11/01/2026
* *31వ వార్డు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు*
*ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ సంక్రాంతి కానుక ఎక్కడ అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ సమన్వయ కర్త వాసు పల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. 31 వ వార్డు సరస్వతి పార్క్ కనకల దిబ్బ వీధిలో వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్ ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసుపల్లి ముఖ్యఅతిథిగా హాజరై వివిధ సంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు ఆటలు పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు వాసుపల్లి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ సర్కార్ అందజేసిన కంది పప్పు సైతం ఇవ్వలేని అసమర్థ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎంతో గొప్పగా చెప్పిన రు 20 కిలో గోధుమ పిండి కేవలం పట్టణాల్లోనే అది కూడా అరకొరగా ఇస్తున్నారని మండి పడ్డారు. రేషన్ డిపోలో కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుందని గుర్తు చేశారు. కూటమి కేవలం పంచదార రాగులు మాత్రమే ఇవ్వడం విడ్డురం అన్నారు. గత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖ్యమైన పండగలకు కిలో పంచదార ఇచ్చేవరని పేర్కొన్నారు. తెలుగు ప్రజల పెద్ద ప పండగ సంక్రాంతి అన్నారు. బంధుమిత్రులు స్నేహితుల అనుబంధానికి ప్రతీక ఈ పండగ అన్నారు. పట్టణాల్లో కూడా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. గాలిపఠాలు పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఎగురావేయడం సంప్రదాయం అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో నాగరాజు, మోహన్, గంట శ్రీను, నాయుడు, బాబురావు, రాము మాస్టర్, ధోని, త్రినాధ్, కనుకులు, రామ, దుర్గ, సత్య, మహేష్,సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవర మహేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.