2telugu states news

2telugu states news 2telugu states news

20/03/2024

దేశ రక్షణ దేశం కోసం పోరాడే సైనికుడు చేతిలో ఎంత ఉంటుందో సరైన నాయకుడిని ఎంచుకుని ఓటేసే మన చేతుల్లో అంతే ఉంటుంది:-

2తెలుగు స్టేట్స్ న్యూస్:-
మనం అంటే జనం. జనం లేనిదే ఎన్నికలు లేవు. పాలన లేదు, రాజకీయం లేదు కాబట్టి మనమే ఎన్నికలకు ప్రధాన ఇంధనం. అందరం ఈ విషయాన్ని మర్చిపోయి చాలా కాలం అవుతుంది, కాదు యుగాలే అవుతున్నాయి. మళ్లీ గుర్తు తెచ్చుకుందాం! మనకు మన కోసం ఏర్పాటు చేయబడింది రాజకీయం. మన కోసం మనం ఎన్నుకునే వాడే నాయకుడు. ఎన్నికలు జరుగుతున్నాయి, అంటే అందరిలోనూ ఒక ఉత్కంఠ ఎవరు గెలుస్తారని. కొందరు ఒక పార్టీ గెలుస్తుంది అంటే ఇంకొందరు వేరే పార్టీ గెలుస్తుంది అని చర్చించుకుంటాం.ఈ పార్టీ మేనిఫెస్టో బాగుంది ఆ పార్టీ మేనిఫెస్టో వీక్ గా ఉంది అని ఆలోచిస్తుంటాం. ఎవరు గెలుస్తారు అనే చర్చలు కొనసాగిస్తుంటాం. ఇలా ఆలోచించే మనం ప్రజల కోసం పనిచేసే పార్టీని గుర్తించి గెలిపించుకోగలం అనే నమ్మకాన్ని ఎందుకు కోల్పోయాం? మనకు టైం లేకన లేక మనకెందుకనా? ఏదో ఐదేళ్ల కు ఎన్నికలు వస్తున్నాయి, వెళ్తున్నాయి అనే ధోరణిలో మెకానికల్ గా ఎన్నికల్లో పాల్గొంటున్నాం. మనల్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉన్నతి పరంగా గెలిపించే పార్టీని ఎంచుకొని మనం గెలుద్దాం అనే ఉద్దేశం మనకు లేదా?
నిజంగా ఆయా పార్టీ తెచ్చిన మేనిఫెస్టోలో పథకాలు ఎవరికిఉపయోగపడుతున్నాయి, అవి అసలు ఎవరి కోసం ఏర్పాటు చేశారు? వారికి సక్రమంగా అందుతున్నాయా? అందుబాటులో ఉన్నాయా? ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు మీలో వచ్చాయా?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడతాయి. అయితే తెల్ల కార్డు కలిగిన బడుగు, బలహీన, కడుపేద, పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ మేనిఫెస్టోల వల్ల ఉపయోగం ఎంత ? ఎవరైనా ఆలోచించారా! ఎప్పుడో రోగం వస్తే ఆరోగ్యానికి ఉపయోగపడే పథకలు కన్నా అసలు రోగం రాకుండా తినే తిండి తినగలిగే పరిస్థితి ఏది? ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి అందరికీ తెలిసినదే అయినా గుర్తు చేస్తున్న. మధ్యతరగతి కుటుంబాలే బతుకు బారమై ఒకవైపు వేలు దాటుతున్న ఇళ్ల అద్దెలు కట్టాలా, ఆకాశాన్ని అంటుతున్న సరుకుల ధరలు చూసి తిండి తినడం మానాలా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టు మిట్టడుతూ బతుకు జీవుడా అంటూ జీవితాలు వెల్లదీస్తున్నారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే ఒకవైపు కడు పేద కుటుంబాలకు సంబంధించిన వారు ఎలా బ్రతకాలి బ్రతుకా, చావా అని ఆలోచనలో మురికివాడలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ధనవంతుడు ధనవంతుడు లానే ఉంటున్నాడు. మధ్యతరగతి వాడు పేదవాడు అవుతున్నాడు. పేదవాడు కడుపేదవాడై బతుకు బండి నడపలేక చతికల పడుతున్నాడు. ఏమిటి ఈ దుస్థితి ఇక మన బాధ్యత కలిగిన ప్రభుత్వ పథకాలు వారికి ఉపయోగపడుతున్నాయ? రైతులలో కూడా సొంత భూమి కలిగి వ్యవసాయం చేసేవారు చాలా తక్కువ కనిపిస్తారు మరి రైతు భరోసాలు ఎవరికి, ఎవరిని ఆదుకోవడానికి??
