచే శిక్షణా తరగతులు ప్రారంభం అవుతాయని ఆమె తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బీసీ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని తెలిపారు. 2025-26 ఏడాదికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు ఈ నెల 7న రాష్ట్రంలోని ఏడు జిల్లా కేంద్రాల్లో స్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షకు హాజరైన 723 మంది అభ్యర్థులలో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన వంద మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరిలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. అదే విధంగా మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వ హాయాంలో బీసీల సంక్షేమాన్ని అటకెక్కించారని, వారి ఊసే పట్టించుకోలేదని మంత్రి సవిత ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే బీసీ ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. 2024-25 సంవత్సరానికి 83 మందికి సివిల్స్ శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 6500 మందికి మెగా డిఎస్సీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ అందించగా 250 మంది బీసీ అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారని వారికి అభినందనలు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్స్ కు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

బీసీ హస్టల్స్, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హాస్టళ్ల మరమత్తులకు రూ. 141 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే హస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హస్టల్స్ లో 843 టాయిలెట్లు నిర్మిస్తున్నామన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించాన్న లక్ష్యంతో సన్న బియ్యం అందించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హస్టల్స్ లో కౌన్సిలింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆదరణ 3 పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, బీసీలకు ఆపన్న హస్తం అందించడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి సవిత తెలిపారు. విశాఖ జిల్లాలోని సింహాచలం లో బాలురకు, శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు ఎం.జె.పి. స్కూల్ లలో బాలికలకు ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకు ఇంటర్ విద్యార్థులకు శిక్షణ నివ్వనున్నట్లు ఆమె తెలిపారు.

బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఎంపికైన అభ్యర్థుల్లో ప్రతిభ చూపి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలు : పురుష అభ్యర్థుల్లో డి.శ్రీనాథ్ (బీసీ -డీ, నెల్లూరు ) 94 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఎ.వెంకటదుర్గ గణేష్(బీసీ-డి, కృష్ణా) 91 మార్కులతో రెండో ర్యాంకు,90 మార్కులు సాధించిన ఎం.ఏడుకొండలు(బీసీ-డీ, ప్రకాశం), ఎస్.తాతయ్య(బీసీ-ఏ, పశ్చిమ గోదావరి), వై.వేణుగోపాల్(బీసీ-ఏ, కర్నూలు), జి.కోటేశ్వరరావు(బీసీ-ఏ, ప్రకాశం) మూడో ర్యాంకు సాధించారు.

మహిళా అభ్యర్థుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన 89 మార్కులతో కేజీ శాంతమ్మ(బీసీ-ఏ) మొదటి ర్యాంకు, 85 మార్కులతో తుర్పుగోదావరికి చెందిన కే.జ్యోతిశ్రీ(బీసీ-) రెండో ర్యాంకు, 84 మార్కులు సాధించిన కీర్తిసాయి(బీసీ-ఏ, సత్యసాయి జిల్లా), అనంతపురం జిల్లాకు చెందిన లలితజ్యోతి(బీసీ-బీ), జి.పూజ(బీసీ-డీ, ప్రకాశం) మూడో ర్యాంకు సాధించారు.

రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, అదనపు సంచాలకు చంద్రశేఖర్ రాజు, జాయింట్ డైరెక్టర్ తనూజరాణి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

