
17/05/2025
మనకాలం వీరుడు
ఉరిపడ్డ దళితుడిని మాట్లాడుతున్నాను
మైకు కోకిలా కాసేపు మౌనం పాటించు
పుడుతూనే తల్లి పేగును మెడకు తగిలించుకున్న వాడిని
ఇప్పుడు నేనొక ప్రకటన చేస్తాను
అందరూ వినయంగా వినండి
మీ పడగదుల్లోనో, పూజా మందిరాల్లోనో
మోకరిల్లునట్లుకాదు
ఈ దేశపు దళితుడి ముందు
నిలబడాల్సినట్టు నిలబదివినండి
మీరంతా చెబుతున్నట్లు
నాకు ఈ ఉరితాటి మీద నుండి చూస్తుంటే
సుందర స్వప్నాలేవీ కన్పించడంలేదు
ఆ మాటకొస్తే నాకు కులం తప్ప
మరేమీ కన్పించడం లేదు.
మన కాలపు మహా కవి, రచయిత, అనువాదకుడు, ఉద్యమకారుడు, ఆర్గనైజర్, బోధకుడు కలేకూరి ప్రసాద్ 58 వ జయంతి సందర్బంగా శుభాకాంక్షలు.
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ త్రికరణ సూత్రాలు బోధించు, పోరాడు, సమీకరించు
కు అద్దం పట్టినట్లు ఉంటాడు కలేకూరి ప్రసాద్.
అయన నేపథ్యం ఏదైనా, చివరకు అబేద్కరిజం లో తానూ భాగస్వామిగా మారి ఈ దేశపు దళిత ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి.
సరిగ్గా యాభై ఎనిమిదేళ్ల క్రితం
కంచికచర్ల నెలలో పచ్చదనంతో పాటు
ఒక అక్షరం కూడా పుట్టింది.
అక్షరం ఎదిగి ఆగ్రహమైంది, విచ్ఛిన్నమైంది
ఆ అక్షరమే కలేకూరి ప్రసాద్.
దళిత ప్రజానీకాన్ని తన రచనల ద్వారా చైతన్యపరుస్తూ, దళిత ఉద్యమ నిర్మాణాల్లో ప్రధానపాత్ర వహిస్తూ , దళిత ఉద్యమ తీరుతెన్నుల పై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎటువంటి సంకోచాలు లేకుండా ప్రకటించిన వాడు కలేకూరి ప్రసాద్.
కలేకూరి గొప్ప భావుకుడు, పకృతి ప్రేమికుడు, సున్నిత మనస్సు కల్గినవాడు గా అయన కవితలు, చూస్తుంటే అర్ధం అవుతుంది. "భూమికి పచ్చని రంగేసినట్టో - పంట చేలు పెరగాలి ఓ యమ్మలాలో" అంటూ అద్భుతమైన వర్ణన చేయగలడో - టంగుటూరు ఇందిర చనిపోయినప్పుడు, కారంచేడు, చుండూరు లాంటి సంఘటనలు జరిగినప్పుడు డైనమేట్ లా తన భావాలను వ్యక్తపరచగలడు.
సహజంగా ఒక వ్యక్తికి ఏదో ఒక కళ లో ప్రావీణ్యం ఉంటుంది. కానీ కలేకూరి బహుముఖ ప్రజ్ఞాశీలి ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళల్లో ఒకడు కలేకూరి ప్రసాద్.
అయన రాసిన అనేక వ్యాసాల్లో కొన్నిటిని ప్రస్తావిస్తాను. ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే, ఆయన మాటల్లో వేడి, దమ్ము , బాష మీద పట్టు, తన చుట్టూ వున్న పరిసరాల ను అయన అధ్యయనం చేసిన తీరు మనకి తెలుస్తుంది.
డా, బాబాసాహెబ్ అంబేడ్కర్ పుట్టినరోజును అయన "ఒక విప్లవం పుట్టిన రోజు " గా పోలుస్తాడు. శివసాగర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను సూర్యుడు తో పోలిస్తే కలేకూరి ప్రసాద్ ఏకంగా విప్లవం అంటాడు.