మహిళలకి, యువతకి ఇంతిస్తాం మీకోసం ఈ పథకం అనే బదులు నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఇవ్వమని మనం మన దగ్గరికి వచ్చిన అభ్యర్థులను ఎందుకు ప్రశ్నించం? ఈరోజు చూసుకుంటే ప్రతి ఇంట్లోనూ డిగ్రీలు చదివి ఖాళీగా నిరుద్యోగులుగా ఉంటున్నారు వారికి ఉద్యోగం ఇచ్చే పథకాన్ని ఎందుకు తీసుకురారు ఒకవేళ ప్రవేశపెట్టిన అది అమలు కాదు ఎందుకు??
అంటే బాధ్యత గల యువత తగ్గిపోయారు. వారు ప్రశ్నించడం మర్చిపోయారు, అందుకే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన అవి అమలులోకి రావట్లేదు. ఇకనైనా యువత బాధ్యతను తెలుసుకుని వారి భవిష్యత్తు కోసం వారు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఓటు వేస్తే గెలిచే నాయకులకు మన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత ఉంది అని మనం గుర్తుంచుకోవాలి.
ఐదు సంవత్సరాలలో గుర్తులేని మనం, ఎలక్షన్స్ రాగానే మన ఇల్లు, ఇంట్లో వాళ్లను వెతుక్కుంటూ వచ్చి మరి ఓట్లు అడుగుతారు. కానీ మనం ఓటు వేయడం పనిలా భావించి వేసి వస్తున్నాం. మనం మర్చిపోయాం అసలు వారు మనకు ఏ విధంగా ఉపయోగపడతారూ, వారిని ఎందుకు
ఎంచుకుంటున్నామని. ఇలా ఒక విషయంలో కాదు మనం ఎన్నుకుంటున్న పార్టీలు గెలిచాక మనం వారి పాలనలో మనుషులలా చూడడం లేదు కుర్చీలను కాపాడుకునే యుద్ధంలో సైనికులుగా మారిపోతున్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్తున్నారు అని చెప్పంగానే మనమడిగే ప్రశ్న ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? దానికి వారి సమాధానం ప్రజలకు సేవ చేయడానికి ఇప్పుడు జరుగుతున్న పాలనలో ప్రజాసేవ చేసే పాలకులు ఎంతమంది? కాబట్టి ఇప్పటికైనా ఆలోచిద్దాం మనకు పథకాలు ఎంత ఉపయోగపడుతున్నాయి, వాటి వల్ల పేద కుటుంబాలకు ఏమి లాభం? రోజూ మూడు పూటలా అన్నం కూడా తినలేని వారి కోసం మనందరం బాధ్యతగల పౌరులుగా మారి పార్టీ వారిని ప్రశ్నిద్దాం? రాజకీయంలో మార్పు రావాలంటే అసలు రాజకీయం ఎవరికోసం ఏర్పడిందో వారిలో అంటే మనలో మార్పు రావాలి. బాధ్యతగా మనందరం నడుచుకుందాం. పైన అన్ని విషయాలు ఆలోచించి, ఏది మన ముందు తరానికి, ఈ తరానికి, అలాగే పేదవారికి మంచి చేస్తుందో ఆ పార్టీని ఎంచుకోవడంలో రచ్చబండలను వేదికగా చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. మన ఓటును సమర్థవంతంగా వినియోగించుకున్నాం. దేశ రక్షణ దేశం కోసం పోరాడే సైనికుల చేతిలో ఎంతుంటుందో, ఎంచుకునే నాయకుడి ఆలోచనలో, చేతలలో అంతే ఉంటుంది. ఆలోచించి ముందడుగు వేద్దాం . బాధ్యత గల పౌరులం అనిపించుకున్నాం. పార్టీని ఎన్నుకోవడంలో మన విజ్ఞతకి పని చెబుదాం!