11/12/2025

వ్యవసాయ యాంత్రీకరణకు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్

సాగువ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలు

హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానం

పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులపై సీసీఐపై సీఎం అసహనం

ఉద్యాన పంటల కొనుగోలుదారులతో త్వరలో సమావేశం

ధాన్యం, పత్తి, మిరప కొనుగోళ్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, డిసెంబరు 10: వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖకు సీఎం దిశానిర్దేశం చేశారు. బుధవారం సచివాలయంలో ధాన్యం, పత్తి, మిర్చి సహా వివిధ వాణిజ్య పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. శాస్త్రీయ విధానంలో పంటల సాగు ప్రణాళిక, వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించాలని తద్వారా రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను ప్రారంభించి పరికరాల వివరాలు తెలిపేలా సమాచారం ఉంచాలన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లతో పాటు వివిధ పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు, వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని.. 7.39 కోట్ల గోనె సంచులు కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్టు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రూ.4,085 కోట్ల మేర రైతులకు చెల్లింపులు చేసినట్టు సీఎంకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 32 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్టు తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్డీఎ ప్రజాప్రతినిధులు అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు. రబీ సీజన్ లో ప్రజలు తినే వెరైటీ వరి సాగుతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రాగులు, జొన్న, సజ్జ లాంటి చిరు ధాన్యాల పంటలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు.

పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన స్లాట్లు కేటాయింపు, ఇతర సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పత్తి కొనుగోళ్లలో సమస్యల్ని సృష్టించొద్దని సీసీఐకి సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. మిర్చి లాంటి పంటలకు మార్కెట్ కల్పించే విషయంలో వివిధ విశ్లేషణా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. సాగులో శాస్త్రీయ విధానాలు అవలంబించటం ద్వారా నాణ్యమైన పంట రైతులకు అందివస్తుందని వీటిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో 45,420 హెక్టార్లలో సుబాబుల్ సాగైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మార్కెట్ కు అనుగుణంగా సుబాబుల్ రైతులకు ధర దక్కేలా చూడాలని సీఎం సూచనలు జారీ చేశారు. అరటి, నిమ్మ లాంటి ఉద్యాన పంటలకు సంబంధించి కొనుగోలు దారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

ధరలు పడిపోకుండా హార్వెస్టింగ్ రేషనలైజేషన్

కనీస మద్ధతు ధర దక్కేలా వాణిజ్య పంటల హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానాన్ని పాటించాలని.. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను అనుసంధానించాలని సీఎం సూచించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పండే పంటలకు సంబంధించి ప్రొడక్ట్ క్లస్టర్ల ద్వారా పంట ఉత్పత్తి, మార్కెటింగ్ లను సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి పంటకు నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

11/12/2025

విజయవాడ, తేదీ: 10.12.2025

• 58,204 మంది అంగన్వాడీ వర్కర్లకు రూ.75 కోట్లతో సెల్ ఫోన్లు
• ఐసీడీఎస్ రాష్ట్ర స్థాయిలో 98 శాతంతో ఏ++ కేటగిరి తో నాలుగో స్థానం
• గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు
• నూతన సాంకేతికతతో అంగన్వాడీ సేవలు అందించేందుకు 5 జి సెల్ ఫోన్లు

- మహిళాభివృద్ది శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవల్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 5 జి మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని మహిళాభివృద్ది శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

స్థానిక ఎన్టీఆర్ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,204 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5 జి స్మార్ట్ ఫోన్లను అందించే కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు రూ. 75 కోట్ల వ్యయంతో మొబైల్ ఫోన్లను పంపిణీ చేసామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 4 జి ఫోన్ లు సరిగ్గా పనిచేయలేదని, అందుకే కూటమి ప్రభుత్వం 5 జి నెట్ వర్క్ తో ఫోన్ లు అందించామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 55,204 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు లక్షా 25 వేల మంది సేవలు అందిస్తున్నారన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు సచివాలయంలో శాఖల, మంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల ర్యాంకులు ప్రకటించగా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో 98 శాతం సేవలతో ఏ++ కేటగిరి తో నాలుగో స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. దీన్ని నూరు శాతం సాధించే దిశగా ఉద్యోగులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ర్యాంకింగ్ లో చివరి స్థాయిలో ఉండగా నేడు నాలుగో స్థాయికి తీసుకురావడం వెనుక ఉద్యోగులందరి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. గ్రామాల్లో తల్లిండ్రులు తమ చిన్నారులను నమ్మకం, ధైర్యం, విశ్వాసంతో అంగన్వాడీలకు పంపిస్తున్నారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా లో అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలను అందంగా తయారు చేయటానికి (పిల్లలను అందంగా అలంకరించటానికి) ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలంలోనే 3 సార్లు రూ. 1200 నుంచి రూ. 2,200 తిరిగి ఎన్ని ఆర్థికి ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ. 11,500 వరకు వేతనాలు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు కూడా ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగేలా ముఖ్యమంత్రి ధృష్టికి తీసుకెళ్లామని, దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు. 7 వేల అంగన్వాడీల్లో 5 వేల మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, మిగిలిన అంగన్వాడీలలో ఉన్న టీచర్లకు 10 తరగతి అర్హత వచ్చిన అనంతరం మెయిన్ అంగన్వాడీలుగా చేస్తామన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లో పనిచేసే సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటున్నామని ఆర్ధికంగా మీకు ఏం కావాలంటే అది చేయటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అయినప్పటికీ ఊరికే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం తగదన్నారు. యాప్ లు తగ్గించమని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ధృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో మీకు కొత్త యూనిఫాం చీరలు అందిస్తామన్నారు. ప్రతీ అంగన్వాడీ సెంటర్ కు మౌలిక వసతుల కల్పనకు లక్ష రూపాయలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని అదేసమయంలో శాఖాభివృద్ధికి కూడా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. అంగన్వాడీ ఆయాల జీతాల పెంపుపై కూడా ధృష్టి సారించామని మంత్రి తెలియజేశారు.

