Viswaguru Bharath

Viswaguru Bharath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Viswaguru Bharath, Media/News Company, Vijayawada.

ఓ హిందూ మేలుకో!!
ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే!!
ప్రతి దేశానికీ జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది!!
దాన్ని పరిరక్షించుకోవాలి!!
అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది!!

అది సంగతి
19/06/2026

అది సంగతి

🌳🍇 నేరేడు పండ్లు మనల్ని ఏమి హెచ్చరిస్తున్నాయి?ఈ ఏడాది మార్కెట్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లే కని...
18/06/2026

🌳🍇 నేరేడు పండ్లు మనల్ని ఏమి హెచ్చరిస్తున్నాయి?

ఈ ఏడాది మార్కెట్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి అక్షరాలా పండ్లు కురుస్తున్నాయి. గతంలో తక్కువగా కాసిన చెట్లు కూడా ఈసారి విపరీతంగా పండ్లు కాయిస్తున్నాయి.

ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక ప్రకృతి మనకు ఏదైనా సందేశం ఇస్తోందా?

మన పెద్దలు ప్రకృతిని చాలా దగ్గరగా గమనించేవారు.

"వేసవిలో నేరేడు చెట్లు విపరీతంగా పండ్లు రాలిస్తే, ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశాలు ఎక్కువ."

మొదట ఇది ఒక మూఢనమ్మకం అనిపించవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా, ఆధునిక వృక్ష శాస్త్రంలో కొన్ని పరిశోధనలు ఈ పరిశీలన వెనుక ఉన్న తర్కాన్ని వివరిస్తాయి.

🌱 మాస్టింగ్ (Masting) అంటే ఏమిటి?

చాలా వృక్ష జాతులు కొన్ని సంవత్సరాల్లో అసాధారణంగా ఎక్కువ పండ్లు, విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. దీనిని "మాస్టింగ్" అంటారు.

ఇది చెట్టు తన జాతి మనుగడ కోసం అనుసరించే సహజ వ్యూహం.

🌳 స్ట్రెస్ ఫ్రూటింగ్ – ప్రకృతి యొక్క రక్షణ చర్య

భూగర్భ జలాలు తగ్గడం, దీర్ఘకాలిక ఎండలు, ఉష్ణోగ్రతల పెరుగుదల లేదా ఇతర వాతావరణ ఒత్తిళ్లు ఎదురైనప్పుడు, చెట్టు తన జీవన చక్రంలో మార్పులు చేస్తుంది.

అలాంటి సమయంలో చెట్టు కొత్త కొమ్మలు, ఆకులు పెంచడంపై కాకుండా పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై ఎక్కువ శక్తిని వెచ్చించవచ్చు.

అంటే ప్రకృతి భాషలో చెప్పాలంటే:

"నేను భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. కనీసం నా తరువాతి తరాలు అయినా బతకాలి."

అనే సంకేతం లాంటిది.

💧 నేరేడు చెట్లు ఎందుకు ప్రత్యేకం?

నేరేడు చెట్ల వేర్లు చాలా లోతుగా వెళ్తాయి. పైపొరలో నీరు లేకపోయినా భూగర్భ జలాలను ఉపయోగించగల సామర్థ్యం వీటికి ఉంటుంది.

అలాంటి చెట్లకే నీటి ఒత్తిడి కనిపిస్తే, అది భూగర్భ జలాల పరిస్థితిపై ఒక హెచ్చరిక సంకేతంగా భావించవచ్చు.

అందుకే మన పెద్దలు నేరేడు చెట్ల ప్రవర్తనను గమనించి వాతావరణం గురించి అంచనాలు వేసేవారు.

యాదృశ్చికమో, సైన్స్ యో ఈ ఏడాది వాతావరణ శాఖ కూడా . 12 రాష్ట్రాలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం ఉంటుంది అని .. అందులో తెలుగు రాష్ట్రాలువున్నాయి అని కొన్ని సూచనలు చేసింది

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ రాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలతో సమన్వయం పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లో వర్షాలు చాలా తక్కువగా పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

🌍 ప్రకృతి మనకు నేర్పే పాఠం

ప్రకృతిలో ప్రతి మార్పు వెనుక ఒక కారణం ఉంటుంది.

అధిక పండ్ల దిగుబడి అంటే తప్పనిసరిగా కరువు వస్తుందనే కాదు. వర్షపాతం, గత సంవత్సరం వాతావరణ పరిస్థితులు, చెట్ల సహజ జీవచక్రం వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టం.

ప్రకృతి మనకంటే ముందుగానే మార్పులను గుర్తిస్తుంది. మన పెద్దలు ఆ సంకేతాలను గమనించి తమ అనుభవాన్ని తరతరాలకు అందించారు.

ఈ ఏడాది నేరేడు పండ్ల సమృద్ధిని ఆనందిద్దాం.

కానీ అదే సమయంలో:

✅ నీటిని వృథా చేయకుండా వాడుదాం
✅ వర్షపు నీటిని సంరక్షిద్దాం
✅ భూగర్భ జలాలను కాపాడుదాం
✅ మరిన్ని చెట్లు నాటుదాం
✅ ప్రకృతిని గౌరవిద్దాం

ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. దాని భాషను అర్థం చేసుకోవడం మన బాధ్యత.

🌿 "ప్రకృతిని గౌరవించిన సమాజమే భవిష్యత్తును గెలుస్తుంది."

18/06/2026

జార్ఖండ్ లోని రాంచీలో RSS కార్యాలయం పైన పెట్రోల్ బాంబు దాడి చేసిన నిందితుడిని ఎ*న్కౌంటర్ చేసిన పోలీసులు

18/06/2026

అదిరిపోయింది

గత సంవత్సర కాలంలో 38,424 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసిన భారత్💪

18/06/2026

💪💪💪💪💪

1,000 కిలోమీటర్ల రేంజి ఉన్న LRLACM మిస్సైల్ పరీక్షలను 100% విజయవంతంగా నిర్వహించిన DRDO

18/06/2026

Superb News

భారత్ - బ్రిటన్ మధ్య కుదిరిన ట్రేడ్ అగ్రిమెంట్ జూలై 15 నుండి అమలులోకి రానుంది

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా దేశంలో ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకుంది.. ఒక దశలో సుమారు 13 శాతానికి చేరుకుంది.. ఇప్ప...
18/06/2026

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా దేశంలో ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకుంది.. ఒక దశలో సుమారు 13 శాతానికి చేరుకుంది.. ఇప్పుడు పెరిగిన సంపాదనకి అనుగుణంగానే ధరలు పెరిగే తప్ప విపరీత ధోరణిలో లేదు

18/06/2026

అవుట్

బెంగాల్లోని ఫాల్తా పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన జీ*హాదీలపై, ఏకంగా దేశద్రోహం కేసులు పెట్టిన బెంగాల్ పోలీసులు

18/06/2026

మోది గారు భారతదేశ ప్రదానిగా ఉన్నంతకాలం భారత్ కోసం ఏం చేయటానికైనా నేను సిద్దంగా ఉంటాను

డొనాల్డ్ ట్రంప్

18/06/2026

యోగి అతి పెద్ద విజయం

ఉత్తరప్రదేశ్ నుండి ఏకంగా 2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతులు చేసిన యోగి ప్రభుత్వం

Address

Vijayawada
520003

Telephone

+919553688665

Website

Alerts

Be the first to know and let us send you an email when Viswaguru Bharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share