20/03/2024

గ్రామాలలో సమస్యలకు తీర్పు రచ్చబండ నుండి అందించిన రోజులు గుర్తు చేసుకుందాం:-

2తెలుగు స్టేట్స్ న్యూస్:-
ప్రజలు ఎంతో నమ్మకంతో ఎంచుకున్న పార్టీలు వారి స్వార్థం కోసం పని చేసినంత కాలం మన రాష్ట్ర, దేశ పరిస్థితుల్లో మార్పు రాదా? అంటే ముమ్మాటికి రాదని చెబుతున్నారు నిపుణులు.
ప్రజలందరం నేడు జరుగుతున్న శవ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, కంసుడిరాజకీయ పాలన నుండి మన ముందు తరాలను కాపాడుకుందాం! కంసుడు తనకు హాని అని తెలిసి సొంత తోడబుట్టుని చెరసాల పాలు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ విధి వెంటాడి , వేటాడి చివరకు శిక్షను విధించింది.
అది చరిత్ర. చరిత్రలో అలా జరిగిందా అని మనం చదువుతాం. కానీ ఇది మన చరిత్ర మన పిల్లల భవిష్యత్తు మనమే ఆలోచించి ఏ రాజకీయం వలన ముందు తరాలు బాగుంటాయి అనే నిర్ణయం తీసుకొని మన చరిత్రని లిఖించుకోవాలి.
మనకు సమస్య వస్తే గ్రామాలలో పెద్ద మనుషులని, రచ్చబండలని పెట్టి న్యాయం కోసం పోరాడిన మన పెద్దలను గుర్తు చేసుకుందాం. ఎందుకు నేడు పార్టీ తరఫున ఇచ్చిన హామీలకు పథకాలకు ఆశపడి లేదా వారు ఇచ్చే డబ్బుకి ఆశపడో ఓటును దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకు వారు ఇచ్చే ధనం మన దగ్గర ఒక రోజు కూడా ఉండదు. కానీ మనం వారిని ప్రశ్నించే హక్కు ఆరోజు కూడా ఉండని ధనం కోసం కోల్పోతున్నాం. ఇకనైనా దానిని ఆపేద్దాం. ఇది నా నిర్ణయం లేక పెద్దలు నిర్ణయం మీపై రుద్దడం కాదు అందరూ ఆలోచించాల్సిన విషయం పోనీ వారు ఇచ్చే
ధనం మన పిల్లల చదువుకు ఉపయోగపడి ఉద్యోగం ఇప్పిస్తుందా? పోనీ డిగ్రీలు చదివి కాళిగా ఉంటున్న మన పిల్లలకు ఉద్యోగం కల్పిస్తుందా ? లేదా ఐదు సంవత్సరాలకు సరిపడే ఆరోగ్యానికి ఉపయోగపడే మందులు వస్తాయా? మరి ఎందుకు ఆ ధనం కోసం ఆశపడటం చెప్పండి ప్రశ్నించుకోండి ? ఎప్పుడు ప్రశ్నించే హక్కు మనది అవ్వాలి ఎదుటివారి చేతిలో కీలుబొమ్మలు కాకూడదు కాబట్టి నిర్ణయం మీది.
ఎందుకని మన పూర్వీకులు, మన పెద్దవారిలా మనం ఒక రాజకీయ నాయకుడు లేదా వారి పార్టీ అభ్యర్థులు మన గ్రామంలో, మన ఊరిలో, మన ప్రాంతంలోకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వారిని మన అవసలు తీర్చమని, ముందు ఇచ్చిన హామీలలో ఎన్ని చేశారు అని ప్రశ్నించే విధంగా ఉన్నామా? మనం ఎంత సేపు ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ఓడిపోతుందని, మానిఫెస్ట్ లో ఇది పెట్టారు, అది పెట్టారు అనే విషయాలు చర్చించి సమయాన్ని వృధా చేసుకునే బదులు వారు వచ్చే ముందు రచ్చబండ ఏర్పాటు చేసుకుని, గ్రామ పెద్దలు కూర్చుని మన గ్రామానికి, మన ప్రాంతానికి ఏం కావాలి ఎటువంటి అవసరాలకు ఇబ్బంది పడుతున్నాము అని అడిగి ఊరిలో వారితో చర్చించి వచ్చిన పార్టీ అభ్యర్థులకు తెలిపే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నాం? ముందు ఎన్నికలలో ఇచ్చిన హామీలు గురించి అడిగే హక్కును మీరు తీసుకున్న నోటు మీ నోటిని నొక్కేస్తోంది. ఇకనైనా ఇలాంటి పనులకు దూరంగా ఉండి.ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆయుధం దానిని సమర్థవంతంగా వాడదాం ప్రలోభాలకు లోనాయ్యి భవిష్యత్తుని అంధకారం చేసుకోకూడదు. మన పిల్లల భవిష్యత్తుకు బానిసత్వం అందివ్వకూడదు ప్రశ్నిద్దాం! ప్రశ్నించే హక్కును కాపాడుకుందాం!