మహిళాభివృద్ది, శిశు సంక్షేమం కార్యదర్శి ఏ. సూర్య కుమారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు వచ్చే వారి శాతం 70 శాతం ఉండగా, రాష్ట్రంలో 96 శాతంగా ఉండటం అంగన్వాడీల పనితనానికి నిదర్శనమన్నారు. అనంతరం బాల్య వివాహ రహిత ఏపీ పోస్టర్ ను ఆవిష్కరించారు..
కార్యక్రమంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమం శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కే. ప్రవీణా, జిల్లా ఇన్ ఛార్టీ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా భేగం, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, బ్లాక్ ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Photos :- సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం
11/12/2025

Photos :- సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం

11/12/2025

ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వారోత్సవాలు: మంత్రి ఫరూక్

దేశ చరిత్రలోనే ఉర్దూ భాషాభివృషి కొరకు పాటు పడిన ఏకైక నాయకులు గౌ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని మైనారిటీ శాఖా మంత్రి ఫరూఖ్ ఉద్ఘాటించారు.
బుధవారం విజయవాడ షా జాహుర్ ముసఫిర్ ఖనలో ఉర్దూ అకాడమీ ఉద్యోగుల సమీక్షా సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రశాంగించారు. సమావేశానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ
భాషకు మతంతో సంబంధం లేదు అన్నారు.

ఉర్దూ అకాడమీ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉర్దూ భాషాభివృద్ధికి నూతన అధ్యాయం లిఖిస్తాము:

ఉర్దూ అకాడమీ ఉద్యోగుల్లో పని చేసిన వారికి గుర్తింపు, చెయ్యని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

చైర్మన్ ఫరూక్ శుబ్లీ మాట్లాడుతూ ఉద్యోగులంతా నా కుటుంబ సభ్యులు మరియు మీ కష్టాలను మా కష్టాలు అని అనుకునే విధంగా శక్తివంచన లేకుండా పని చెయ్యండి అని అన్నారు.

సీఎం గారి చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తామని అలాగే అధిక ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతానికి ఇస్తామని అన్నారు.

159 మంది ఉద్యోగుల్లో 14 మంది గైర్హాజరైన వారికి తక్షణమే మెమో జారీ చెయ్యాలని అకాడమీ సెక్రటరీ గారికి ఆదేశించడం జరిగింది.

కూటమి ప్రభుత్వం మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని షిబ్లీ అన్నారు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, టెక్నాలజీ ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచే విధంగా పని చేస్తామని అన్నారు.

వారోత్సవాలను సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ పేరుతో ఈనెల 16 నుండి 20 వరకు నిర్వహిస్తామని అన్నారు.

