19/08/2026
🚨 ఢిల్లీలో లొల్లి… కేరళలో దోస్తీ! 😏
రాహుల్ గాంధీ తరచూ చేసే విమర్శ: “మోదీ దేశాన్ని అదానీకి అప్పగిస్తున్నారు.”
కానీ కేరళలో మాత్రం మరో ఆసక్తికరమైన రాజకీయ చిత్రం కనిపిస్తోంది. 👀
⚓ అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ (Vizhinjam International Seaport)లో పూర్తి స్థాయి EXIM కార్గో కార్యకలాపాల ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకత్వం హాజరై, ఆ కార్యక్రమాన్ని ఘనంగా స్వాగతించింది.
ఒకవైపు ఢిల్లీలో అదానీపై తీవ్ర రాజకీయ విమర్శలు… మరోవైపు కేరళలో అదే అదానీ పోర్ట్ ద్వారా రాష్ట్ర వాణిజ్య, లాజిస్టిక్స్ సామర్థ్యాలకు ఊతం! 🚢
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: 👇
📌 2015 డిసెంబర్ 5: అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ప్రభుత్వ హయాంలోనే విజింజం పోర్ట్ నిర్మాణ ఒప్పందం జరిగి, పనులు ప్రారంభమయ్యాయి.
📌 ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ Adani Vizhinjam Port Pvt Ltd (AVPPL) చేపట్టింది.
📌 2016 లో ప్రభుత్వం మారి, పినరయి విజయన్ నేతృత్వంలోని LDF (లెఫ్ట్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగింది.
📌 ఇప్పుడు పూర్తిస్థాయి EXIM కార్గో కార్యకలాపాలు ప్రారంభమవుతున్న వేళ, అదే కాంగ్రెస్-లెఫ్ట్ నాయకులు ముందడుగు వేసి మరీ పాల్గొంటున్నారు.
అంటే…
🗣️ ఢిల్లీ వేదికగా: “అదానీ… అదానీ…” అంటూ విమర్శలు!
🚢 కేరళ వేదికగా: “విజింజం అభివృద్ధి… EXIM… పెట్టుబడులు… ఉద్యోగాలు!”
రాజకీయ విమర్శలు ఒక వైపు… అభివృద్ధి, మౌలిక వసతులు, ఆర్థిక ప్రయోజనాలు మరో వైపు!
నోరు తెరిస్తే అదానీ, అంబానీ అంటూ విమర్శించే కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలు, తీరా అదే అదానీ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతున్నప్పుడు మాత్రం స్వాగతించడం... ఇదేనా మీ ద్వంద్వ వైఖరి? 🤔