20/03/2024

రాజ్యాంగం ప్రకారం మంత్రి ఎన్నిక:-

2తెలుగు స్టేట్స్ న్యూస్:-

రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు పూర్తిఅయ్యి ఎంచ్చుకున్న వ్యక్తి మంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు అతని సంరక్షణలోనే ప్రజలు యొక్క పాలన జరుగుతోంది.
అంటే మంత్రి అనే వ్యక్తి మీద ఆ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతను కలిగి ఉండాలి, ఆ రాష్ట్రం యొక్క ప్రజల గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఇలాంటి పరిస్థితుల్లోనైనా నిలదీయగలిగే ధైర్యం కలిగి ఉండాలి. ఆ రాష్ట్ర ప్రజల యొక్క పూర్తి బాధ్యత తనదే అని వ్యవహరించాలి. కానీ నేటి రాజకీయం ఎలా ఉంటుంది? రాజరికాన్ని అంటే పదవిని కాపాడుకోవడంలో నిమగ్నమై రాష్ట్రంలోని ప్రజల బ్రతుకులతో ఆడుకునే పాలనను అందిస్తోంది. లేదా వారి ప్రభుత్వం అయిపోయిన లేదా గద్దె దిగిపోయిన తర్వాత వారి పాలనకు గుర్తుగా కట్టించిన నాణ్యతలేని బ్రిడ్జిలు లేదా డామ్లు మిగులుతున్నాయి. పాత ప్రభుత్వం చేసిన మంచి పనిని అభినందించక పోయిన పర్వాలేదు. వారు నిర్మించిన కట్టడాలు జనసంచారానికి, మనుగడకు పనికొస్తాయని తెలిసినా వాటిని డెవలప్ చేయకుండా కూల్చి కొత్త కట్టడాలు నిర్మిస్తున్నారు. దీనివల్ల ధన నష్టం, కాలయాపన రెండు జరుగుతున్నాయి. అసలు ఈ రాజకీయ వ్యవస్థ దీనిపై నడుస్తోంది. ప్రజల నమ్మకం కోసమా, వారి క్షేమం కోసమా, రాష్ట్ర అభివృద్ధి కోసమా, లేదా ఆ పార్టీ యొక్క పంతం కోసమా, గుర్తింపు కోసమా, యజమానిషీ కోసమా, దేనికోసం???