మన దేశంలో చాలా మంది సంఘ సంస్కర్తలు పుట్టారు, ఇంకా పుడుతూనే ఉన్నారు, కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్ అలాంటి వ్యక్తి కాదు, ఈ దేశం యొక్క రూపు మార్పులు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టిన రోజును విప్లవం తో పోల్చడం సబబుగానే ఉంటుదనిపిస్తుంది.
అమెరికాను గడగడలాడించిన సద్దాం హుస్సేన్ పట్టుబడినప్పుడు " ఉన్న ఒక్కడు పట్టుబడ్డాడు" అంటూ సద్దాం హుస్సేన్ యొక్క సామ్బ్రజ్యావాద నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీశాలి గా వర్ణించాడు.
పైన చందమామ చీమకుర్తి దేహం, రాగాల తీగెలు, తీగెలుగా చీలిపోయి మెలికలు మెలికలు తిరిగి మళ్లీ తాడులా అల్లుకుపోయింది. ఒక సలసలకాగే జలధార పాతాళం నుండి ఫౌంటెన్లా పైకెగదన్ని పర్వత శిఖరాలను అభిషేకించినట్లు ఆరోహణ, ఘోషిస్తూ కిందకు జారుతున్న జలపాతంలా అవరోహణ.
పద్య నాటకాలను , అదికూడా సత్య హరిచంద్ర నాటకం ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ చీమకుర్తి నాగేశ్వర రావు తెలుసు కానీ అయన గురించి ఇంత గొప్పగా చెప్పినవాళ్లు , రాసిన వాళ్ళు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు.
కలేకూరి ప్రసాద్ మన తెలుగు నాట దళిత ఉద్యమాలను మాత్రమే కాదు, ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలను / సాహిత్యాలను పరిశీలించిన వ్యక్తి. ప్లాబో నెరుడా , మాయ అంగెల్లో లాంటి ఆఫ్రికా రచయితల కవితలను తెలుగులో అద్భుతంగా అనువాదం చేసినటువంటి వ్యక్తి.
సహజంగా కవులు, రచయితలకు ఒక స్వార్ధ పూరిత ఆలోచన ఉంటుంది. ఇతర రచయితలను, కవులను ప్రోత్సహించే వాతావరణం ఉండదు , కానీ కలేకూరి ప్రసాద్ తన సమకాలీన , రచియితలను, కవుల గురించి రాస్తాడు, వాళ్ళను ప్రోత్సహాయిస్తాడు వాళ్ళగురించి రాస్తాడు,రాయడం అంటే ఏదో రాయడం కాదు, గొప్పగా రాస్తాడు.
చివరిగా, కలేకూరి దళితులకు ఒక సందేశాన్ని ఇస్తాడు. అదేందంటే ఆయన మాటల్లోనే మనం చేయాల్సిందంతా రాయడమే, బాగా రాయడం, వాళ్ళ ప్రమాణాల్లో, వాళ్ళ ఆమోదం కోసం కాదు, పువ్వులు వికసించినట్లు, నవ్వులు రాలినప్పుడు గుండెలు కలుక్కుమన్నట్లు గట్లు తవ్వేటప్పుడు కంది మోదు గుచ్చుకుంటే గుండెలు కలుక్కుమన్నట్లు, అప్పటిదాకా కళ కళ లాడిన పల్లెలంతా స్మశానమై, పీనుగుల పెంటగా తయారైతే కోట్ల పిడికిళ్లు ఒక్కసారి గా బిగుసుకుని ,ఒక బ్రహ్మాండమైన మెరుపు మెరిసినట్లు మన భాషలో మనం రాయాలి, మన ప్రమాణం తో మనం రాయాలి అంటాడు.
"ఆడదికన్నా అడవిలో మానుకే
విలువిచ్చేటీ ఈ దేశంలోన
ఆరడి పెట్టిన ఆడపడుచుకూ
అత్తారింటి తప్పని స్థితి యిది
బ్రతుకున నిప్పులు పోసిన అత్తకూ
గర్భశోకమూ తప్పకున్నది
పిశాచ గుణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది.
నేడు కలేకూరి 12 వ వర్ధంతి సందర్బంగా నివాళి
______ది ఎడిటర్ టైమ్స్