మీరు ఉర్దూ అకాడమీ ఉద్యోగులు కాదు కల్చరల్ అంబాసిడర్ అనగా (సాంస్కృతిక రాయబారి) అని చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ స్పష్టం చేశారు. ఉర్దూ భాష, సంస్కృతి ఇది మనందరి భారతదేశ వారసత్వం అని అన్నారు.

రానున్న 90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అకాడమీ లైబ్రరీ సెంటర్లను, కంప్యూటర్ సెంటర్లను స్వయంగా చైర్మెన్ గారే పర్యటనలు చేస్తారని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిహెచ్ శ్రీధర్ గారు, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గౌస్ పీర్ గారు, APSMFC ఎండి యాకూబ్ భాష, రాష్ట్రవ్యాప్త ఉర్దూ అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు.

11/12/2025

సరికొత్త ఆవిష్కరణలకు పర్యాటక శాఖ నాంది

వినూత్న ఆలోచనలు, 16 నెలల కాలంలో దాదాపు 30,000 పర్యాటక పెట్టుబడులతో ప్రగతికి చిరునామాగా నిలిచిన పర్యాటక శాఖ

ఇప్పటివరకు 27 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు జారీ.. వీటిలో ప్రారంభానికి సిద్ధంగా 3 ప్రాజెక్టులు ... పురోగతిలో 12 ప్రాజెక్టులు.. శంకుస్థాపనకు సిద్ధంగా 5 ప్రాజెక్టులు.. 7 ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి.. వీటన్నింటి ద్వారా పర్యాటకులకు అందుబాటులోకి 4597 రూమ్స్..

2025-26లో దేశవ్యాప్తంగా 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటళ్లు ఏపీలోనే ఏర్పాటు కావడం కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం

రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వ హయాంలో 8 పర్యాటక గమ్యస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుండి అత్యధికంగా రూ.428 కోట్ల నిధులు రాబట్టిన పర్యాటక శాఖ

టూరిజం పాలసీతో ఇన్వెస్టర్ల ఆకర్షణ..పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ తో దిశానిర్దేశం.. పారిశ్రామిక హోదాతో పర్యాటక రంగానికి ఊతం

అడ్వెంచర్ స్పోర్ట్స్ గైడ్ లైన్స్, హోమ్ స్టే మరియు బ్రెడ్, బ్రేక్ ఫాస్ట్, ఉపాధి, క్యారవాన్, ల్యాండ్ అలాట్ మెంట్ తదితర పాలసీ-2025 లతో వినూత్న ఆవిష్కరణలకు నాంది

త్వరలోనే కాంక్రీట్, చారిత్రక కట్టడాలు, మైస్, బీచ్ శాక్ , ఫిల్మ్ టూరిజం పాలసీతో పర్యాటక శాఖలో నూతనోత్తేజం

మిషన్ -2029కి అనుగుణంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి, సాంస్కృతిక మార్పిడికి కీలకమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, అధికారులు

రాష్ట్రంలో 50,000 గదుల ఏర్పాటు, 10,000 హోమ్ స్టే లు, 20 శాతం జీవీఏ సాధన, 15 శాతం ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక శాఖ టీమ్.. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా 4500 నుండి 20 వేలకు పైగా క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటుకు చర్యలు

ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటు, తలసరి ఆదాయానికి పర్యాటక శాఖ నుండి ఆర్థిక సహకారం అందించడం, ఉపాధి కల్పన, సమాజ భాగస్వామ్యంతో సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటకం దిశగా అడుగులు వేస్తోన్న పర్యాటక శాఖ

అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఏపీ పర్యాటక రంగానికి సరికొత్త జవసత్వాలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల చేయడం దానికి అనుబంధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ గైడ్ లైన్స్, హోమ్ స్టే మరియు బ్రెడ్, బ్రేక్ ఫాస్ట్, ఉపాధి, క్యారవాన్, ల్యాండ్ అలాట్ మెంట్ తదితర పాలసీ-2025 లతో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికిన పర్యాటక శాఖ అనతి కాలంలోనే అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసింది. పీపీపీ విధానంలో ముందుకు వెళ్తోన్న పర్యాటక శాఖ వందలాది మంది ఇన్వెస్టర్లను ఆకర్షించి వారి నమ్మకాన్ని పొందింది. పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ తో ఎప్పటికప్పుడు పర్యాటక పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తోంది. త్వరితగతిన ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేస్తోంది. అదే విధంగా ఐదేళ్ల కాలంలో 25,000 పర్యాటక పెట్టుబడులు లక్ష్యంగా నిర్దేశించుకున్న పర్యాటక శాఖ కేవలం ఏడాదిన్నర కాలంలోనే 30,000 కు పైగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో 50,000 గదుల ఏర్పాటు, 10,000 హోమ్ స్టే లు, 20 శాతం జీవీఏ సాధన, 15 శాతం ఉద్యోగాల కల్పన, పర్యాటకులు చేసే ఖర్చు 1700 నుండి 25000 కు పెంచేలా, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ రోజులు గడిపేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక శాఖ టీమ్ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా 4500 నుండి 20 వేలకు పైగా క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటు, తలసరి ఆదాయానికి పర్యాటక శాఖ నుండి ఆర్థిక సహకారం అందించడం, ఉపాధి కల్పన, సమాజ భాగస్వామ్యంతో సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటకం దిశగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సరికొత్త రూపుతెస్తూ అవకాశాలను అందిపుచ్చుకొని స్థానిక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ వేలాది మంది యువతకి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి మార్గం చూపిస్తోంది. త్వరలోనే కాంక్రీట్, చారిత్రక కట్టడాలు, మైస్, బీచ్ శాక్ , ఫిల్మ్ టూరిజం పాలసీతో పర్యాటక శాఖలో మరింత నూతనోత్తేజం సంతరించుకోనుంది. ఇప్పటివరకు 27 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు లభించగా వీటిలో 3 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పురోగతిలో 12, శంకుస్థాపనకు సిద్ధంగా 5, 7 ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి అయ్యాయి. ఈ నిర్మాణాలన్నీ పూర్తయితే పర్యాటకులకు 4597 రూమ్స్ అందుబాటులోకి రానున్నాయి. 2025-26లో దేశవ్యాప్తంగా 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటళ్లు ఏపీలోనే ఏర్పాటు కావడం కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం. రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వ హయాంలో 8 పర్యాటక గమ్యస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుండి అత్యధికంగా రూ.428 కోట్ల నిధులను పర్యాటక శాఖ రాబట్టి సీఎం చంద్రబాబునాయుడు విశ్వాసాన్ని గెలిచింది. అందులో అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్, అహోబిలం, నాగార్జున సాగర్, అరకు, అన్నవరం, సింహాచలం తదితర ప్రాంతాల్లో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టుల పనులు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మిషన్ -2029కి అనుగుణంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి, సాంస్కృతిక మార్పిడికి కీలకమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాటలు నిత్యం అంతర్జాతీయ, జాతీయ, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పనుల తీరుని పర్యవేక్షిస్తూ తదనుగుణంగా అధికారులకు మార్గదర్శకత్వం అందిస్తూ పర్యాటక శాఖ పురోగతికి ఇంధనంగా, పర్యాటక శాఖ ప్రగతికి చిరునామాగా నిలిచారు. త్వరలోనే పర్యాటక రంగం సరికొత్త పుంతలు తొక్కి ఏపీ ప్రపంచ పర్యాటక గమ్యస్థానాల్లో అగ్రగామిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు..

Address

6-45/1
Guntur
522237

Opening Hours

Monday 8:30am - 9pm
Tuesday 8:30am - 9pm
Wednesday 8:30am - 9pm
Thursday 8:30am - 9pm
Friday 8:30am - 9pm
Saturday 8:30am - 9pm
Sunday 8:30am - 9pm

Telephone

+919440662699

Alerts

Be the first to know and let us send you an email when Rajadhani Vartalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajadhani Vartalu:

Share