20/03/2024

రాజకీయం:-

2తెలుగుస్టేట్స్ న్యూస్:-
రాజకీయం ఎందుకు ఏర్పాటు చేశారు??
ఒక నిర్దిష్ట సమయంలోనే ఎందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, ప్రజలు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి, అసలు ఇప్పుడు నాయకుడిలో జనం చూస్తున్న కోణం. జనం దేనిని పరిగణలోకి తీసుకుని ఎన్నికలలో పాల్గొంటున్నారు. అసలు సరైన వ్యక్తిని నాయకుడుగా ఎంచుకోగలిగే విధివిధానాలు ప్రజలు ఆచరిస్తున్నారా? వారి దృక్పథం ఏ విధంగా మారింది అసలు నాయకుడిని ఎన్నుకునే సమర్థత ఇప్పటి ప్రజలకు ఉందా! అనే ప్రశ్న కుదిపేస్తున్నాయి. ఎందరో రచయితలు, రచయిత్రులు సైతం వారి కలానికి పని చెప్పి వివరించిన దానిని అందుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వారికి అసలు ఏం కావాలో తెలియని దుస్థితిలో ఉన్నారా? తెలిసి మాకెందుకు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారా? అసలు ప్రజలు రాజకీయం పట్ల ఎటువంటి ఆలోచనని కలిగి ఉన్నారు???
మతాన్ని చూసి , బలాన్ని చూసి , లేదా తాత్కాలిక ప్రలోభాలకు లోనై వారు ఎన్నికలలో పాల్గొని నాయకుడిని ఎన్నుకుంటున్నారా? వారి నిర్లక్ష్య ధోరణి నేటి తరాన్ని , రేపటి తరాన్ని ప్రభావితం చేస్తుంది అని వారికి అవగాహన ఉందా???

13/03/2024

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి:-
2తెలుగు స్టేట్స్ న్యూస్:-
మంగళవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగాయి. నరసాపురంలో వివిధ ప్రముఖ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 114 సెక్షన్ అమలు చేయడంతో ఇటువంటి గందరగోళం, అవాంఛిత సంఘటనలు జరగకుండా పోలీసులు బందబస్తు ఏర్పాటు చేశారు. కాగా బిజీబిఎస్ ఉమెన్స్ కళాశాలలో 304 మంది విద్యార్థులకు కాను 284 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 20 మంది హాజరు కాలేదు ఈ విషయమై ఆయ విద్యార్థుల కళాశాల యాజమాన్యం వారు హాజరు కాకపోవడం గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మహిళ సాధికారత లక్ష్యంగా తెలుగుదేశం  జేనసెనా కూటమి ముందు అడుగు - గంగ్గిరెడ్ల మేఘలదేవి మహిళలు అభ్యున్నతి, స్త్రీ సాధికారతే...
08/03/2024

మహిళ సాధికారత లక్ష్యంగా తెలుగుదేశం జేనసెనా కూటమి ముందు అడుగు - గంగ్గిరెడ్ల మేఘలదేవి

మహిళలు అభ్యున్నతి, స్త్రీ సాధికారతే లక్ష్యంగా తెలుగుదేశం జేనసెనా కూటమి
కలలకు రెక్కలకు అనే సరికొత్త పథకన్ని
వనితలు కోసం తెస్తున్నమని, తెలుగు దేశం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు
విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
ఈ రాక్షస పాలనను, తెలుగుదేశం-జెనసెనా
కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిర్వీర్యం చేస్తుంది అని , కూటమి అధికారంలోకి రాగానే మహిళలు జీవితాల్లో వెలుగు తీసుకువస్తామన్నారు.
ఏ ఆడ బిడ్డకు చదువుకు సంబంధించి
డబ్బు కొరత లేకుండా,మహిళలకు వృత్తిపరమైన విద్య మార్గాలను అందించడంతో పాటు గా, వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం.
ఇంటర్మీడియట్ పూర్తి చేయిన మహిళలకు
ఈ పధకం దరఖాస్తు చెయ్యడానికి అర్హులు
ఈ పధకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంక్ లోన్ కు
తమ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
ఈ పధకంలో భాగంగా కోర్సులు కోసం
తీసుకున్న డబ్బుకు వొడ్డి పూర్తి బాధ్యత
ప్రభుత్వం ది.
దేశంలో ఎక్కడైనా కోర్స్ లను అభ్యసించవొచ్చు.
మహిళలు ఈ వెబ్సైట్ kalalakurekkalu.com రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ లింక్ కోసం
9261292612 కు మిస్సిడ్ కాల్ చెయ్యాలి అని మీడియా ముఖంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో, కొత్త రమ దేవి, డి దేవి, మంగ్గతయారు, లక్ష్మి, ఝాన్సి పాల్గొన్నారు.

Address

Vijayawada
520011

Website

Alerts

Be the first to know and let us send you an email when 2telugu states news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share